అన్వేషించండి

Prakash Javadekar: తెలంగాణపై మాకు ఎలాంటి వివక్ష లేదు, అప్పుడు కేసీఆరే మమ్మల్ని మెచ్చుకున్నారు - కరీంనగర్‌లో కేంద్ర మంత్రి

Prakash Javadekar: దేశంలో మరోసారి బీజేపీ సర్కారు వస్తుందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణా లేదని హర్షం వ్యక్తం చేశారు.

Prakash Javadekar: దేశంలో మరోసారి బీజేపీ సర్కారే వస్తుందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. దేశమే ప్రథమ ప్రాధాన్యంగా మోదీ పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాల అవినీతి ఆరోపణలు కూడా లేవని అన్నారు. బీజేపీ సర్కారు హయాంలో దేశం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. తమది 24 గంటలు పని చేసే ప్రభుత్వమని తెలిపారు. దేశంలో అవినీతి రహిత సర్కార్ ను మొదటి సారి చూస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించడానికి బీజేపీ దేశవ్యాప్తంగా సంపర్క్ అభియాన్ సభలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ప్రకాష్ జవదేకర్ ఆదివారం కరీంనగర్ లో పర్యటించి మీడియాతో మాట్లాడారు. 

'తెలంగాణ మీద ఎలాంటి వివక్షా లేదు'

కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ప్రకాష్ జవదేకర్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చామని, తెలంగాణ మీద ఎలాంటి వివక్ష లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బీజేపీ సర్కారును మెచ్చుకున్నట్లు గుర్తు చేశారు. నేషనల్ థర్మల్ ప్రాజెక్టు, రామగుండం ఎరువుల కర్మాగారం ఇచ్చామని తెలిపారు. తెలంగాణలోనే ఎక్కువ రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. పంటలకు మద్దతు ధర విషయంలో మోదీ సర్కారు రైతులకు మేలు చేసినట్లు పేర్కొన్నారు. వరి సహా ఇతర పంటలకు మద్దతు ధరలు పెంచినట్లు వెల్లడించారు. యూపీఏలో కేసీఆర్ భాగస్వామిగా ఉండి మద్దతు ధర పెంచలేకపోయారని ప్రకాష్ జవదేకర్ విమర్శించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎరువుల ధరలు భారీగా పెరిగినా.. రైతులపై భారం పడకుండా సబ్సిడీ పెంచినట్లు తెలిపారు. పాల ఉత్పత్తిలో దేశం నంబర్ వన్, చేపల ఉత్పత్తిలో రెండో స్థానం, వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు.

కాగా, ఇవాళ(మే 11) కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ పర్యటనకు రానున్నారు. నగరంలో అమిత్ షా బహిరంగ సభ సందర్బంగా నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో బందోబస్తుకు సంబంధించి అధికారులతో విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.సి.యం.త్రివిక్రమ వర్మ సమావేశం నిర్వహించారు. మొత్తం నలుగురు డిసిపీ లు, రెండు ఏ.పి.ఎస్.పి ప్లటూన్లు, 04 స్పెషల్ పార్టీ లతో మొత్తంగా 950 సిబ్బంది, అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బందో బస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించే ప్రాంతాలైన ఐ.ఎన్.ఎస్ డేగ, ఎయిర్ పోర్ట్, వాల్తేరు రైల్వే గ్రౌండ్స్ బస చేయనున్న పోర్టు గెస్ట్ హౌస్, సాగర్ మాల కన్విక్షన్ సెంటర్ తో పాటూ ఆయన పర్యటించనున్న ప్రతీ ప్రాంతంలో పటిష్ట బందోబస్తు నిర్వహించాలని అధికారులను విశాఖ సీపీ ఆదేశించారు. వాస్తవానికి అమిత్ షా ఈనెల 8న విశాఖకు రావాల్సి ఉంది. కానీ వేరే కార్యక్రమాలు ఉన్నందున విశాఖ పర్యటనను ఈ ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. కాగా, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరుసటి రోజే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనతో ఏపీపై బీజేపీ పట్టుకోసం ఫోకస్ చేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Pawan Kalyan Press Meet:రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget