అన్వేషించండి

Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy : మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలు, అక్రమాలపై కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతులకు పథకాలు అందడంలేదన్నారు.

Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లి ధరణి పోర్టల్ ను ప్రారంభించారన్న రేవంత్ రెడ్డి, ఈ గ్రామంలోనే ధరణిలో అనేక సమస్యలున్నాయన్నారు. ఈ గ్రామంలో 582 మందికి ఖాతా నెంబర్లు లేవని, రెవెన్యూ నక్ష లేదన్నారు. దీంతో గ్రామంలో రైతు బంధు పథకం అమలు చేయడంలేదని, రైతు బీమా రావడం లేదన్నారు. పాస్ పుస్తకాలు లేకపోవడంతో రైతులకు చాలా నష్టాలు జరుగుతున్నాయన్నారు. గ్రామంలో పూర్తిగా సర్వే చేయించి టీ పన్ ప్రకారం సమస్యలు పరిష్కరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. 

మల్లారెడ్డిపై ఫైర్ 

మంత్రి మల్లారెడ్డిపై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన బావమరిది భూకబ్జాలు, అక్రమాలు, అవినీతిపైన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామని అన్నారు. అధికారంలోకి రాగానే  
 సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ రోడ్డు వేస్తే లక్ష్మపూర్ గ్రామంలో కుమ్మరి ఎలవ్వ ఇల్లు పోయిందని, ఒక్క ఇల్లు కట్టిస్తే ముల్లె పోతాదా అని విమర్శించారు. కలెక్టర్ వెంటనే కట్టివ్వకపోతే కాంగ్రెస్ తగిన గుణపాఠం చెబుతుందన్నారు. ప్రభుత్వం ఇళ్లు కట్టించకపోతే కుమ్మరి ఎల్లవ్వకు ఇల్లు కట్టిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీస్కుంటాదన్నారు. ఈ గ్రామంలో ధరణి పోర్టల్ ప్రారంభిస్తే ఇక్కడే నక్ష లేదన్నారు. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, రాగానే నెల రోజుల్లో ఇదే గ్రామంలో అందరికీ పాసు పుస్తకాలు ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. 

గిట్టుబాటు ధరలు కల్పిస్తాం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల వద్దకు వచ్చి రూ.2500 చొప్పున క్వింటాల్ ధాన్యం కొంటామన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించికొంటామన్నారు. కూరగాయలు, పండ్లు కూడా మంచి ధరలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. వరంగల్ డిక్లరేషన్ తర్వాత 15 రోజులు ఫామ్ హౌస్ లో పండుకొని ఇప్పుడు లేసి దిల్లీకి పోయి పంజాబ్ రైతులకు చెక్ లు ఇస్తున్నారన్నారు. మనం పన్నులు కడితే మన రైతులకు పరిహారం ఇవ్వకుండా, ఇక్కడ కుమ్మరి ఎల్లమ్మకు ఇల్లు ఇవ్వరు కానీ పంజాబ్ కు పోయి అక్కడ రైతులకు చెక్ లు ఇస్తున్నారని విమర్శించారు. 

పంజాబ్ లో ఎలాగబెడుతారట

'ఇక్కడ రైతులకు న్యాయం చేయనోడు పంజాబ్ లో ఎలాగబెడుతాడట. ఇక్కడ సమస్యలు పరిష్కరించి ఇతర ప్రాంతాలకు పోతే మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ రైతులు నానా కష్టాలు పడుతుంటే పంజాబ్ రైతులకు రాజకీయ స్వార్థం తోటి చెక్ లు ఇచ్చి రాజకీయాలు చేస్తుండు. రైతు డిక్లరేషన్ ను 12 వేల గ్రామాలలో ప్రచారం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతులకు న్యాయం జరుగుతాది. కేసీఆర్ గద్దె దిగితేనే రాష్ట్రంలో రైతులకు న్యాయం జరుగుతాది. నాలుగు రోజులు కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలో ఇకపోతే తెలంగాణ సంతోషంగా ఉంది. మొత్తమే కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర దాటిస్తే తెలంగాణ సంతోషంగా ఉంటుంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు. 

రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా లక్ష్మపూర్ గ్రామానికి వచ్చి రేవంత్ రెడ్డి గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన కుమ్మరి ఎలవ్వ ఇంటిని సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మేడ్చల్ కలెక్టర్ తో మాట్లాడి వెంటనే ఎల్లవ్వకు ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కట్టివ్వకపోతే నెల రోజులలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇల్లు కట్టిస్తామని చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Total Debt Politics: తెలంగాణలో అప్పుల సవాళ్ల పోరు.. ప్రెస్ క్లబ్‌లో జూపల్లి, లేఖలతో హరీష్ రావు మైండ్ గేమ్!
తెలంగాణలో అప్పుల సవాళ్ల పోరు.. ప్రెస్ క్లబ్‌లో జూపల్లి, లేఖలతో హరీష్ రావు మైండ్ గేమ్!
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
LPG Tanker Explosion: టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
Embed widget