అన్వేషించండి

MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు చేదు అనుభవం - వాహనాల అద్దాలు ధ్వంసం

MP Dharmapuri Arvind Attacked: గోదావరి పరివాహక గ్రామం కావడంతో గ్రామాలను పరిశిలించేందుకు ఎంపీ అరవింద్ వెళ్లారు. ఎర్దండి గ్రామస్తులు ఆయనను అడ్డుకోవడంతో పాటు కాన్వాయ్ వాహనాల అద్వాలు ధ్వంసం చేశారు.

BJP MP Dharmapuri Arvind: జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినా బ్రిడ్జి కట్ట లేదంటూ గ్రామస్తుల నిరసన తెలిపారు. అంతటితో ఆగకుండా ఎంపీ కాన్వాయ్ లోని వాహనాలపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది.

హామీలపై నిలదీసి, ఎంపీపై ఆగ్రహం.. 
గోదావరి పరివాహక గ్రామం కావడంతో గ్రామాలను పరిశిలించేందుకు ఎంపీ అరవింద్ వెళ్లారు. అయితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామస్తులు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ని అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించి భూ వివాదం పరిష్కరించలేదని, ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చారంటూ ఎంపీని నిలదీయడంతో చేదు అనుభవం ఎదురైంది. ఎంపీ గా గెలిపిస్తే గ్రామంలో బ్రిడ్జి కట్టిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ, మల్లన్న గుట్ట సమస్య పరిష్కారం చేస్తానన్న హామీ ఎందుకు అమలు చేయలేదని గ్రామస్తులు ఎంపీ అరవింద్‌ను గట్టిగానే నిలదీశారు. ఎంపీ అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతటితో శాంతించని గ్రామస్తులు ఆయన వెంట వచ్చిన కాన్వాయ్ లోని రెండు వాహనాలపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు.

శాంతించని గ్రామస్తులు..
ఎర్ధండి గ్రామస్తులు ఎన్నికలకు ముందు ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి బీజేపీ నేత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. గ్రామస్తులు ముందుకు వెళ్లడానికి ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక తన అనుచరులతో కలిసి ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌తో తిరుగు ప్రయాణమయ్యారు. అయినా గ్రామస్తులు శాంతించలేదు. ఎంపీ అరవింద్ గో బ్యాక్ అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ కాన్వాయ్ ను ముట్టడించారు. ఆపై కాన్వాయ్ వాహనాలపై దాడికి పాల్పడి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. రెండు వాహనాల అద్దాలు ధ్వంసం చేసినట్లు సమాచారం. తాము అడ్డుకున్నా పోలీసుల సహాయంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులు ఆవేశానికి లోనై ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డట్లు చెబుతున్నారు. బీజేపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని ఎర్ధండి గ్రామస్తులు సైతం ఎంపీ అనుచరులపై ఆరోపణలు చేశారు.

భౌతిక దాడులకు తెగబడటం సిగ్గు చేటు: బండి సంజయ్
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ‘ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక భౌతిక దాడులకు తెగబడటం సిగ్గు చేటు. ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్య అన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. సీఎం కేసీఆర్ పాలనను, టీఆర్ఎస్ నేతల తీరును ప్రజల అసహ్యించుకుంటున్నారు. అయినా వారిలో మార్పు రాకపోగా ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడటం వారి అవివేకానికి నిదర్శనం. టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలపై నిలదీస్తూనే ఉంటాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరును కొనసాగిస్తూనే ఉంటామని’ బండి సంజయ్ అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
Embed widget