అన్వేషించండి

Karimnagar News: రైల్వే ఓవర్ బ్రిడ్జి రాజకీయాలపై కరీంనగర్ ప్రజలు ఆగ్రహం, కాలయాపన తప్పదా !

Karimnagar News: కరీంనగర్ పట్టణంలో అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టాలంటూ ప్రజల నుంచి వినతులు వస్తున్నాయి. వారి డిమమాండ్ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి.

Karimnagar News: అది కరీంనగర్ నడిబొడ్డున ఉన్న కీలకమైన ప్రాంతం. కొన్ని సంవత్సరాలుగా అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టాలంటూ ప్రజల నుండి వినతులు వస్తున్నాయి. వారి డిమాండ్ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నాయి. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం రైల్వే శాఖ 20% ఖర్చును భరించేందుకు ఎంఓయూ సైతం కుదుర్చుకున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకేం ఇక ట్రాఫిక్ కష్టాలు తీరుతాయంటూ ఆ రూట్ లో వెళ్లే ప్రయాణికులు సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఆ సంబరం ఎక్కువ రోజులు కొనసాగేలా లేదు. మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరుగుతున్న రాజకీయాల పట్ల కరీంనగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ పంచాయితీ?

కరీంనగర్ పట్టణానికి కీలకమైన రవాణా మార్గాల్లో ఒకటి కరీంనగర్ టు మంచిర్యాల రహదారి. తీగల గుట్టపల్లిలో ఉన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ ప్రధాన రహదారి పైనుండి రైల్వే పట్టాలు ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు హైదరాబాద్ కు తరలించే అంబులెన్స్లకు సైతం గేటు పడినప్పుడల్లా ఆలస్యం కారణంగా తిప్పలు తప్పడం లేదు. మరోవైపు ఇదే దారిలో పలు ప్రధాన ఆసుపత్రులు సైతం ఉన్నాయి. వారికోసం వచ్చిపోయే పేషంట్ల బంధువులు ఇతర సిబ్బందికి కూడా ఈ రైల్వే గేట్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక రోజువారీ ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు, సామాన్య ప్రజలు 20 సార్లు గేటు పడుతూ ఉండడంతో తమ సమయాన్ని అనవసరంగా వృథా చేసుకోవాల్సి వస్తుంది.

ఈ సమస్యను గుర్తించిన అప్పటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు 8 శాతం రాష్ట్రం వాటాతో రైల్వే శాఖ 20%  వాటాతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి ఎంఓయూ సైతం కుదిరింది. మొత్తం నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని దీనికోసం రాష్ట్రం 79.84 కోట్ల రూపాయలు భరించడానికి సంసిద్ధత వ్యక్తం చేయగా... రైల్వే శాఖ 20.16 కోట్ల రూపాయలు భరించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఈమధ్య కొత్తగా వచ్చిన జాతీయ రహదారుల శాఖ విధానం వల్ల మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. జూన్ 29వ తేదీన అమల్లోకి వచ్చిన దీని ప్రకారం రాష్ట్ర రహదారులపై కొత్తగా నిర్మించబోయే ఆర్ఓబీలు ఆర్యూబీలకు సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుండే నిధులు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ రోడ్లపై 57 ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. అయితే తీగల గుట్టపల్లి రైల్వే బ్రిడ్జిని సైతం ఇదే ఒప్పందంలో చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలను ఆపేసింది. దీంతో ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్న ప్రాజెక్టును ఏ రకంగా ఆపివేస్తారంటూ  ఇటు బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఒక్క ప్రాజెక్టుకి నిధుల విడుదలకు ఇబ్బంది ఏంటని  టీఆర్ఎస్ నాయకులు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. మధ్యలో మాత్రం సామాన్య ప్రజలు సమస్యతో నలిగిపోతూనే ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget