అన్వేషించండి

KTR Letter to Revanth: ఆ 10 మంది ఆత్మహత్యలు ప్రభుత్వం చేసినవే - సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ

Telangana News: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తరువాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయని.. ఈ పరిస్థితులు సమైక్యరాష్ట్రం నాటి తరహాలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

KTR News: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఉపాధి లేక ఉసురు తీసుకొంటున్నారని.. వారిని ఆదుకోవాలని అన్నారు. ఇప్పటిదాకా 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఈ 10 ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలే అని కేటీఆర్ విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు వెంటనే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణలో పదేళ్ల తరువాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు చూస్తున్నామని.. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం మళ్లీ ఎదురవుతోందని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని విమర్శించారు. గతంలో లబ్ధి పొందిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అన్నారు. కేవలం గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దని కోరారు.

మళ్లీ ఆకలి చావులే దిక్కు
‘‘కేవలం కేసీఅర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్న దుర్నీతి పాలనతోనే ఈరోజు ఈ పరిస్ధితి దాపురించింది. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులపైన మీ అక్కసు వలన, వాటిని ఆపేడంతో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. మీ ప్రభుత్వానికి కనీస కనికరం లేదు. గత ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించాలని అనేక అందోళనలు చేసినా స్పందించకపోవడం వల్లనే నేడు దారి లేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉపాధి లేక ఉసూరుమంటున్న నేతన్నలకు పని లేక మళ్లీ ఆకలి చావులే దిక్కైన స్థితి నెలకొంది. ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మగౌరవం చంపుకోలేక తనువు చాలిస్తున్నారు. 

ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలివీ..
ఖమ్మం జిల్లాకు చెందిన గుగ్గిల్ల నరేష్  (జనవరి,20), పెంటి వెంకన్న (మార్చ్ 17), సిరిసిల్లాకు చెందిన  తడక శ్రీనివాస్ (మార్చ్, 13), సిరిపురం లక్ష్మినారాయణ ( ఎప్రిల్ 7), ఈగ రాజు (ఏప్రిల్ 25 న), అడిచెర్ల సాయి (ఏప్రిల్ 26న), అంకారపు మల్లేషం (ఏప్రిల్ 26న), చింటోజు రమేష్ ( మే 23న), కుడిక్యాల నాగరాజు (జూన్ 22న), కరీంగనర్ కు చెందిన వెంకటేషం (జూన్ 16న) ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని అత్యంత బాధాతత్ప హృ‌దయంతో మీముందుకు తెస్తున్నాను. వెంటనే ఈ కుటుంబాలకు ప్రత్యేకంగా రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని మా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.  

ఉరిశాలగా సిరిసిల్ల
కాంగ్రెస్ పాలనలో ఉరిశాలగా మారిన  సిరిసిల్లలో కార్మికులను ఆదుకునేందుకు  50 లక్షలతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద నేతన్నలకు అండగా నిలిచారు. గత అరవై ఏండ్ల నేతన్నల దుఖం, బాధలపై పూర్తి అవగాహన ఉన్నందునే కేసిఅర్, బీఅర్ ఎస్ ప్రభుత్వం రాగానే చరిత్రలో ఎన్నడు లేనంతగా బడ్జెట్ ను పెంచి చేనేత, జౌళి శాఖద్వారా నేతన్నల కోసం అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. సంక్షోభంలో చిక్కిన పరిశ్రమను ఆదుకోవడానికి స్వయంగా వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిపించి ఒక రోజంతా అధికారులతో కలిసి అప్పటి సీఎం కేసిఆర్ గారు సమీక్ష నిర్వహించారు.

సంక్షోభం నుంచి గట్టెక్కిందనుకున్న చేనేత రంగం మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి  రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి.. పరిశ్రమను దెబ్బతీయడంతోపాటు.. కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న మీ కాంగ్రెస్ సర్కారు వెంటనే తన తీరు మార్చుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలి. మరణశయ్యపై మరమగ్గాల పరిశ్రమ ఉంది. దాన్ని వెంటనే ఆదుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పవర్ లూమ్స్, నేత పరికరాలపై 90 శాతం సబ్సిడీని వెంటనే అమలు చేయాలి.

గత ప్రభుత్వం అమలు చేసిన చేనేత మిత్రా, థ్రిప్ట్, యారన్ సబ్సిడీ, నేతన్న ఫించన్లు, నేతన్న బీమా, విద్యుత్ సబ్సిడీ మొదలైన పథకాలను కొనసాగిస్తూ వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపైనే ఉన్నది. లేకపోతే సమస్య పరిష్కారం అయ్యే వరకు బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నేత కార్మికులకు అండగా ఉంటూ బీఆర్ఎస్ వారి తరఫున పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాం’’ అని కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Kavitha new party: శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన - తెలంగాణ ప్రజాజాగృతి ఆవిష్కరణకు ముహుర్తం ఖరారు
శ్రీరామనవమి రోజున కవిత కొత్త పార్టీ ప్రకటన - తెలంగాణ ప్రజాజాగృతి ఆవిష్కరణకు ముహుర్తం ఖరారు
Petrol mess: పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
పెట్రోల్ కొరతే లేదు - 2 నెలలకు సరిపడా నిల్వలు -ఆందోళనే వద్దంటున్న ప్రభుత్వం
Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget