అన్వేషించండి

అంతా సైలెన్స్- ఈడీ ప్రకటనతో గ్రానైట్‌ పరిశ్రమ యాజమాన్యాల్లో టెన్షన్

దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ వెంటనే తిరిగి వచ్చి ఈడికి సహకరిస్తానంటూ ప్రకటించారు. ఇతర కంపెనీలు సైతం వీలైనంత వరకు మౌనం పాటించాయి.

అప్పటి వరకు రోజువారి కార్యకలాపాలతో హడావిడిగా ఉండే గ్రానైట్ పరిశ్రమ కంపెనీల యజమానులు ఈడీ దాడుల తర్వాత మౌనంగా ఉన్నాయి. ఇక్కడ 30 ఏళ్ల నుంచి కంపెనీలను నిర్వహిస్తున్న శ్వేతా గ్రానైట్స్ లాంటి కంపెనీపై కూడా ఈడీ దాడులు చేసింది. మంత్రి కమలాకర్ కుటుంబానికి చెందిన ఈ కంపెనీ కార్యాలయం, మంత్రి ఇంట్లో కూడా ఈడి బృందాలు సోదాలు జరిపింది. ఈ సోదాలు జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపాయి. 

దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ వెంటనే తిరిగి వచ్చి ఈడికి సహకరిస్తానంటూ ప్రకటించారు. ఇతర కంపెనీలు సైతం వీలైనంత వరకు మౌనం పాటించాయి. పదో తారీఖున మళ్లీ గ్రానైట్ కంపెనీల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించిన ఈడీ, ఐటి బృందాలు అక్కడే పలువురిని విచారించాయి. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాయి. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నందున క్లారిటీ ఇచ్చేందుకు ఈడీీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఈడీ దాడుల కారణంగా నడుస్తున్న చర్చకు ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది. ఒక్కసారిగా కరీంనగర్‌లో కలకలం రేగింది. మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నట్టుగానే గ్రానైట్ కంపెనీలు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డాయని ఈడి అందులో స్పష్టంగా పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేనిదే ఈడి లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇలాంటి ఆరోపణలు చేయదన్న చర్చ నడుస్తోంది. పలువురు ఉద్యోగులను బినామీలుగా చూపించి వారి అకౌంట్లో పెద్ద ఎత్తున నగదు బదిలీ అయ్యేవిధంగా వ్యవహరించారని ఈడీ తన ప్రకటనలో తెలిపింది. ఇలా చేయడం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమేనని ఇది తీవ్రమైన ఆర్థిక నేరంగానే పరిగణిస్తారని గత కేసుల చెబుతున్నాయి. 

కావాల్సినంత సమయం దొరికినప్పటికీ విజిలెన్స్ నివేదిక ఇచ్చిన విధంగా కోట్ల రూపాయల పన్ను ఎగవేతకి పాల్పడి.. అవకాశం ఇచ్చినా కట్టలేదని పేర్కొంది. అక్రమంగా దొరికిన సొమ్ము ఎంత తక్కువైనా.. ఈడీ దానిని నేరంగానే పరిగణిస్తుంది. అలాంటిది కోటి ఎనిమిది లక్షల రూపాయలు లెక్కలో లేని సొమ్ము ఈ దాడుల్లో దొరికాయని ప్రకటనలో పేర్కొంది. పలు కీలక పత్రాలలో స్వాధీనం చేసుకున్నామని దీనికి సంబంధించి విచారణ సైతం కొనసాగుతోందని స్పష్టం చేసింది.

ఏమరుపాటే కొంపముంచిందా?

గత పది ఏళ్ళుగా పలుమార్లు గ్రానైట్ కంపెనీలపై నేతల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు బిజెపి నేతలు బండి సంజయ్, పేరాల శేఖర్‌రావు గ్రానైట్ కంపెనీలపై విచారణ జరిపించాలని కేంద్రంలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌కు చెందిన లాయర్ బేతి మహేందర్ రెడ్డి పూర్తి గణాంకాలతో సహా ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మరో స్థానిక నేత సైతం దీనిపై కేంద్రంలో ఫిర్యాదు చేశారు. అయితే గ్రానైట్ కంపెనీలకు ఇవేవీ సీరియస్‌గా కనిపించలేదు. 


పదేళ్లుగా గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలు రావడం...  దాడులు చేస్తారంటూ ప్రచారం జరగడం మామూలైపోయింది. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. అందుకే కొందరు పరిణామాలకు అనుగుణంగా మారి తప్పులను సరిదిద్దుకున్నట్లు తెలిసింది. మరికొందరు మాత్రం నిర్లక్ష్యం చేసి ఆధారాలతో దొరికిపోయారని టాక్. రానున్న రోజుల్లో ఈ కేసు ఎంత సీరియస్‌గా మారుతుందోనని టెన్షన్ పడుతున్నారు. వారిపై ఆధారపడి బతుకుతున్న వేలా కార్మికులు సైతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
Telangana Indiramamma Kutumba Jeevita Beema Scheme : తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
Telangana Budget 2026-27: నేడు 3.36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!
నేడు 3.36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
Vijayd Deverakonda Rashmika : చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget