అన్వేషించండి

Karimnagar News: కరీంనగర్ రిజిస్ట్రేషన్ శాఖ నిర్లక్ష్యం, 70 లక్షల సొమ్ము రికవరీ కానట్టేనా?

Karimnagar News: కరీంనగర్ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్లక్ష్యం కారణంగా.. లక్షల్లో సొమ్ము మాయమైంది. ఇప్పటికైనా అధికారులు డబ్బును రికవరీ చేస్తారనుకుంటే.. దీన్ని కూడా పట్టించుకోవడం లేదు.  

Karimnagar News: ఆరు సంవత్సరాల కిందట జరిగిన అక్రమాలకు ఇంకా ముగింపు పలకడం లేదు కరీంనగర్ రిజిస్ట్రేషన్ శాఖ చెందిన అధికారులు. కాలం ముందుకు కదులుతున్నా లక్షల్లో మాయమైన సొమ్ము రికవరీ మాత్రం కావడం లేదు. కరీంనగర్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2016 మార్చి నెలలో బయట పడిన స్టాంపుల కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన సొమ్మును ఇంటి దొంగలే కొట్టేశారా? అనే విషయమై పలుమార్లు విచారణ జరిగింది. కొందరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఐదు రోజుల కిందట కార్యాలయంలోని ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా గతంలో జరిగిన కథ మళ్ళీ తెర మీదకు వచ్చింది. 

మాయమైన డబ్బు తిరిగి చేర్చడంలో నిర్లక్ష్యం..

జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో పర్యవేక్షణ లోపం నిర్వహణకు ప్రధాన శాపంగా మారుతోంది. ఆ డిపార్ట్మెంట్లో అత్యధిక రాబడిని ప్రతి ఆర్థిక సంవత్సరంలో అందించే జిల్లాగా కరీంనగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొందరు ఉద్యోగులు ఇష్టానుసారంగా చేస్తున్న వ్యవహారాలు మాయని మచ్చగానే మిగిలిపోతున్నాయి. 2016 లో జరిగిన గోల్ మాల్ వల్ల జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు చెడ్డ పేరు వచ్చింది. 3 ఏళ్ళ ముందే ఇక్కడ స్టాంపులను ఏ మాత్రం పరిరక్షణ లేకుండా అమ్ముతున్నారనే విషయాన్ని అప్పట్లో ఎడిట్ అధికారులు గుర్తించారు. అమ్మిన వాటికి, జమ చేసిన సొమ్ముకు భారీ తేడా ఉండడాన్ని కూడా గమనించారు. ఉన్నతాధికారులు అప్పట్లో తగిన దృష్టి పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని ఉంటే తర్వాత మళ్లీ ఇంత పెద్ద తప్పిదం జరిగేందుకు ఆస్కారం లేకపోయేది. 70.76 లక్షల కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత 2019 మార్చి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా నిలిపివేశారు. చలాన్ల తోపాటు ఆన్లైన్ తరహాలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకున్నారు. కానీ పెద్ద మొత్తంలో మాయమైన సొమ్మును తిరిగి చేర్చడంలో మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యమే ఇప్పటి వరకు కనిపించింది.

సొమ్ము స్వాధీనం అవుతుందా, లేదా?

ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే అక్రమంగా ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం.. స్వాధీన పరచుకునేలా ఉన్నతాధికారులు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలా చేస్తే భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండే ఆస్కారం ఉంటుంది.  స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని కరీంనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నాన్ జ్యూడిషియల్ స్టాంప్ కాగితాలు ప్రత్యేకంగా అతికించే ఫ్రాంక్లింగ్ యంత్రంతో స్టాంపులు అమ్ముతుంటారు. ఇలా రోజువారీగా వచ్చే నగదు ఆదాయాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు ఖాతాకి జమ చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఇలా నిధులు పక్కదారి పట్టిన విషయంలో ముగ్గురు ఉద్యోగులపై ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.

మొదట్లో తక్కువ సొమ్ము అని భావించిన అధికారులకు విచారణలో ముందుకు వెళుతున్న కొద్దీ కళ్ళు బైర్లు కమ్మాయి.  పరిశీలనలో రూ. 70,76,926 నిధులు మాయం అయినట్లు గుర్తించారు. 2013 నుంచి 2016 వరకు రికార్డులను గమనించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులకు తగినంత సమయం ఇవ్వడంతోబాటు.. వివరణ కోరడం కోసం షోకాజు నోటీసులు సైతం జారీ చేశారు. కానీ ఈ విషయంలో మాత్రం అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోనట్టే కనిపిస్తోంది. అసలు అవినీతి ఉద్యోగుల నుంచి సొమ్ము రికవరీ చేస్తారా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget