News
News
వీడియోలు ఆటలు
X

KTR : రైతుల వద్దకే వచ్చి పరిహారం - ఆందోళన వద్దని కేటీఆర్ భరోసా !

వర్ష బాధిత రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. మంత్రులు జిల్లాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇస్తున్నారు.

FOLLOW US: 
Share:

 

KTR :  వడగండ్ల వానలతో పంట నష్ట పోయిన రైతులందరికీ ఎకరాకు 10 వేల రూపాయలు,హెక్టారుకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి రైతులను ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.వడగండ్ల వర్షాలకు ఎల్లారెడ్డి పేట మండలంలోని గుంట పల్లి చెరువు గ్రామంలో దెబ్బ తిన్న పంటలను మంత్రి పరిశీలించారు. రైతులు ఎవ్వరూ అదైర్య పడవద్దని ,పంట నష్టం జరిగిన వారందరికీ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.మండలంలో 133 ఎకరాలలో వరి పంట కు నష్టం వాటిల్లిందని వ్యవసాయ,రైతుభందు అధికారుల అంచనా వేశారని తెలిపినట్లు కేసీఆర్ ప్రకటించారు.                   

ప్రతి ఎకరాకు 10 వేల రూపాయలు,హెక్టారుకి 25 వేల రూపాయల పంట నష్టం ప్రభుత్వం ద్వారా అందిస్తామని ,రైతులు ఎవరు ఏ అధికారి వద్దకు వెళ్లకుండా అధికారులే రైతుల ఇళ్ల‌ వద్దకు వచ్చి పంట నష్టం పరిహారం సొమ్ము అందిస్తారని కేటీఆర్ తెలిపారు.ఎండాకాలంలో ఇలా వర్షాలు పడుతాయని ఎవరు అనుకోలేదని, ప్రకృతి పగ బట్టి నట్లయిందని మంత్రి ఆవేదన చెందారు. చెడ గొట్టు వానలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని దైర్యంగా వుండాలని మీకు మేమున్నాం అని మంత్రి భరోసా కల్పించారు. రైతులను ఆదుకోవాలని సిఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు.                                 

సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా పోడు భూముల ను క్రమ బద్దికరించే ఫైల్ పైనే సి ఎం కేసీఅర్ తొలి సంతకం చేశార‌ని కేటీఆర్ గుర్తు చేశారు.మనది రైతు ప్రభుత్వం అని రైతుల ను ఆదుకోవడానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ అన్నారు.గుంట పల్లి చెరువు తండా,వీర్ణప ల్లి,గజసింగవరం, గొరంటా ల గ్రామాలలో వడ గండ్లు పడి వరి పంట కు తీవ్రంగా నష్టం జరిగినట్లు తెలిసింది అని,పశువులకు మేతకు తప్ప వరీ పంట దేనికి పనికి రాకుండా పోవడం బాధాకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు.పోడు రైతులకు,కౌలు రైతులకు కూడా పంట నష్టం అందేలా చూస్తామని ,ఆ రైతుల వివరాలతో నివేదిక తయారు చేయాలని జిల్లా వ్యవసాయ,రెవిన్యూ ,అధికారులను మంత్రి ఆదేశించారు.                   
               

మరో వైపు జిల్లాల మంత్రులంతా విస్తృతంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రైతులకు  భరోసా ఇస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామని ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తున్నారు.వరుసగా పడుతున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది.                                                

Published at : 02 May 2023 04:10 PM (IST) Tags: Telangana Farmers Crop loss Telangana News Untimely Rains

సంబంధిత కథనాలు

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Top 10 Headlines Today: చంద్రబాబు - అమిత్ భేటీ వివరాలు; నేడు నిర్మల్‌కు కేసీఆర్ - ఇవాల్టి టాప్ 10 న్యూస్

Top 10 Headlines Today: చంద్రబాబు - అమిత్ భేటీ వివరాలు; నేడు నిర్మల్‌కు కేసీఆర్ - ఇవాల్టి టాప్ 10 న్యూస్

టాప్ స్టోరీస్

Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!

Coromandel Express: ప్రమాదంలో గూడ్సు రైలు పైకెక్కేసిన కోరమాండల్ రైలింజన్, విస్మయం కలిగించేలా ఘటన!