అన్వేషించండి

Karimnagar News: కరీంనగర్ రిజిస్ట్రేషన్ శాఖ నిర్లక్ష్యం, 70 లక్షల సొమ్ము రికవరీ కానట్టేనా?

Karimnagar News: కరీంనగర్ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్లక్ష్యం కారణంగా.. లక్షల్లో సొమ్ము మాయమైంది. ఇప్పటికైనా అధికారులు డబ్బును రికవరీ చేస్తారనుకుంటే.. దీన్ని కూడా పట్టించుకోవడం లేదు.  

Karimnagar News: ఆరు సంవత్సరాల కిందట జరిగిన అక్రమాలకు ఇంకా ముగింపు పలకడం లేదు కరీంనగర్ రిజిస్ట్రేషన్ శాఖ చెందిన అధికారులు. కాలం ముందుకు కదులుతున్నా లక్షల్లో మాయమైన సొమ్ము రికవరీ మాత్రం కావడం లేదు. కరీంనగర్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2016 మార్చి నెలలో బయట పడిన స్టాంపుల కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన సొమ్మును ఇంటి దొంగలే కొట్టేశారా? అనే విషయమై పలుమార్లు విచారణ జరిగింది. కొందరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఐదు రోజుల కిందట కార్యాలయంలోని ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా గతంలో జరిగిన కథ మళ్ళీ తెర మీదకు వచ్చింది. 

మాయమైన డబ్బు తిరిగి చేర్చడంలో నిర్లక్ష్యం..

జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో పర్యవేక్షణ లోపం నిర్వహణకు ప్రధాన శాపంగా మారుతోంది. ఆ డిపార్ట్మెంట్లో అత్యధిక రాబడిని ప్రతి ఆర్థిక సంవత్సరంలో అందించే జిల్లాగా కరీంనగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొందరు ఉద్యోగులు ఇష్టానుసారంగా చేస్తున్న వ్యవహారాలు మాయని మచ్చగానే మిగిలిపోతున్నాయి. 2016 లో జరిగిన గోల్ మాల్ వల్ల జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు చెడ్డ పేరు వచ్చింది. 3 ఏళ్ళ ముందే ఇక్కడ స్టాంపులను ఏ మాత్రం పరిరక్షణ లేకుండా అమ్ముతున్నారనే విషయాన్ని అప్పట్లో ఎడిట్ అధికారులు గుర్తించారు. అమ్మిన వాటికి, జమ చేసిన సొమ్ముకు భారీ తేడా ఉండడాన్ని కూడా గమనించారు. ఉన్నతాధికారులు అప్పట్లో తగిన దృష్టి పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని ఉంటే తర్వాత మళ్లీ ఇంత పెద్ద తప్పిదం జరిగేందుకు ఆస్కారం లేకపోయేది. 70.76 లక్షల కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత 2019 మార్చి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా నిలిపివేశారు. చలాన్ల తోపాటు ఆన్లైన్ తరహాలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకున్నారు. కానీ పెద్ద మొత్తంలో మాయమైన సొమ్మును తిరిగి చేర్చడంలో మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యమే ఇప్పటి వరకు కనిపించింది.

సొమ్ము స్వాధీనం అవుతుందా, లేదా?

ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే అక్రమంగా ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం.. స్వాధీన పరచుకునేలా ఉన్నతాధికారులు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలా చేస్తే భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండే ఆస్కారం ఉంటుంది.  స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని కరీంనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నాన్ జ్యూడిషియల్ స్టాంప్ కాగితాలు ప్రత్యేకంగా అతికించే ఫ్రాంక్లింగ్ యంత్రంతో స్టాంపులు అమ్ముతుంటారు. ఇలా రోజువారీగా వచ్చే నగదు ఆదాయాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు ఖాతాకి జమ చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఇలా నిధులు పక్కదారి పట్టిన విషయంలో ముగ్గురు ఉద్యోగులపై ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.

మొదట్లో తక్కువ సొమ్ము అని భావించిన అధికారులకు విచారణలో ముందుకు వెళుతున్న కొద్దీ కళ్ళు బైర్లు కమ్మాయి.  పరిశీలనలో రూ. 70,76,926 నిధులు మాయం అయినట్లు గుర్తించారు. 2013 నుంచి 2016 వరకు రికార్డులను గమనించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులకు తగినంత సమయం ఇవ్వడంతోబాటు.. వివరణ కోరడం కోసం షోకాజు నోటీసులు సైతం జారీ చేశారు. కానీ ఈ విషయంలో మాత్రం అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోనట్టే కనిపిస్తోంది. అసలు అవినీతి ఉద్యోగుల నుంచి సొమ్ము రికవరీ చేస్తారా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget