అన్వేషించండి

అంతా సైలెన్స్- ఈడీ ప్రకటనతో గ్రానైట్‌ పరిశ్రమ యాజమాన్యాల్లో టెన్షన్

దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ వెంటనే తిరిగి వచ్చి ఈడికి సహకరిస్తానంటూ ప్రకటించారు. ఇతర కంపెనీలు సైతం వీలైనంత వరకు మౌనం పాటించాయి.

అప్పటి వరకు రోజువారి కార్యకలాపాలతో హడావిడిగా ఉండే గ్రానైట్ పరిశ్రమ కంపెనీల యజమానులు ఈడీ దాడుల తర్వాత మౌనంగా ఉన్నాయి. ఇక్కడ 30 ఏళ్ల నుంచి కంపెనీలను నిర్వహిస్తున్న శ్వేతా గ్రానైట్స్ లాంటి కంపెనీపై కూడా ఈడీ దాడులు చేసింది. మంత్రి కమలాకర్ కుటుంబానికి చెందిన ఈ కంపెనీ కార్యాలయం, మంత్రి ఇంట్లో కూడా ఈడి బృందాలు సోదాలు జరిపింది. ఈ సోదాలు జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపాయి. 

దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ వెంటనే తిరిగి వచ్చి ఈడికి సహకరిస్తానంటూ ప్రకటించారు. ఇతర కంపెనీలు సైతం వీలైనంత వరకు మౌనం పాటించాయి. పదో తారీఖున మళ్లీ గ్రానైట్ కంపెనీల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించిన ఈడీ, ఐటి బృందాలు అక్కడే పలువురిని విచారించాయి. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాయి. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నందున క్లారిటీ ఇచ్చేందుకు ఈడీీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఈడీ దాడుల కారణంగా నడుస్తున్న చర్చకు ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది. ఒక్కసారిగా కరీంనగర్‌లో కలకలం రేగింది. మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నట్టుగానే గ్రానైట్ కంపెనీలు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డాయని ఈడి అందులో స్పష్టంగా పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేనిదే ఈడి లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇలాంటి ఆరోపణలు చేయదన్న చర్చ నడుస్తోంది. పలువురు ఉద్యోగులను బినామీలుగా చూపించి వారి అకౌంట్లో పెద్ద ఎత్తున నగదు బదిలీ అయ్యేవిధంగా వ్యవహరించారని ఈడీ తన ప్రకటనలో తెలిపింది. ఇలా చేయడం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమేనని ఇది తీవ్రమైన ఆర్థిక నేరంగానే పరిగణిస్తారని గత కేసుల చెబుతున్నాయి. 

కావాల్సినంత సమయం దొరికినప్పటికీ విజిలెన్స్ నివేదిక ఇచ్చిన విధంగా కోట్ల రూపాయల పన్ను ఎగవేతకి పాల్పడి.. అవకాశం ఇచ్చినా కట్టలేదని పేర్కొంది. అక్రమంగా దొరికిన సొమ్ము ఎంత తక్కువైనా.. ఈడీ దానిని నేరంగానే పరిగణిస్తుంది. అలాంటిది కోటి ఎనిమిది లక్షల రూపాయలు లెక్కలో లేని సొమ్ము ఈ దాడుల్లో దొరికాయని ప్రకటనలో పేర్కొంది. పలు కీలక పత్రాలలో స్వాధీనం చేసుకున్నామని దీనికి సంబంధించి విచారణ సైతం కొనసాగుతోందని స్పష్టం చేసింది.

ఏమరుపాటే కొంపముంచిందా?

గత పది ఏళ్ళుగా పలుమార్లు గ్రానైట్ కంపెనీలపై నేతల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు బిజెపి నేతలు బండి సంజయ్, పేరాల శేఖర్‌రావు గ్రానైట్ కంపెనీలపై విచారణ జరిపించాలని కేంద్రంలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌కు చెందిన లాయర్ బేతి మహేందర్ రెడ్డి పూర్తి గణాంకాలతో సహా ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మరో స్థానిక నేత సైతం దీనిపై కేంద్రంలో ఫిర్యాదు చేశారు. అయితే గ్రానైట్ కంపెనీలకు ఇవేవీ సీరియస్‌గా కనిపించలేదు. 


పదేళ్లుగా గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలు రావడం...  దాడులు చేస్తారంటూ ప్రచారం జరగడం మామూలైపోయింది. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. అందుకే కొందరు పరిణామాలకు అనుగుణంగా మారి తప్పులను సరిదిద్దుకున్నట్లు తెలిసింది. మరికొందరు మాత్రం నిర్లక్ష్యం చేసి ఆధారాలతో దొరికిపోయారని టాక్. రానున్న రోజుల్లో ఈ కేసు ఎంత సీరియస్‌గా మారుతుందోనని టెన్షన్ పడుతున్నారు. వారిపై ఆధారపడి బతుకుతున్న వేలా కార్మికులు సైతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget