అన్వేషించండి

Bandi Sanjay : కొండగట్టు బాధితులను ఆదుకుంటే కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తా, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేంద్రం తెలంగాణలో మానవహక్కులు కాలరాస్తోందన్న కవిత వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

Bandi Sanjay : సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మానవ హక్కులను కాలరాస్తోందే కేసీఆర్ అంటూ విమర్శలు చేశారు. అత్యాచారాలు, హత్యలు, దోపిడీ జరుగుతుంటే కవిత కళ్లలో నుంచి నిప్పులెందుకు రాలేదని ప్రశ్నించారు. కనీసం బాధితులను పరామర్శించాలనే సోయి ఎందుకు రాలేదన్నారు. కవితను అరెస్ట్ చేస్తారనే సరికి మహిళలంతా కన్నీళ్లు, నిప్పులు కురిపించాలా? అంటూ ప్రశ్నించారు.  ఇంటికో ఉద్యోగం, పెన్షన్, ఆర్థిక సాయం చేస్తానన్న హామీలు ఏమయ్యాయన్నారు. కొండగట్టు ప్రమాద బాధితులకు ఇప్పటి వరకూ సాయం అందలేదని ఆరోపించారు. బస్సులో ప్రయాణించడమే వాళ్లు చేసిన పాపమా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ప్రమాద బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించలేదన్నారు.   గోడ కట్టడం తప్ప కొండగట్టు వద్ద ప్రమాదాలు జరగకుండా తీసుకున్న చర్యలు శూన్యమని ఆరోపించారు. కొండగట్టు బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటే కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొండగట్టు బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు.  

కల్వకుంట్ల అవినీతికి జేజేలు కొడితే మానవహక్కులున్నట్లా? 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో మానవ హక్కులను హరిస్తుందని కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై  ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు లేదన్నారు. మానవ హక్కులను హరించి వేస్తోంది కేసీఆర్ అన్నారు. ప్రశ్నించే వాళ్లే ఉండకూడదని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తేశారమన్నారు. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. నిజాలు రాసే మీడియాను తొక్కివేస్తున్నారని ఆరోపించారు.  ప్రశ్నించే కవులు, కళాకారులు, మేధావులను బెదిరిస్తున్నారన్నారు. బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్నే కేసీఆర్ తిరిగ రాస్తానన్నారని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అరాచకాలకు, అవినీతికి జేజేలు కొడితేనే మానవ హక్కులున్నట్లా? అంటూ ఎద్దేవా చేశారు. మీడియాను బీజేపీ అణిచివేస్తోందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ మండిపడ్డారు. 

అయ్య కాడికి పోయి ఏడవమను

‘‘కేసీఆర్ సీఎం కాగానే కొన్ని టీవీ ఛానళ్లను బ్యాన్ చేసిందెవరు? మీడియాను పాతాళానికి తొక్కేస్తానని బెదిరిస్తున్నదెవరు?  సీఎం హోదాలో ప్రెస్ మీట్ పెడితే ఒక్క విలేకరిని కూడా ప్రశ్నించకుండా దబాయిస్తున్నదెవరు?  యాడ్స్ తో, డబ్బులతో పబ్లిసిటీ చేసుకుంటూ మీడియాను మేనేజ్ చేస్తోందెవరు?’’అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్యలు బాధిస్తున్నాయంటూ కేసీఆర్ బిడ్డ చెప్పడంపైనా తనదైన రీతిలో స్పందించారు.  ‘‘నా వ్యాఖ్యలు బాధిస్తే అయ్య కాడికి పోయి ఏడవమను’’ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ మహిళల కళ్లల్లో నుంచి నిప్పులు కురవాలంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు జరుగుతుంటే మీ కళ్ల నుంచి నిప్పులెందుకు రాలేదని ప్రశ్నించారు. పోడుభూములకు పట్టాలివ్వాలని అడిగిన పాపానికి బాలింతలపై రాక్షసంగా వ్యవహరించి జైలుకు పంపినప్పుడెందుకు నిప్పులు కురవలేదన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారనే సరికి తెలంగాణ మహిళలంతా నిప్పులు కురిపించాలా?’’అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. 

15న ముగింపు సభ 

 ఈనెల 15న కరీంనగర్ లో జరిగే ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి రావాలని బండి సంజయ్ కోరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 4 ఏళ్ల క్రితం కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను కలిశారు. తమకు సాయం అందలేదంటూ ఆయా కుటుంబాలు బండి సంజయ్ కు వివరించారు. మృతుల కుటుంబాలకు బండి సంజయ్ ధైర్యం చెప్పారు.  అనంతరం మాట్లాడుతూ...4 సంవత్సరాల క్రితం కొండగట్టులో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిందని, బస్సులో ప్రయాణిస్తున్న పేద ప్రయాణికులు మరణించారని గుర్తుచేశారు. ఈ ఘటనలో 68 మంది నిరుపేద ప్రయాణికులు మృత్యువాత పడ్డారన్నారు. బస్సు ప్రమాద కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం కనీసం పరామర్శించలేదు, పట్టించుకోలేదని ఆరోపించారు. పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్లాల్సిన మృతదేహాలకు కనీసం కేసీఆర్ సర్కార్ చాపలు కూడా కొని ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. హాస్పిటల్ లో క్షతగాత్రులకు డబ్బులు కూడా కట్టలేదని ఆరోపించారు.  
ఈ ప్రమాదంలో ఇప్పటికీ 20 మంది క్షతగాత్రులు వైద్యం తీసుకుంటున్నారన్నారు. ప్రమాద బాధిత కుటుంబాలను నేటికీ కేసీఆర్ ఆదుకోలేదన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Telangana Weather:: తెలంగాణకు వర్ష సూచన! హైదరాబాద్‌లో కుండపోత! రానున్న నాలుగు రోజులు కీలకం!
తెలంగాణకు వర్ష సూచన! హైదరాబాద్‌లో కుండపోత! రానున్న నాలుగు రోజులు కీలకం!
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
Drug case remand report: పోలీసుల్ని చంపి అయినా తప్పించుకోవాలనుకున్నారా? - రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
పోలీసుల్ని చంపి అయినా తప్పించుకోవాలనుకున్నారా? - రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget