అన్వేషించండి

Huzurabad By Election: రేవంత్‌కు మొదటి లిట్మస్ టెస్ట్ హుజూరాబాద్..!

పీసీసీ చీఫ్‌గా తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి. గత నలభై ఏళ్లలో ఒక్క సారి కూడా హూజారాబాద్‌లో గెలవని కాంగ్రెస్ పార్టీ.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా రేవంత్ రెడ్డికి మొదటి సవాల్ హుజూరాబాద్ ఉపఎన్నికే.  పీసీసీ చీఫ్ పదవిని పొందడానికి ఎంతో శ్రమించిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించడానికి అంతకంటే ఎక్కువ రాజకీయ నైపుణ్యతను ప్రదర్శించాల్సి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిన్నామొన్నటి వరకు గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఉన్న నేతలంతా స్వల్ప కాలిక ప్రయోజనాల కోసం అధికార పార్టీలతో కుమ్మక్కు కావడం... గ్రూపు తగాదాలతో సొంత ప్రయోజనాలు చూసుకోవడంతో...  మెల్లగా ప్రజల్లోనూ విశ్వాసం కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదేమో అన్న ఆలోచనకు వచ్చారు.  కొన్నాళ్లుగా  ఏ ఎన్నిక జరిగినా ఫలితాలు అదే విషయాన్ని నిరూపించాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయమే అన్న అభిప్రాయాన్ని  మార్చాల్సి ఉంది. 

40 ఏళ్లలో ఒక్కసారీ హుజూరాబాద్‌లో గెలవని కాంగ్రెస్..! 

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి రేసులో లేదు.  ఇప్పటికే అక్కడ టీఆర్ఎస వర్సెస్ బీజేపీ అనే పరిస్థితి ఏర్పడిపోయింది. అంతకు ముందు కమలాపూర్‌లో కానీ ఇప్పటి హూజూరాబాద్‌లో కానీ కాంగ్రెస్ గెలిచి దశాబ్దాలు దాటిపోయింది. 1978లో దుగ్గిరాల వెంకట్రావు..చివరి సారిగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మళ్లీ అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు. అదే దుగ్గిరాల వెంకట్రావు 1985లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా మారగా..ఆ తర్వాత టీఆర్ఎస్ పెట్టని కోటగా నియోజకవర్గం మారిపోయింది. టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తూ వచ్చిన ఈటల రాజేందర్‌కూ ఎప్పుడూ 40వేల మెజారిటీ తగ్గలేదు. అయితే అక్కడ కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం కాలేదు. ఎప్పుడూ రెండో స్థానంలో ఉంటూనే వచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయకు అరవై వేల ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరిపోయారు.

దామోదర రాజనర్సింహను ముందు పెట్టి దళిత వ్యూహం..! 

దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి హుజూరాబాద్‌లో ఒకటి నుంచి ప్రారంభించాల్సి ఉంది. అంతర్గతంగా నివేదికలు తెప్పించుకున్నారు. కేసీఆర్ దళిత ఫార్ములా ప్రయోగిస్తూండటంతో ... దీటుగా ఎదుర్కొనే వ్యూహాన్ని రేవంత్ అమలు చేయడం ప్రారంభించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలకు కాంగ్రెస్ ఇంచార్జ్‌గా దామోదర రాజనర్సింహను నియమించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ రూపకర్త దామోదర రాజనర్సింహనే. ఆ విషయలో ఆయనకు గుర్తింపు ఉంది. ఈ సబ్ ప్లాన్ వల్ల...  దళితుల నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా దళిత వర్గాలకే అందుతున్నాయి. దీని వల్ల దళిత వర్గాల్లో దామోదరకు ఆదరణ ఉంటుందని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. ప్రస్తుతానికి హుజూరాబాద్‌కు దామోదరనే ఇంచార్జ్ గా పెట్టినా...  చివరికి పరిస్థితిని బట్టి ఆయననే అభ్యర్థిగా ఖరారు చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం... కాంగ్రెస్ వర్గాల్లో ఏర్పడింది.  

గట్టి పోటీ ఇచ్చినా రేవంత్‌కు నైతిక విజయమే..! 

అలాగే దళిత గిరిజనుల్ని ఏకం చేసేందుకు కార్యక్రమాలను రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్ల.. దళితులు టీఆర్ఎస్‌కు అనుకూలంగా మారకుండా చేయగలిగితే.. కాంగ్రెస్ పార్టీకి కూడా ఛాన్స్ ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోయినా.. కనీసం గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితికి తీసుకెళ్లగలిగితేనే.. రేవంత్ రెడ్డి మొదటి అడుగులో తనదైన విజయం సాధించినట్లుగా భావించవచ్చు. దీని కోసమే రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలను జోరుగా చేస్తున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Vikarabad Crime News: 'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
Embed widget