అన్వేషించండి

అంతా సైలెన్స్- ఈడీ ప్రకటనతో గ్రానైట్‌ పరిశ్రమ యాజమాన్యాల్లో టెన్షన్

దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ వెంటనే తిరిగి వచ్చి ఈడికి సహకరిస్తానంటూ ప్రకటించారు. ఇతర కంపెనీలు సైతం వీలైనంత వరకు మౌనం పాటించాయి.

అప్పటి వరకు రోజువారి కార్యకలాపాలతో హడావిడిగా ఉండే గ్రానైట్ పరిశ్రమ కంపెనీల యజమానులు ఈడీ దాడుల తర్వాత మౌనంగా ఉన్నాయి. ఇక్కడ 30 ఏళ్ల నుంచి కంపెనీలను నిర్వహిస్తున్న శ్వేతా గ్రానైట్స్ లాంటి కంపెనీపై కూడా ఈడీ దాడులు చేసింది. మంత్రి కమలాకర్ కుటుంబానికి చెందిన ఈ కంపెనీ కార్యాలయం, మంత్రి ఇంట్లో కూడా ఈడి బృందాలు సోదాలు జరిపింది. ఈ సోదాలు జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపాయి. 

దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ వెంటనే తిరిగి వచ్చి ఈడికి సహకరిస్తానంటూ ప్రకటించారు. ఇతర కంపెనీలు సైతం వీలైనంత వరకు మౌనం పాటించాయి. పదో తారీఖున మళ్లీ గ్రానైట్ కంపెనీల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించిన ఈడీ, ఐటి బృందాలు అక్కడే పలువురిని విచారించాయి. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాయి. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నందున క్లారిటీ ఇచ్చేందుకు ఈడీీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఈడీ దాడుల కారణంగా నడుస్తున్న చర్చకు ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది. ఒక్కసారిగా కరీంనగర్‌లో కలకలం రేగింది. మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నట్టుగానే గ్రానైట్ కంపెనీలు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డాయని ఈడి అందులో స్పష్టంగా పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేనిదే ఈడి లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇలాంటి ఆరోపణలు చేయదన్న చర్చ నడుస్తోంది. పలువురు ఉద్యోగులను బినామీలుగా చూపించి వారి అకౌంట్లో పెద్ద ఎత్తున నగదు బదిలీ అయ్యేవిధంగా వ్యవహరించారని ఈడీ తన ప్రకటనలో తెలిపింది. ఇలా చేయడం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమేనని ఇది తీవ్రమైన ఆర్థిక నేరంగానే పరిగణిస్తారని గత కేసుల చెబుతున్నాయి. 

కావాల్సినంత సమయం దొరికినప్పటికీ విజిలెన్స్ నివేదిక ఇచ్చిన విధంగా కోట్ల రూపాయల పన్ను ఎగవేతకి పాల్పడి.. అవకాశం ఇచ్చినా కట్టలేదని పేర్కొంది. అక్రమంగా దొరికిన సొమ్ము ఎంత తక్కువైనా.. ఈడీ దానిని నేరంగానే పరిగణిస్తుంది. అలాంటిది కోటి ఎనిమిది లక్షల రూపాయలు లెక్కలో లేని సొమ్ము ఈ దాడుల్లో దొరికాయని ప్రకటనలో పేర్కొంది. పలు కీలక పత్రాలలో స్వాధీనం చేసుకున్నామని దీనికి సంబంధించి విచారణ సైతం కొనసాగుతోందని స్పష్టం చేసింది.

ఏమరుపాటే కొంపముంచిందా?

గత పది ఏళ్ళుగా పలుమార్లు గ్రానైట్ కంపెనీలపై నేతల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు బిజెపి నేతలు బండి సంజయ్, పేరాల శేఖర్‌రావు గ్రానైట్ కంపెనీలపై విచారణ జరిపించాలని కేంద్రంలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌కు చెందిన లాయర్ బేతి మహేందర్ రెడ్డి పూర్తి గణాంకాలతో సహా ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మరో స్థానిక నేత సైతం దీనిపై కేంద్రంలో ఫిర్యాదు చేశారు. అయితే గ్రానైట్ కంపెనీలకు ఇవేవీ సీరియస్‌గా కనిపించలేదు. 


పదేళ్లుగా గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలు రావడం...  దాడులు చేస్తారంటూ ప్రచారం జరగడం మామూలైపోయింది. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. అందుకే కొందరు పరిణామాలకు అనుగుణంగా మారి తప్పులను సరిదిద్దుకున్నట్లు తెలిసింది. మరికొందరు మాత్రం నిర్లక్ష్యం చేసి ఆధారాలతో దొరికిపోయారని టాక్. రానున్న రోజుల్లో ఈ కేసు ఎంత సీరియస్‌గా మారుతుందోనని టెన్షన్ పడుతున్నారు. వారిపై ఆధారపడి బతుకుతున్న వేలా కార్మికులు సైతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bandi Bhagirath Files:బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
Karimnagar Tension: కరీంనగర్‌లో పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు! బండి, రేవంత్ కలిసి తనను చంపే కుట్ర చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు!
కరీంనగర్‌లో పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు! బండి, రేవంత్ కలిసి తనను చంపే కుట్ర చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు!
Karimnagar Tension: కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల విధ్వంసం! గంగుల క్యాంప్ ఆఫీస్‌పై దాడి!బండిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం!
కరీంనగర్‌లో బీజేపీ శ్రేణుల విధ్వంసం! గంగుల క్యాంప్ ఆఫీస్‌పై దాడి!బండిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం!
KTR Cases: కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు! రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ అటాక్! 
కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు! రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ అటాక్! 

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS MI Result Update: టాప్ ర్యాంకు కు ఆర్సీబీ.. MIపై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన క్రునాల్, భువ‌నేశ్వ‌ర్, టోర్నీ నుంచి ముంబై ఔట్
టాప్ ర్యాంకు కు ఆర్సీబీ.. MIపై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన క్రునాల్, భువ‌నేశ్వ‌ర్, టోర్నీ నుంచి ముంబై ఔట్
Bandi Sanjay Speech: నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు, ఏ తప్పు చేయలేదు.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ అన్న నోరు నాది.. బండి సంజయ్
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Sreemukhi New House: కొత్త ఇంట్లో అడుగుపెట్టిన శ్రీముఖి... బర్త్ డే స్పెషల్ - ఫోటోలు చూశారా?
కొత్త ఇంట్లో అడుగుపెట్టిన శ్రీముఖి... బర్త్ డే స్పెషల్ - ఫోటోలు చూశారా?
Renault Mini Duster: 30 కి.మీ మైలేజ్‌తో వస్తున్న రెనాల్ట్ మినీ డస్టర్ Renault Bridger .. బెస్ట్ ఫీచర్లలో లాంచ్
30 కి.మీ మైలేజ్‌తో వస్తున్న రెనాల్ట్ మినీ డస్టర్ Renault Bridger .. బెస్ట్ ఫీచర్లలో లాంచ్
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
Embed widget