అన్వేషించండి

అంతా సైలెన్స్- ఈడీ ప్రకటనతో గ్రానైట్‌ పరిశ్రమ యాజమాన్యాల్లో టెన్షన్

దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ వెంటనే తిరిగి వచ్చి ఈడికి సహకరిస్తానంటూ ప్రకటించారు. ఇతర కంపెనీలు సైతం వీలైనంత వరకు మౌనం పాటించాయి.

అప్పటి వరకు రోజువారి కార్యకలాపాలతో హడావిడిగా ఉండే గ్రానైట్ పరిశ్రమ కంపెనీల యజమానులు ఈడీ దాడుల తర్వాత మౌనంగా ఉన్నాయి. ఇక్కడ 30 ఏళ్ల నుంచి కంపెనీలను నిర్వహిస్తున్న శ్వేతా గ్రానైట్స్ లాంటి కంపెనీపై కూడా ఈడీ దాడులు చేసింది. మంత్రి కమలాకర్ కుటుంబానికి చెందిన ఈ కంపెనీ కార్యాలయం, మంత్రి ఇంట్లో కూడా ఈడి బృందాలు సోదాలు జరిపింది. ఈ సోదాలు జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపాయి. 

దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ వెంటనే తిరిగి వచ్చి ఈడికి సహకరిస్తానంటూ ప్రకటించారు. ఇతర కంపెనీలు సైతం వీలైనంత వరకు మౌనం పాటించాయి. పదో తారీఖున మళ్లీ గ్రానైట్ కంపెనీల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించిన ఈడీ, ఐటి బృందాలు అక్కడే పలువురిని విచారించాయి. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాయి. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నందున క్లారిటీ ఇచ్చేందుకు ఈడీీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఈడీ దాడుల కారణంగా నడుస్తున్న చర్చకు ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది. ఒక్కసారిగా కరీంనగర్‌లో కలకలం రేగింది. మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నట్టుగానే గ్రానైట్ కంపెనీలు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డాయని ఈడి అందులో స్పష్టంగా పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేనిదే ఈడి లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇలాంటి ఆరోపణలు చేయదన్న చర్చ నడుస్తోంది. పలువురు ఉద్యోగులను బినామీలుగా చూపించి వారి అకౌంట్లో పెద్ద ఎత్తున నగదు బదిలీ అయ్యేవిధంగా వ్యవహరించారని ఈడీ తన ప్రకటనలో తెలిపింది. ఇలా చేయడం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమేనని ఇది తీవ్రమైన ఆర్థిక నేరంగానే పరిగణిస్తారని గత కేసుల చెబుతున్నాయి. 

కావాల్సినంత సమయం దొరికినప్పటికీ విజిలెన్స్ నివేదిక ఇచ్చిన విధంగా కోట్ల రూపాయల పన్ను ఎగవేతకి పాల్పడి.. అవకాశం ఇచ్చినా కట్టలేదని పేర్కొంది. అక్రమంగా దొరికిన సొమ్ము ఎంత తక్కువైనా.. ఈడీ దానిని నేరంగానే పరిగణిస్తుంది. అలాంటిది కోటి ఎనిమిది లక్షల రూపాయలు లెక్కలో లేని సొమ్ము ఈ దాడుల్లో దొరికాయని ప్రకటనలో పేర్కొంది. పలు కీలక పత్రాలలో స్వాధీనం చేసుకున్నామని దీనికి సంబంధించి విచారణ సైతం కొనసాగుతోందని స్పష్టం చేసింది.

ఏమరుపాటే కొంపముంచిందా?

గత పది ఏళ్ళుగా పలుమార్లు గ్రానైట్ కంపెనీలపై నేతల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు బిజెపి నేతలు బండి సంజయ్, పేరాల శేఖర్‌రావు గ్రానైట్ కంపెనీలపై విచారణ జరిపించాలని కేంద్రంలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌కు చెందిన లాయర్ బేతి మహేందర్ రెడ్డి పూర్తి గణాంకాలతో సహా ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మరో స్థానిక నేత సైతం దీనిపై కేంద్రంలో ఫిర్యాదు చేశారు. అయితే గ్రానైట్ కంపెనీలకు ఇవేవీ సీరియస్‌గా కనిపించలేదు. 


పదేళ్లుగా గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలు రావడం...  దాడులు చేస్తారంటూ ప్రచారం జరగడం మామూలైపోయింది. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. అందుకే కొందరు పరిణామాలకు అనుగుణంగా మారి తప్పులను సరిదిద్దుకున్నట్లు తెలిసింది. మరికొందరు మాత్రం నిర్లక్ష్యం చేసి ఆధారాలతో దొరికిపోయారని టాక్. రానున్న రోజుల్లో ఈ కేసు ఎంత సీరియస్‌గా మారుతుందోనని టెన్షన్ పడుతున్నారు. వారిపై ఆధారపడి బతుకుతున్న వేలా కార్మికులు సైతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
Embed widget