అన్వేషించండి

Medaram Jatara Effect: మొన్నటివరకు వావ్, నేడు వామ్మో! మేడారం జాతరలో భక్తులు తెచ్చిన తిప్పలు!

Medaram Jatara 2024: ఫిబ్రవరి 21న ప్రారంభమైన మేడారం జాతర ఫిబ్రవరి 24న శనివారం నాడు అట్టహాసంగా ముగిసింది. కానీ భక్తులు వదిలివెళ్లిన వ్యర్థాలతో గ్రామస్తులకు దుర్గంధం సమస్య తప్పడం లేదు.

Medaram Sammakka Sarakka Jatara 2024: మేడారం: ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర (Medaram Jatara 2024) ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారక్క జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు అట్టహాసంగా జరిగింది. కానీ ఆదివాసిల జాతర మేడారం పరిసరాల్లో కంపు కొడుతోంది. నాలుగు రోజులపాటు జరిగిన జాతరకు కోటికి పైగా భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మ (Sammakka Sarakka Jatara)ను దర్శించుని మొక్కులు సమర్పించుకున్నారు. భక్తులు వదిలి వెళ్లిన వ్యర్థాలతో మేడారంలో దుర్వాసన, దుర్గంధం వెదజల్లుతుంది. ఈగలు, పురుగుల, క్రిమి కీటకాలు వ్యాపిస్తున్నాయి. ఓ వైపు దుర్వాసన.. మరోవైపు ఈగల ప్రభావంతో మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండలేని పరిస్థితి కనిపిస్తోంది.

Medaram Jatara Effect: మొన్నటివరకు వావ్, నేడు వామ్మో! మేడారం జాతరలో భక్తులు తెచ్చిన తిప్పలు!

అపరిశుభ్రత, దుర్వాసనతో స్థానికులకు ఇబ్బందులు 
నాలుగు రోజులు భక్త జన సందోహంతో మేడారం అటవీ ప్రాంతం పులకించిపోయింది. కానీ జాతర ముగిసిన తరువాత మేడారం చుట్టు ప్రక్కల ప్రాంత ప్రజలు దుర్వాసన, దుర్గంధం తో ఇబ్బందులు పడడమేకుండా రోగాల భారిన పడుతారు. ములుగు జిల్లా మేడారం కుగ్రామంలో ఈ నెల 21 వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగిన జాతరకు సుమారు ఒక కోటి 50 లక్షల మంది భక్తులు తరలివచ్చి వనదేవత లైనా సమ్మక్క సారలమ్మ లను దర్శించుకొని వెళ్ళారు. వీరంతా వెళ్తూ వెళ్తూ ప్రశాంతమైన అటవీ ప్రాంతంలో చెత్త, ప్లాస్టిక్, కోళ్లు, మేకల వ్యర్ధాలతో పాటు మలమూత్ర విసర్జనలతో నిండిపోయింది. మేడారం మేడారం పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా భక్తులు వదిలిన ఫుడ్ వేస్ట్ ప్లాస్టిక్ కోళ్లు మేకల వ్యర్ధాలు కనిపిస్తున్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని మేడారం, ఊరటం రెడ్డి గూడెం ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 

Medaram Jatara Effect: మొన్నటివరకు వావ్, నేడు వామ్మో! మేడారం జాతరలో భక్తులు తెచ్చిన తిప్పలు!

మహా జాతరలో పారిశుద్ధ్యం లోపించకుండా ఉండడానికి జాతరకు 20 రోజుల ముందు నుండే పారిశుధ్య పనులు చేపట్టారు అధికారులు. జాతర ముగిసి సాధారణ మేడారం వచ్చే వరకు 4 వేల మంది పారిశుద్ధ కార్మికులు, వెయ్యి మంది తాత్కాలిక టాయిలెట్స్ క్లీనర్లను కలుపుకొని 5 వేల మంది పారిశుద్ధ కార్మికులు జాతరలో విధులు నిర్వహించారు. అయినా జాతరలో చెత్త, కోళ్లు, మేకల వ్యర్ధాలు పోరుకుపోయాయి. పారిశుధ్య కార్మికులు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రెండు షిఫ్టులుగా విధులు నిర్వహించినా చెత్త అలాగే ఉందని, జాతర ముగిసి నాలుగు రోజులు అవుతున్న పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు. పారిశుధ్య కార్మికుల విధుల గడువు ఈ నెల 29 తో ముగియనున్నాయి. జాతరలో తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందని చెత్త తొలగింపు ఎప్పుడు ఒడుస్తుందో తెలియదని పారిశుధ్య కార్మికులు చెబుతున్నారు.

జాతరలో వదిలిన వ్యర్థాలతో మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి గ్రామాల ప్రజలు తాత్కాలికంగా ఊర్లను ఖాళీ చేసి వెళ్తున్నారని, అనేక మంది రోగాల బారిన పడుతున్నారని మేడారం వాసి రాజ్ కుమార్ తెలిపారు. 75 శాతం పారిశుధ్య పనులు పూర్తయ్యాయని, ఒకటి రెండు రోజుల్లో సాధారణ స్థితికి వస్తుందని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి వెంకయ్య తెలిపారు. అధికారులు మాత్రం మొత్తం మేడారాన్ని క్లీన్ చేశామని, దాదాపు రెగ్యూలర్ వాతావరణం కనిపిస్తుందని అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget