అన్వేషించండి

Palla Rajeshwar Reddy: ఫిరాయింపుదారులపై పల్లా వ్యాఖ్యల దుమారం- నష్టమే అంటున్న బీఆర్‌ఎస్ నేతలు

Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ లోకి వచ్చిన ఇతర పార్టీల నేతలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Palla Rajeshwar Reddy: కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలను కుక్కలతో పోలుస్తూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండ్రోజుల క్రితం జనగామ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కుక్కలను పిల్లులుగా మార్చేందుకు ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నట్లు సీఎం కేసీఆర్ తనతో చెప్పారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఎమ్మెల్సీ పల్లా వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. 

వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి

పల్లా చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు, సీఎం కేసీఆర్ కు నష్టం కలిగిస్తాయని జనగామ నియోజకవర్గం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభిప్రాయపడ్డారు. రాజేశ్వర్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాత్రం తనకు మూడోసారి టికెట్ ఇచ్చి పోటీలోకి దింపాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా జనగామ టికెట్ ఆశించారు. 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. అధికార పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించని నాలుగు నియోజకవర్గాల్లో జనగామ కూడా ఉండటం గమనార్హం.

తన వ్యాఖ్యలను పల్లా సమర్ధించుకున్నారు. తాను ఎలాంటి తప్పుడు మాటలు అనలేదని అంటున్నారు. విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా కామెంట్ చేస్తున్నారు. 

ముగ్గురు బలమైన పోటీదారులు ఉండడంతో టికెట్ పెండింగ్ లో

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 2018లోనూ ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయనపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసే అవకాశం ఉంది. జనగామలో బీఆర్ఎస్ టికెట్ కోసం ముగ్గురు బలమైన పోటీదారులు ఉండటంతో కేసీఆర్ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది ఇంకా పెండింగ్ లోనే ఉంచారు. 2018 లో భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకున్న కొన్ని నెలల తర్వాత కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, తెలుగు దేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు స్వతంత్రులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ ఫిరాయింపులతో 119 మంది సభ్యుల అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 104కు చేరుకుంది. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ఇదే వ్యూహాన్ని అనుసరించారు. అయితే పార్టీ బలోపేతం అమలు చేసిన ఈ వ్యూహం వల్ల కొన్ని ప్రాంతాల్లో పార్టీకి నష్టం వాటిల్లింది. నేతల మధ్య అసమ్మతి పార్టీని, కార్యకర్తలను విడదీసింది. కాంగ్రెస్ పార్టీపై గెలిచి బీఆర్ఎస్ లోకి చేరిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించడం, అప్పటికే ఎంతో కాలం నుంచి పార్టీలో ఉన్న వారికి టికెట్ రాకపోవడం వల్ల అసమ్మతి పెరిగింది.

టాప్ హెడ్ లైన్స్

UDID Card Apply Online: దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
ACB Raids On DSP Bheem Reddy: ఏసీబీ వలలో సైబరాబాద్ డీఎస్బీ భీమ్ రెడ్డి - ఈ సారు లెక్క కూడా దాదాపుగా వంద కోట్లే !
ఏసీబీ వలలో సైబరాబాద్ డీఎస్బీ భీమ్ రెడ్డి - ఈ సారు లెక్క కూడా దాదాపుగా వంద కోట్లే !
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget