అన్వేషించండి

Bandi Sanjay: కరీంనగర్‌లో టెక్నికల్ యూనివర్సిటీ, పీవీ స్వస్థలంలో నవోదయ ఏర్పాటు - కేంద్రాన్ని కోరిన బండి సంజయ్

Telangana News | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన ను కలిసిన ఆయన కరీంనగర్ జిల్లాలో టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటును కోరారు.

Technical University in Karimnagar District | న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లాలో టెక్నికల్ యూనివర్సిటీని స్థాపించాలని బండి సంజయ్ కేంద్రాన్ని కోరారు. కరీంనగర్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బుధవారం నాడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ని ఢిల్లీలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో ఇంజినీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు చేసే విద్యార్థులకు టెక్నికల్ యూనివర్సిటీ వల్ల నైపుణ్య అభివృద్ధి, టెక్నికల్ విద్య లభిస్తుందని వివరించారు.

మాజీ ప్రధాని పీవీ స్వస్థలంలో నవోదయ విద్యాలయ ఏర్పాటు

మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న పీవీ నర్సింహారావు (PV NarasimhaRao) గారి స్వస్థలం వంగరలో నవోదయ విద్యాలయాన్ని (Navodaya School) ఏర్పాటు చెయ్యాలని కేంద్ర మంత్రిని బండి సంజయ్ కోరారు. తెలంగాణలో కొత్తగా 18 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అందులో హనుమకొండ జిల్లా ప్రస్తావన లేకపోవడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని వంగరలో, సిరిసిల్లలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు ట్వీట్ చేశారు. భేటీ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు.

 

ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్
కరీంనగర్ ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కరీంనగర్ టౌన్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ (Karimnagar Rural), మనకొండూర్, గంగాధర, రామడుగు, తిమ్మాపూర్, గన్నేరువరం, హుజూరాబాద్, వీనవంక, చొప్పదండి, ఎల్లందకుంట, శంకరపట్నం, చిగురుమామిడి,  సైదాపూర్, జమ్మికుంట మండలాల్లో పీఎం శ్రీ కింద పాఠశాలలను ఏర్పాటు చెయ్యాలని ధర్మేంద్ర ప్రదాన్ ను స్థానిక ఎంపీగా బండి సంజయ్ కోరారు.

ఈ స్కూళ్లకు నిధులు కేటాయించండి - బండి సంజయ్

పీఎం శ్రీ పథకం (PM SHRI School) కింద సిరిసిల్ల జిల్లాలో ఎంపిక చేసిన 16 పాఠశాలలు, కరీంనగర్ జిల్లాలో ఎంపిక చేసిన 24 ప్రభుత్వ పాఠశాలలో ప్రతి స్కూల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు మెరుగైన బోధన కోసం రూ.40 లక్షల చొప్పున నిధులు అందించాలని కోరారు. తాను చేసిన పలు అభ్యర్థనల పట్ల కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారని, తన వినతిపత్రంలోని అంశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బండి సంజయ్ వెల్లడించారు.

Also Read: KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
Kalvakuntla Kavitha: కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
CLP Meeting:  ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Player of the Match vs LSG | ఆరేళ్ల తర్వాత తొలిసారి IPL 2025 లో ధోని కి అవార్డ్PBKS vs KKR Match preview IPL 2025 | నేడు పంజాబ్ ను ఢీకొట్టనున్న కోల్ కతాRishabh Pant 63 vs CSK | IPL 2025 సీజన్ లో తొలిసారి టచ్ లోకి వచ్చిన రిషభ్ పంత్MS Dhoni Heroics vs LSG | IPL 2025 లో లక్నోపై విరుచుకుపడిన మహేంద్ర సింగ్ ధోనీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 2,260 టీచర్ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
Kalvakuntla Kavitha: కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
కేసీఆర్‌లా కాదు నేను కాస్త రౌడీ టైప్ - కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కల్వకుంట్ల కవిత
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
CLP Meeting:  ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
Andhra liquor scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - విజయసాయిరెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - విజయసాయిరెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు
Ravi Teja - Chakri: చక్రి కుటుంబానికి రాయల్టీ ఇచ్చిన రవితేజ నిర్మాతలు - ఎందుకో తెలుసా?
చక్రి కుటుంబానికి రాయల్టీ ఇచ్చిన రవితేజ నిర్మాతలు - ఎందుకో తెలుసా?
Sunstroke: వడగాల్పులకు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఆర్థికసాయం, జీవో జారీ
వడగాల్పులకు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఆర్థికసాయం, జీవో జారీ
Telangana News: 2030 నాటికి హైదరాబాద్‌లో 200 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్- మంత్రి శ్రీధర్ బాబు
2030 నాటికి హైదరాబాద్‌లో 200 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్- మంత్రి శ్రీధర్ బాబు
Embed widget