అన్వేషించండి

Khammam News : ఆ మంత్రి కారణంగానే బీజేపీ కార్యకర్త సూసైడ్, ఖమ్మంలో హై టెన్షన్!

Khammam News : ఖమ్మం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల అక్రమ కేసుల కారణంగానే బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.

Khammam News : ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతానికి చెందిన సాయిగణేష్‌ అనే బీజేపీ కార్యకర్త పోలీసుల వేధింపుల వల్లే మృతి చెందాడని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మంత్రి పువ్వాడ అజయ్, పోలీసుల ఒత్తిడి వల్లే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడడని ఆరోపించారు. సాయి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతానికి చెందిన సాయిగణేష్‌ గొల్లగూడెంలో ఏర్పాటు చేసిన పార్టీ దిమ్మెను కొంతమంది ధ్వంసం చేశారు. ఈ విషయంపై త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని, దీంతో పాటు సాయి గణేష్‌ను పోలీసులు తిట్టడం వల్లే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన సాయిగణేష్‌ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు తీసుకురావడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో సుమారు రెండు గంటల పాటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

వచ్చే నెల 4న సాయి వివాహం 

బీజేపీ కార్యకర్త సాయి గణేష్ పోలీస్‌ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి అత్మాహత్యాయత్నం చేశాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత సాయి గణేష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే వచ్చే నెల 4న సాయి గణేష్ వివాహం జరగనుంది. ఇంతలోనే ఇలా జరగటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే సాయి గణేష్‌పై పోలీసులు కేసులు పెట్టి వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగానని సాయి తమతో చెప్పాడనీ బంధువులు అంటున్నారు. 

మంత్రి పువ్వాడ అజయ్ కార్యాలయం వద్ద బందోబస్తు 

ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతి చెందడంతో మంత్రి అజయ్‌ కుమార్‌ కార్యాలయం, జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు భారీగా  పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కారణంగా బీజేపీ కార్యకర్త మృతి చెందాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సాయి గణేష్ పై అక్రమ కేసులు పెట్టారని దీంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని అంటున్నారు. మంత్రి కార్యాలయం చుట్టూ భారీ గేట్లను ఏర్పాటు చేసి పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు తగలబెట్టారు. వారిని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
Mazaka movie OTT: 'మజాకా' ఓటీటీ డీల్ క్లోజ్... థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్?
'మజాకా' ఓటీటీ డీల్ క్లోజ్... థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్?
Kodali Nani About Red Book: నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్
నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
Mazaka movie OTT: 'మజాకా' ఓటీటీ డీల్ క్లోజ్... థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్?
'మజాకా' ఓటీటీ డీల్ క్లోజ్... థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్?
Kodali Nani About Red Book: నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్
నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్
BCCI Vs Team India: కుటుంబ సభ్యులను కలిసేందుకు టీమిండియా ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక మెలిక పెట్టిన బీసీసీఐ
కుటుంబ సభ్యులను కలిసేందుకు టీమిండియా ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక మెలిక పెట్టిన బీసీసీఐ
Salaar: ట్రెండింగ్‌లో 'సలార్', అదీ 365 రోజులుగా... జస్ట్ రికార్డు మాత్రమే కాదంటూ పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రెండింగ్‌లో 'సలార్', అదీ 365 రోజులుగా... జస్ట్ రికార్డు మాత్రమే కాదంటూ పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Viraaji OTT Streaming: 'ఆహా'తో పాటు మరో ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సైకలాజికల్ థ్రిల్లర్ 'విరాజి' - డబ్బులు కట్టి చూస్తారా మరి?
'ఆహా'తో పాటు మరో ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సైకలాజికల్ థ్రిల్లర్ 'విరాజి' - డబ్బులు కట్టి చూస్తారా మరి?
Kakinada High Alert: తుని వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా, కాకినాడ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
తుని వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా, కాకినాడ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.