By: ABP Desam | Updated at : 13 May 2023 09:58 PM (IST)
బండి సంజయ్ (ఫైల్ ఫోటో)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీ ఓటమిపై పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పందించారు. దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి.. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓట్లు తగ్గలేదని, 36 శాతం ఓట్లు సాధించాం అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ డబ్బులు ఖర్చు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 5 శాతం ఓటింగ్ పెరిగింది, జేడీఎస్ ఓట్లు 7 శాతం తగ్గాయన్నారు.
కర్ణాటకలో అన్ని పార్టీలు కలిసి మతతత్వ రాజకీయాలు చేశాయని బండి సంజయ్ ఆరోపించారు. అన్ని పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాయి 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని, ముస్లిం రిజర్వేషన్లు అని ఇతర పార్టీలు మతతత్వ రాజకీయాలు చేశాయి. జేడీఎస్ అధ్యక్షుడు బహిరంగంగానే తమ పార్టీ ఓట్లను కాంగ్రెస్ కు వేయాలని సూచించారని గుర్తుచేశారు. ఎంఐఎం, ఎన్డీపీఐ, జేడీఎస్, కాంగ్రెస్ అందరూ కలిశారని బండి సంజయ్ ఆరోపించారు.
రేపు బజరంగ్ దళ్ ని నిషేదించి.. pfiపై నిషేధం ఎత్తివేస్తారు. 4శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రేపు తెలంగాణలో కలిసే పోటీ చేస్తాయని, కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నేతలకు డబ్బు సాయం చేసిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ హైదరాబాద్ లో పెట్టేందుకు కేసీఆర్ సహాయం చేస్తారన్నారు.
Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్మ్యాన్
Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!
TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథమిక కీ విడుదల! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
TSPSC Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఊహించని గెస్ట్!