అన్వేషించండి

Karimnagar News: ఢిల్లీ స్థాయిలో మారుగుతున్న కరీంనగర్ పేరు- క్యూ కడుతున్న కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు

Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు కేసుల విచారణ కొరకు కేంద్ర ఏజెన్సీలు వరుస దాడులు జరుపుతున్నాయి. అప్పటి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసు నుంచి నిన్నటి ఈడి దాడుల వరకు కరీంనగర్ వేదికైంది.

Karimnagar News: గత కొద్ది నెలలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో కేంద్ర ఏజెన్సీల వరుస దాడులు కలవరం రేపుతున్నాయి. హోం శాఖ పరిధిలోకి వచ్చే కీలకమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్,  ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు.. పలు వేరు వేరు కేసులను విచారించడానికి దూకుడు పెంచాయి. అన్ని కేసులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో లింకు ఉండడమే ఇక్కడ విచిత్రం. అప్పటి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసు నుంచి నిన్నటి ఈడీ దాడుల వరకు కరీంనగర్ లోని వ్యక్తులే ఏజెన్సీలకు టార్గెట్ అవుతున్నాయి.

మొదట  ఎన్ఐఏ..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నిజామాబాద్ కేంద్రంగా "పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా "అనే స్వచ్ఛంద సంస్థ ముసుగులో తమ మతానికి చెందిన యువకులకు ఆయుధ శిక్షణ ఇవ్వడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. దీనిపై దృష్టి సారించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉన్నతాధికారులు నిజామాబాద్‌లో అతన్ని అరెస్టు చేసిన వెంటనే అతని ఇచ్చిన సమాచారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భవిష్యత్తులో మరో మతానికి చెందిన నాయకులను, పండుగలను టార్గెట్ చేసి విధ్వంసం సృష్టించాలని ప్లాన్ ని మొదట్లోనే వమ్ము చేశారు. అయితే ఈ కేసులో జిల్లాకు చెందిన పలువురు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. చివరకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని నిషేధిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసే వరకు వెళ్లింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కరీంనగర్ వాసి..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వెన్నమనేని శ్రీనివాసరావు కీలక పాత్ర వహించారంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకోవడంతో జిల్లా మరొక్క మారు ఉలిక్కిపడింది. శ్రీనివాసరావుకి కరీంనగర్‌లోని పలువురు నాయకులు, అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఒక్కసారిగా జిల్లాలో సంచలనం రేకిత్తించింది. పైగా కోట్ల కొద్ది సొమ్ము వివిధ మార్గాల ద్వారా తరలించారని ఆరోపణలు రావడంతో లోతుగా విచారించడానికి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు సమాచారం రాబట్టే పనిలో పడ్డారు. దీంతో ఎవరి పేరు ఎప్పుడు బయటకు వస్తుందోనని టెన్షన్ కరీంనగర్ చెందిన కొందరు వ్యక్తుల్లో నెలకొంది. మరోవైపు నకిలీ ఐటీ కంపెనీలతో డబ్బులు తరలించాలని పేర్కొనగా ఐటి కంపెనీ యజమానులు సైతం జిల్లాకు చెందిన వారిని ఏజెన్సీ అధికారులు గుర్తించారు ఇప్పటికీ రోజుకో మలుపు తిరుగుతున్న లిక్కర్ స్కాం చివరికి జిల్లా వాసుల్లో ఇంకా ఎవరి అరెస్టులకు దారితీస్తుందోనని చర్చించుకుంటున్నారు.

ఏకంగా మంత్రి ఇంటిలోనే వివరాల సేకరణ!

దాదాపుగా దశాబ్ద కాలం కిందట కరీంనగర్ కు చెందిన గ్రానైట్ కంపెనీలు అక్రమంగా విదేశాలకు పెద్ద ఎత్తున బ్లాక్ లను తరలించి పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని వచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకుని అటు సీబీఐ, ఇటు ఈడీ, ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు జరపడం పెను సంచలనానికి కారణమైంది. జిల్లాకి చెందిన కీలక నేత మంత్రి గంగుల కమలాకర్ కంపెనీలో సోదాలతోపాటు... ఏకంగా ఆయన ఇంటి తాళం పగల కొట్టి మరీ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. మరోవైపు హుటాహుటిన దుబాయ్ పర్యటనను విరమించుకొని వచ్చిన గంగుల కమలాకర్ దర్యాప్తుకు సహకరిస్తారని పేర్కొన్నారు. అయితే కమలాకర్ తో పాటు దాడులకు గురైన కంపెనీలన్నీ కరీంనగర్ కి చెందినవే కావడం గమనార్హం.

దీంతో దేశ వ్యాప్తంగా వివిధ కేసుల్లో కేంద్ర ఏజెన్సీల విచారణకు కరీంనగర్ సెంటర్ గా మారుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల కేంద్ర ఏజెన్సీలు కరీంనగర్ ని వరుస పెట్టి టార్గెట్ చేస్తున్నాయని రానున్న రోజుల్లో ఇది ఎటువైపు దారి తీస్తుందోనని చర్చించుకుంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu Morphed Videos: మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Embed widget