అన్వేషించండి

Minister Harish Rao : కరోనా కొత్త వేరియంట్ పై ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉండండి-మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : కరోనా కొత్త వేరియంట్ పై ప్రజలు భయాందోళనకు గురికావొద్దని మంత్రి హరీశ్ రావు సూచించారు. ప్రజలందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించారు.

Minister Harish Rao : కరోనా కొత్త వేరియంట్ చైనాను వణికిస్తుంది. ఈ వేరియంట్ తో ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలతో భారత ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం అయింది. అన్ని రాష్ట్రాలకు కరోనా మార్గదర్శకాలు జారీచేసింది. కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా పరిస్థితులపై మంత్రి హరీశ్ రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కేసుల పెరిగితే చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సమయం కావడంతో కోవిడ్ విస్తరించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై అధికారులతో మంత్రి చర్చించారు. 

ఆందోళన వద్దు... అప్రమత్తంగా ఉండండి

కరోనా పట్ల ఆందోళన వద్దని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. పలు దేశాల్లో కరోనా వ్యాప్తిని గమనిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు.  ప్రజలందరూ బూస్టర్‌ డోసు వేసుకోవాలని సూచించారు. కొత్త వేరియంట్‌పై ప్రజలు భయాందోళనకు గురికావొద్దన్నారు. ఇప్పటికే పలు దశల్లో కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నామన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. కరోనా వ్యాప్తి అంతగాలేకపోయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. మందులు, ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్‌ నమూనాలు  జీనోమ్‌ సీక్వెన్స్‌ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలన్నారు. శంషాబాద్‌  ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని  మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

 కొత్త కేసులు 

తెలంగాణలో రోజుకి పదిలోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒకటి రెండు మినహా మిగతా కేసులన్నీ హైదరాబాద్‌లోనే నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లో సున్నా కేసులు నమోదవుతున్నప్పటికీ కొత్త వేరియంట్‌ భయాలులేకపోలేదు. ఇప్పటికే దేశంలో బీఎఫ్‌.7 కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  

IMA సూచనలు 

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ పలు మార్గదర్శకాలు జారీ చేయగా..ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కూడా పలు సూచనలు చేసింది. తక్షణమే ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించడం మొదలు పెట్టాలని తెలిపింది. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని చెప్పింది. ప్రస్తుతానికి భారత్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా లేదని, భయపడాల్సిన పని లేదని వెల్లడించింది. "కొవిడ్ సోకాక చికిత్స అందించడం కంటే అది రాకుండానే చూసుకోవడం మంచిది. అందుకే ప్రజలందరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని
కోరుతున్నాం" అని ప్రకటించింది IMA.

1. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించండి. 
2. భౌతిక దూరం పాటించాలి. 
3. సబ్బు, నీళ్లు లేదా శానిటైజర్‌లతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. 
4. పెళ్లిళ్లు, రాజకీయ సమావేశాలు, ఇతరత్రా మీటింగ్‌ల లాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించకూడదు. 
5. విదేశీ ప్రయాణాలు మానుకోవాలి. 
6. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
7. వీలైనంత త్వరగా ప్రికాషనరీ డోస్‌ను తీసుకోవడం మంచిది. 
8. ప్రభుత్వాలు ఇచ్చే మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటించాలి
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget