అన్వేషించండి

Prashanth Reddy: సోనియాను వైఎస్‌ బ్లాక్‌ మెయిల్ చేశారు: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి

Prashanth Reddy: నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాలాభిషేకం చేశారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. 

Prashanth Reddy: చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసిఆర్ అని కొనియాడారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 2009 నవంబర్ 29న ఆనాటి ఉద్యమ నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ జైత్ర యాత్రనో... కేసిఆర్ శవ యాత్రనో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నరోజని గుర్తు చేశారు. ప్రాణాలు సైతం లెక్కచేయని కేసిఆర్ మొండి ధైర్యం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని మంత్రి వెల్లడించారు. 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించిందని.. కానీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు అడ్డు పడ్డారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడుతా అని అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను, సోనియా గాంధీనీ బ్లాక్ మెయిల్ చేశారన్నారు.

దీక్షా దివస్ మలిదశ ఉద్యమానికి మలుపు రోజు..

వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే తెలంగాణలో వందలాది మంది విద్యార్థులు అమరులు అయ్యారని అన్నారు. 2009 డిసెంబర్ 9 ఇచ్చిన ప్రకటనను మళ్లీ వెనక్కి తీసుకోవడం వల్ల తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాన్చుడు వైఖరి వల్లే ఇదంతా జరిగిందన్నారు. ఆ పాపం కాంగ్రెస్ దే అన్నారు. ఐదేళ్ల ముందే రాష్ట్రం ఇచ్చి ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రగతి ఐదేళ్ల ముందు ఉండేదని అన్నారు. దీక్ష దీవస్ చరిత్రలో గొప్ప రోజు అని, మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు రోజు అని మంత్రి వేముల అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను కేసిఆర్ ఆనతి కాలంలోనే నంబర్ వన్ గా దేశానికే ఆదర్శంగా నిలిపారని అన్నారు.


Prashanth Reddy: సోనియాను వైఎస్‌ బ్లాక్‌ మెయిల్ చేశారు: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి

బీజేపీ మాయలో పడి ఆగం కావొద్దు..

సీఎం  కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతి సాధిస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వo ప్రజల అవసరాలను గుర్తిస్తూ పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. తమ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకురావడం చేతకాని బీజేపీ నాయకులు కులం, మతం, దేవుడి పేరుతో నిత్యం అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైరయ్యారు. దమ్ముంటే తమతో సమానంగా అభివృద్ధిలో పోటీ పడాలని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి మొనగాడివని నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ అరవింద్ కు సవాల్ విసిరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ నిధులన్నీ గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, బిజెపికి చెందిన ఈ ప్రాంత ఎంపీ మాత్రం నిధులు తేలేక చేతులు ఎత్తేశారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి మంచి చేస్తే మంచిది అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
Jana Nayagan Collections: 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Embed widget