అన్వేషించండి

Prashanth Reddy: సోనియాను వైఎస్‌ బ్లాక్‌ మెయిల్ చేశారు: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి

Prashanth Reddy: నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాలాభిషేకం చేశారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. 

Prashanth Reddy: చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసిఆర్ అని కొనియాడారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 2009 నవంబర్ 29న ఆనాటి ఉద్యమ నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ జైత్ర యాత్రనో... కేసిఆర్ శవ యాత్రనో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నరోజని గుర్తు చేశారు. ప్రాణాలు సైతం లెక్కచేయని కేసిఆర్ మొండి ధైర్యం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని మంత్రి వెల్లడించారు. 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించిందని.. కానీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు అడ్డు పడ్డారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడుతా అని అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను, సోనియా గాంధీనీ బ్లాక్ మెయిల్ చేశారన్నారు.

దీక్షా దివస్ మలిదశ ఉద్యమానికి మలుపు రోజు..

వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే తెలంగాణలో వందలాది మంది విద్యార్థులు అమరులు అయ్యారని అన్నారు. 2009 డిసెంబర్ 9 ఇచ్చిన ప్రకటనను మళ్లీ వెనక్కి తీసుకోవడం వల్ల తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాన్చుడు వైఖరి వల్లే ఇదంతా జరిగిందన్నారు. ఆ పాపం కాంగ్రెస్ దే అన్నారు. ఐదేళ్ల ముందే రాష్ట్రం ఇచ్చి ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రగతి ఐదేళ్ల ముందు ఉండేదని అన్నారు. దీక్ష దీవస్ చరిత్రలో గొప్ప రోజు అని, మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు రోజు అని మంత్రి వేముల అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను కేసిఆర్ ఆనతి కాలంలోనే నంబర్ వన్ గా దేశానికే ఆదర్శంగా నిలిపారని అన్నారు.


Prashanth Reddy: సోనియాను వైఎస్‌ బ్లాక్‌ మెయిల్ చేశారు: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి

బీజేపీ మాయలో పడి ఆగం కావొద్దు..

సీఎం  కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతి సాధిస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వo ప్రజల అవసరాలను గుర్తిస్తూ పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. తమ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకురావడం చేతకాని బీజేపీ నాయకులు కులం, మతం, దేవుడి పేరుతో నిత్యం అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైరయ్యారు. దమ్ముంటే తమతో సమానంగా అభివృద్ధిలో పోటీ పడాలని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి మొనగాడివని నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ అరవింద్ కు సవాల్ విసిరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ నిధులన్నీ గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, బిజెపికి చెందిన ఈ ప్రాంత ఎంపీ మాత్రం నిధులు తేలేక చేతులు ఎత్తేశారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి మంచి చేస్తే మంచిది అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget