అన్వేషించండి

Karimnagar News : కరీంనగర్ ప్రజలకు శుభవార్త- జమ్మికుంటలో ఆగనున్న దాణాపూర్ ఎక్స్ ప్రెస్

Telangana News: సికింద్రాబాద్ – దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు (12791/92) ఈనెల 12 నుంచి జమ్మికుంటలో ఆగనుంది. ప్రతిరోజు ఉదయం 11 నుంచి 11.30  గంటల మధ్య జమ్మికుంటలో ఈ రైలు ఆగనుంది.

Bandi Sanjay News: కరీంనగర్ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న చిరకాల వాంఛ నెరవేర్చనుంది. సికింద్రాబాద్ – దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు (12791/92) ఈనెల 12 నుంచి జమ్మికుంటలో ఆగనుంది. ప్రతిరోజు ఉదయం 11 నుంచి 11.30  గంటల మధ్య జమ్మికుంటలో ఈ రైలు ఆగనుంది.

 దాణాపూర్ ఎక్స్ ప్రెస్‌ను జమ్మికుంటలో ఆపేలా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గత కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యాసాధ్యాలపై రైల్వే శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో స్వయంగా మాట్లాడారు. తప్పనిసరిగా జమ్మికుంటలో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ నుంచి దాణాపూర్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలును జమ్మికుంట స్టేషన్‌లో ఆగేలా ఏర్పాట్లు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ప్రతిరోజు ఉదయం 9 గంటల 25 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరే దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ఖాజీపేట మీదుగా జమ్మికుంట చేరుకోనుంది. ఉదయం 11 నుంచి 11.30  గంటల మధ్య జమ్మికుంటలో ఈ రైలు ఆగుతుంది. అక్కడి నుంచి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బళ్లార్షా, చంద్రాపూర్, నాగపూర్ మీదుగా జబల్ పూర్, సాత్నా, వారణాసి(కాశీ), బక్సర్ మీదుగా 5 రాష్ట్రాలు ప్రయాణించి దాణపూర్ చేరుకుంటుంది. జమ్మికుంటతో కలిసి మొత్తం 30 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. దాదాపు 34 గంటలపాటు నడిచే ఈ రైలు 1830 కి.మీలు ప్రయాణించనుంది. 

మహారాష్ట్రలోని నాగపూర్‌తోపాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీ వెళ్లాలనుకునే ప్రయాణీకులకు దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ఎంతో ఉపయోగపడనుంది. దాణాపూర్ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. ప్రయోగాత్మకంగా మాత్రమే ఈ రైలును జమ్మికుంటలో ఆపుతున్నామని, ప్రయాణీకుల రద్దీ, డిమాండ్‌ను బట్టి రెగ్యులర్‌గా నడిపేలా చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.

దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలును జమ్మికుంటలో ఆపడంపై బండి సంజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైల్వే శాఖ అధికారులకు థాంక్స్ చెప్పారు. నాగపూర్, కాశీ సహా ప్రసిద్ధ పట్టణాలతోపాటు 5 రాష్ట్రాలకు వెళ్లాలనుకునే ప్రయాణీకులంతా ఈ రైలును వినియోగించుకోవాలని కోరారు. 
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రైల్వే శాఖ నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేశారు. దాణాపూర్ ఎక్స్ ప్రెస్‌తో కాశీ, నాగపూర్ వంటి పట్టణాలకు నేరుగా వెళ్లే అవకాశం కలిగిందని, తద్వారా ఎంతో సమయం, డబ్బు ఆదా అవుతాయని అభిప్రాయపడ్డారు. తమ విజ్ఞప్తికి స్పందించిన బండి సంజయ్‌కు, రైల్వే శాఖకు ధన్యావాదాలు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget