అన్వేషించండి

బెజ్జూర్‌ మండలంలో హడలెత్తిస్తున్న పెద్దపులి- మళ్ళీ పశువులపై దాడి!

కుమ్రం భీం జిల్లాలో 4 రోజులుగా పెద్దపులి సంచారం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బెజ్జూరు, దహెగాం, పెంచికల్ పేట్, కాగజ్‌నగర్‌, సిర్పూరు(టి), చింతలమానేపల్లి, వాంకిడిలో పులుల అనవాళ్లను నిర్ధారించారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌ మండలంలోని మారుమూల గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తూ హడలెత్తిస్తోంది. కాగజ్‌నగర్‌, సిర్పూర్ (టి) ప్రాంతాల్లో ఇది వరకు కనిపించిన పులి.. ఇప్పుడు బెజ్జూర్‌ మండలంలోని మారుమూల గ్రామాల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. నిన్న రాత్రి బెజ్జూర్‌ మండలం కుకూడ గ్రామంలో కొట్టంలో కట్టెసిన ఎద్దుపై పులిదాడి చేసింది. పశువుల అరుపులు విన్న గ్రామస్తులు బయటకు వచ్చి కేకలు వేయడంతో పులి సమీప అడవిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆ ఎద్దు ప్రాణాలతో బయటపడింది. తాజాగా మళ్ళీ ఈరోజు సోమవారం బెజ్జూర్‌ మండలంలోని మర్తిడి గ్రామంలో మొండికుంట వద్ద నిద్రిస్తున్న పులిని మీసాల రాజు అనే రైతు చూసాడు. పులి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడ నుండి పరుగులు తీసి గ్రామానికి చేరుకున్నాడు. వెంటనే పులి సమాచారాన్ని అటవి శాఖ అధికారులకు అందించారు.

కుమ్రం భీం జిల్లాలో గత నాలుగు రోజులుగా పెద్దపులి సంచారం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బెజ్జూరు, దహెగాం, పెంచికల్ పేట్, కాగజ్‌నగర్‌, సిర్పూరు(టి), చింతలమానేపల్లి, వాంకిడి అటవీ ప్రాంతాల్లో పులుల అన వాళ్లను అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే ఒక రైతు బెబ్బులి దాడిలో చనిపోగా.. పదుల సంఖ్యలో పశువులు హతమయ్యాయి. దీంతో పశువులను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లడానికి కాపర్లు, పత్తి చేన్లకు వెళ్లడానికి రైతులు జంకు తున్నారు. కుమ్రం భీం జిల్లాలో 12 నుంచి 15 పులులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ సమీప గ్రామాలైన వాంకిడి మండలంలోని ఖానాపూర్, సవ్వాతి, దాబా, అంతాపూర్, గడమర, వెలిగి, లక్ష్మిపూర్, పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి, లోడ్ పల్లి, అగర్ గూడ, కమ్మర్ గావ్, నందిగాం, గుండపల్లి, జిల్లెడ, మొర్లగూడ, బెజ్జూర్‌ మండలంలోని సులుగుపల్లి, పెద్దసిద్దాపూర్, తలాయి, తిక్కపల్లి, రెబ్బెన, కొత్తగూడ, దహెగాం మండలంలోని దిగిడ, రాంపూర్, మొట్లగూడ తదితర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వాంకిడి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము అనే రైతును హతమార్చిన పులి.. కాగజ్‌నగర్‌ డివిజన్ లోని అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది ఒకటేనని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాదముద్రలు ఒకే పరిమాణంలో ఉండటంతో ఆ పులి ఇటుపై వచ్చిందని భావిస్తున్నారు.

గత గురువారం రాత్రి కాగజ్‌నగర్‌ పట్టణంలోని వినయ్ గార్డెన్స్ సమీపంలో పులి రోడ్డు దాటుతుండగా  ఓ ట్రాలీ డ్రైవర్ చూశాడు. శుక్రవారం వంజీరి బెంగాలీ క్యాంపు ఏరియాలోని పంట చేన్లలో పులి సంచరించింది. శనివారం అనుకోడ పంట పొలాల్లో పులి అడుగులు కనిపించాయి. అదేవిధంగా భూపాలపట్నం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గొర్రెల పై దాడి చేసింది. మళ్ళీ ఆదివారం బెజ్జూర్‌ మండలం కొత్తగూడ, రెబ్బెన, చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ పంటపొలాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. అక్కడ రైతును హతమార్చిన పులి ఈ ప్రాంతంలో ఆవాసం కోసం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ పులి సుమారు 120 కిలో మీటర్లకు పైగా ప్రయాణం చేసినట్లు అంచనా వేస్తున్నారు. చింతలమానెపల్లి మండలంలోని అడేపెళ్లి, డబ్బా, బాబాసాగర్ గ్రామాల శివారులో పులి సంచరిస్తుందని ఆదివారం పలువురు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని గ్రామాల సర్పంచులకు విషయం తెలిపి గ్రామాల్లో డప్పు చాటింపు, మైకుల ద్వారా జాగ్రత్తపడాలని తెలియజేశారు. బాబాసాగర్ గ్రామ శివారుల్లోని నీటికుంట వద్ద పులి అడుగులను గుర్తించారు. బాబాసాగర్ శివారులోని పత్తి చేన్లలో పత్తి ఏరుతున్న రైతులను అధికారులు ఇళ్లకు పంపించారు. చాలా గ్రామాల్లో పనులకు వెళ్లిన కూలీలు మధ్యాహ్నమే ఇళ్లకు చేరారు. బెజ్జూరు మండలంలోని కొత్తగూడ వాటర్ ట్యాంక్ సమీపంలో ఆదివారం పులి అడుగులు కనిపించాయి. విషయాన్ని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆటవీశాఖ అధికారులు కొత్తగూడ, రెబ్బెన, బాబాసాగర్ గ్రామాల సరిహద్దులోని పంట చేన్లల్లో పరిశీలించారు. బెజ్జూరు మండలం కొత్తగూడ గ్రామ సమీపంలో చెరువులో నీళ్లు తాగుతున్న పెద్దపులిని గ్రామస్తులు గమనించారు. దీంతో అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పులిపాద ముద్రలను సేకరించి పులి జాడ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుకూడా గ్రామంలో ఎద్దులపై పెద్దపులి దాడి ఘటన చోటుచేసుకుంది. ఆదివారం కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దులపై రాత్రి పెద్దపులి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఎద్దుల అరుపులు విన్న గ్రామస్తులు గట్టిగా కేకలు వేయడంతో పులి పారిపోయినట్టు స్థానిక రైతులు చెబుతున్నారు. పెద్దపులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజా మళ్ళీ ఈ రోజు సోమవారం ఉదయం కుమ్రం భీం జిల్లా బెజ్జూరు మండలంలోని మర్తిడి గ్రామ సమీపంలోని చొప్పదండి మొండికుంట వద్ద రైతు మీసాల రాజన్నకు పులి కనిపించింది. కుంట వద్ద పులి పడుకొని ఉండగా చూసి పరుగులు పెడుతూ ఇంటికి వచ్చినట్లు ఆయన తెలిపారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవి శాఖ అధికారులు గస్తి కాస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు బయటకు వెళ్ళొద్దని రైతులు చేలలోకి వెళ్ళొద్దని సూచిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Bandi Bhagirath Files:బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
Karimnagar Tension: కరీంనగర్‌లో పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు! బండి, రేవంత్ కలిసి తనను చంపే కుట్ర చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు!
కరీంనగర్‌లో పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు! బండి, రేవంత్ కలిసి తనను చంపే కుట్ర చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు!
Karimnagar Tension: కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల విధ్వంసం! గంగుల క్యాంప్ ఆఫీస్‌పై దాడి!బండిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం!
కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల విధ్వంసం! గంగుల క్యాంప్ ఆఫీస్‌పై దాడి!బండిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget