అన్వేషించండి

Rajanna Sircilla: తల్లికి అంత్యక్రియలు చేస్తూ కొట్టుకున్న కొడుకులు.. శవం పక్కనే తగువులాట, ఎందుకంటే..

తల్లికి చితి చుట్టూ కుండతో తిరిగేటప్పుడు కూడా గొడవ పడుతూ పోటాపోటీగా తిరిగారు. చితికి నిప్పంటించడం కూడా ఒకర్నొకరు తోసుకుంటూ తలకొరివి పెట్టారు.

ఆస్తిపై వ్యామోహంతో కన్న తల్లి చితి వద్దే కొడుకులు తగువులాడుకున్న ఘటన ఇది. కన్న తల్లికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో అత్యంత అమానవీయంగా వీరు ప్రవర్తించారు. ఆస్తే తమకు ముఖ్యం అన్నట్లుగా వ్యవహరించారు. ఈ తతంగం చూస్తున్న గ్రామస్థులంతా నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. గతంలో ఈ ఆస్తి పంపకాలపై గొడవలు జరగడం, పంచాయితీలు జరిగినా.. తల్లికి చివరి కార్యక్రమాలు నిర్వహించే చోట కొడుకులు గొడవ పడడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఆఖరికి చితి చుట్టూ కుండతో తిరిగేటప్పుడు కూడా పోటాపోటీగా తిరిగారు. చితికి నిప్పంటించడం కూడా ఒకర్నొకరు తోసుకుంటూ తలకొరివి పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామస్థులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారం యశోద, భూమి రెడ్డి దంపతులు ఎల్లారెడ్డి పేటలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పిల్లలు అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. భూమి రెడ్డికి మొత్తం ఎకరంన్నర పొలం ఉంది. తన పొలంలో పెద్ద కుమారుడు రామకిష్టా రెడ్డి, చిన్న కుమారుడు రవీందర్‌ రెడ్డికి చెరి 20 గుంటల చొప్పున గతంలోనే పంపకాలు చేశాడు. మిగిలిన భూమిని తమ కోసం తమ వద్దనే ఉంచుకున్నాడు. మూడు కుటుంబాలు వేర్వేరుగానే కాపురాలు ఉండేవి. 

ఆ మిగిలిన ఆస్తి కూడా పంచాలని తండ్రీకొడుకులకు తరచూ గొడవలు జరిగేవి. గత ఏడాది కుల సంఘం పెద్దలు పంచాయితీ కూడా చేశారు. తల్లితండ్రులను చివరిదాకా ఎవరైతే చూస్తారో వారికే మిగిలిన ఆస్తి దక్కుతుందని తీర్పు చెప్పారు. దీంతో కుమారులిద్దరూ నెలకు ఒకరు చొప్పున తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకుంటూ వచ్చారు. అయితే, గత 5 నెలలుగా భూమిరెడ్డి, అతని భార్య యశోద దాదాపు 5 నెలల నుంచి పెద్ద కొడుకు రామకిష్టారెడ్డి దగ్గరే ఉంటున్నారు. 

Also Read: బూస్ట్ నుంచి సర్ఫ్ ఎక్సెల్ వరకూ అంతా నకిలీవే.. డౌట్ రాకుండా తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్న ముఠా 

ఈ క్రమంలో తల్లి యశోద (92) అనారోగ్యంతో బుధవారం చనిపోయింది. దీంతో ఆస్తి కోసం అన్నదమ్ములిద్దరూ తల్లి శవం వద్దే గొడవ పడ్డారు. నాకే ఆస్తి దక్కాలంటూ వాదించుకున్నారు. చితి చుట్టూ కుండతో తిరిగే విషయంలో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. ఇద్దరూ తల్లి చితి చుట్టూ కుండతో తిరిగారు. అదే క్రమంలోనే చివరకు ఇద్దరూ పోటీపడి మరీ తల్లి చితికి నిప్పంటించారు.

Also Read: Fake Pregnancy: ఫేక్ ప్రెగ్నెన్సీతో భర్త, అత్తింటివారిని బోల్తా కొట్టించిన మహిళ.. ఎందుకో తెలిసి అవాక్కైన పోలీసులు

Also Read: Hyderabad: క్రెడిట్ కార్డు గురించి ఈ డీటైల్స్ గూగుల్‌లో అస్సలు వెతకొద్దు! అలా చేసినందుకు రూ.1.3 లక్షలు లూటీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Bhoodan Lands: భూదాన్ భూముల అక్రమాల్లో సీనియర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్లు - తెలంగాణ అధికారవర్గంలో కలకలం
భూదాన్ భూముల అక్రమాల్లో సీనియర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్లు - తెలంగాణ అధికారవర్గంలో కలకలం
Pahalgam Terror Attack: సైబర్ మోసగాళ్ల కక్కుర్తి - సైన్యం పేరుతో విరాళాల సేకరణ - అప్రమత్తం చేసిన కేంద్రం
సైబర్ మోసగాళ్ల కక్కుర్తి - సైన్యం పేరుతో విరాళాల సేకరణ - అప్రమత్తం చేసిన కేంద్రం
Revanth Chit Chat: కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
Padma Vibhushan Balakrishna : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG Captian Rishabh Pant Failures in IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్Rishabh Pant Failures IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్RCB 6 Away Matches Wins in Row | IPL 2025 లో సరికొత్త చరిత్రను సృష్టించి ఆర్సీబీKrunal Pandya 73 runs vs DC IPL 2025 | కుప్పకూలిపోతున్న RCB ని కొహ్లీ తో కలిసి నిలబెట్టేసిన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Bhoodan Lands: భూదాన్ భూముల అక్రమాల్లో సీనియర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్లు - తెలంగాణ అధికారవర్గంలో కలకలం
భూదాన్ భూముల అక్రమాల్లో సీనియర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్లు - తెలంగాణ అధికారవర్గంలో కలకలం
Pahalgam Terror Attack: సైబర్ మోసగాళ్ల కక్కుర్తి - సైన్యం పేరుతో విరాళాల సేకరణ - అప్రమత్తం చేసిన కేంద్రం
సైబర్ మోసగాళ్ల కక్కుర్తి - సైన్యం పేరుతో విరాళాల సేకరణ - అప్రమత్తం చేసిన కేంద్రం
Revanth Chit Chat: కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
Padma Vibhushan Balakrishna : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ
Brahmaputra River: బ్రహ్మపుత్ర నదిని చైనా ఆపేస్తుందా ?  పాకిస్తాన్‌తో కలిసి భారీ కుట్ర ?
బ్రహ్మపుత్ర నదిని చైనా ఆపేస్తుందా ? పాకిస్తాన్‌తో కలిసి భారీ కుట్ర ?
CM Chandrababu at VIT: నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు
నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు
Pahalgam Terror Attack : పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ప్రపంచ బ్యాంకు- సింధు జల ఒప్పందంలో జోక్యానికి నిరాకరణ!
పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ప్రపంచ బ్యాంకు- సింధు జల ఒప్పందంలో జోక్యానికి నిరాకరణ!
వెనుకడుగు వేయని IAS.. వెనక్కు పంపిన ప్రభుత్వం  స్మితా సభర్వాల్ విషయంలో జరిగింది అదేనా..?
వెనుకడుగు వేయని IAS.. వెనక్కు పంపిన ప్రభుత్వం స్మితా సభర్వాల్ విషయంలో జరిగింది అదేనా..?
Embed widget