అన్వేషించండి

Modi Telangana Tour : నవంబర్ 12న తెలంగాణలో మోదీ టూర్ - కేసీఆర్ హాజరవుతారా ?

నవంబర్ 12వ తేదీన మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమం కావడంతో కేసీఆర్ హాజరు అవుతారా లేదా అన్నదానిపై చర్చ ప్రారంభమయింది.

Modi Telangana Tour : ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. 11వ తేదీన ఏపీలోని విశాఖపట్నంలో కొత్త రైల్వే స్టేషన్ శంకుస్థాపనకు హాజరు కానున్నారు. ఆ రోజు విశాఖలోనే బహిరంగసభలో పాల్గొననున్న మోదీ.. తర్వాతి రోజు అంటే 12వ తేదీ  రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని  ప్రారంభించనున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎరువుల కర్మాగారంతోపాటు ఎన్టీపీసీ టౌన్ షిప్,  మహాత్మా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్,  ప్రధాని సభ ప్రాంగణం, ఎరువుల కర్మాగారంలో ప్రధాని వెళ్లే రూట్ మ్యాప్ ను కేంద్ర అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. నిజానికి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది.   2021 మార్చి 23న పరిశ్రమలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. నవంబర్ 12న ప్రధాని కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న మోదీ 

2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్లాంట్‌ నిర్మాణాన్ని తొలుత రూ.5,254 కోట్ల అంచనాలతో చేపట్టినా.. అది పూర్తయ్యేనాటికి రూ.6,120.55 కోట్లకు చేరుకుంది. ఈ కర్మాగారంలో నేషనల్‌ ఫెర్టిలైజర్స్, ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ భాగస్వామ్యులుగా ఉన్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక ప్లాంట్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన లాంఛనంగా ఉత్పత్తి ప్రారంభించారు. అనంతరం మార్చి 22 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించారు. ఇందులో ఉత్పత్తి చేసిన యూరియా, అమ్మోనియాను ‘కిసాన్‌ బ్రాండ్‌’పేరుతో నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ మార్కెటింగ్‌ చేస్తోంది.

మోదీ చొరవతో ప్రారంభమైన రామగుండం ఫ్యాక్టరీ 

గతంలో మూత బడిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను ప్రధాని మోడీ చొరవ చూపి తిరిగి తెరిపించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి తెలంగాణకే కాక దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు యూరియా సరఫరా కానుంది. ఆయా రాష్ట్రాలలో అన్నదాతలకు యూరియా అందుబాటులోకి వచ్చింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కర్మాగారంలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడంతో రాష్ట్రానికి 50 శాతం, మిగిలిన ఎరువులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కేటాయిస్తున్నారు.  

ప్రధాని మోదీ ప్రయటనలో కేసీఆర్ పాల్గొంటారా ?

ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ..  ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు కావడం ఆసక్తి రేపుతోంది. మోదీ తెలంగాణ పర్యటనకు వస్తే కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్నది చివరి వరకూ సస్పెన్స్ గానే ఉంటుంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తెలంగాణ ప్రభుత్వానికీ భాగస్వామ్యం ఉంది. అందుకే సీఎం ఖచ్చితంగా పాల్గొనాలని అంటారు. ఏపీలో రైల్వే స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ పాల్గొంటున్నారు. ఇక్కడ కేసీఆర్ పాల్గొనడం మాత్రం డౌటేనని చెప్పవచ్చు.  మోదీ పర్యటన ... ఆ తర్వాత బహిరంగసభ కూడా ఉండనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంది. 

బీజేపీ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు, ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణపై స్టే!

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Gachibowli DLF Road Closed 90 Days: మూడు నెలల పాటు గచ్చిబౌలి రోడ్ మూసివేత - పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవిగో
మూడు నెలల పాటు గచ్చిబౌలి రోడ్ మూసివేత - పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవిగో
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
Embed widget