లేదు, బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కేసు తీవ్రత, ఆరోపణల స్వభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది.
Bandi Bhageerath: బండి భగీరథ్కు షాక్! ముందస్తు బెయిల్పై ఈ దశలో ఆర్డర్ ఇవ్వలేమన్న హైకోర్టు
Bandi Bhageerath: బండి భగీరథ్పై పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

- బండి భగీరథ్ పోక్సో కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో కొట్టివేత.
- బాధితురాలి ఫిర్యాదు, ఫోటోలు, చాటింగ్ ఆధారాలపై న్యాయవాది వాదనలు వినిపించారు.
- ఫిర్యాదు ఆలస్యం, బాధితురాలి ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తపరిచిన న్యాయవాది.
- కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.
Bandi Bhageerath: బండి భగీరథ్కు ముందుస్తు బెయిల్ విషయంలో షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు. తనపై నమోదైన పోక్సో కేసులో ఈ దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని హైకోర్టు పేర్కొంది. వచ్చే వారం ఈ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది. బండి భగీరథ్ తరుపున న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పలు వాదనలు వినిపించారు. పోక్సో కేసుకు కారణమైన బాధితురాలి ఫిర్యాదు, ప్రవర్తన , కాల్ రికార్డ్లు, చాటింగ్ వివరాలతోపాటు అనేక అంశాలను ప్రస్తావిస్తూ, తన క్లయింట్పై వచ్చిన ఆరోపణలపై అనుమానాలున్నాయని వాదించారు. భగీరథ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
భగీరథ్కు ముందస్తు బెయిల్ కోరుతూ వినిపించిన వాదనలు ఇవే..
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో 2025 డిసెంబర్ 31వ తేది నుంచి రెండు రోజుల పాటు తన కూతురుని మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఉంచారని, ఆమెతో బలవంతంగా మద్యం తాగించారని ఫిర్యాదులో ఆరోపణలు చేశారు. అయితే అదే ఫిర్యాదులో బాధితురాలు, నిందితుడితోపాటు మరో ఐదుగురితో కలసి అదే ఫామ్ హౌస్లో ఉన్నట్లు ఫిర్యాదులో బాధితురాలి తల్లి తెలిపినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఫామ్ హౌస్లో తీసుకున్న ఫొటోలు, వీడియోల గురించి కోర్టు ముందు ప్రస్తావించిన నిరంజన్ రెడ్డి, స్నేహితులు తీసిన ఫొటోలు చూస్తుంటే , బాధితురాలు ఎవరి బలవంతం లేకుండానే స్వచ్చందంగా మద్యం తీసుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. బాధితురాలిని కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని, కానీ తన క్లయింట్పై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై స్పష్టత ఇచ్చేందుకే ఈ విషయాలు ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే కోర్టుకు సమర్పించేందుకు తమ వద్ద అమ్మాయి స్నేహితులు తీసిన ఫొటోలు , వీడియోలు ఉన్నట్లు తెలిపారు.
అమ్మాయి కేసు ఆలస్యంగా ఎందుకు పెట్టింది..
బాధితురాలు ఫిర్యాదు ఆలస్యంగా ఎందుకు ఇచ్చిందనే అంశాన్ని సైతం ప్రధానంగా లేవనెత్తారు నిందితుడి తరపు న్యాయవాది. ఆమెపై బలవంతంగా దాడి జరిగిన ఘటన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నాలుగున్నర నెలలు సమయం ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నించారు నిందితుడి తరపు న్యాయవాది. నాలుగున్నర నెలలు ఆగి ఫిర్యాదు చేయడం వెనుక అనేక అనుమానాలున్నాయని కోర్టకు తెలిపారు. బాధితురాలు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలి తల్లి, విషయం తెలిసిన వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు భగీరథ్ తరపు న్యాయవాది.
Also Read: కేంద్రమంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు! అత్యవసర చికిత్స చేసి స్టంట్ వేసిన వైద్యులు!
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 2025 అక్టోబర్ 25వ తేదిన శారీరక వేధింపులు జరిగాయని పేర్కొన్నారని, కానీ ఆ తరువాత రోజే నిందితుడితో, బాధితురాలు నిందితుడిని సినిమాకు రావాలంటూ కోరుతూ టిక్కెట్లు పంపిందని కోర్టుకు తెలిపారు. నవంబర్ 12,13,14 తేదీలలో తన క్లయింట్తో బాధితురాలు 8 గంటలపైగా ఫోన్ మాట్లడిందని, నవంబర్ 14వ తేదీ గంటల తరబడి చాటింగ్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు నిరంజన్ రెడ్డి. నిజంగా లైంగిక వేధింపులు జరిగి ఉంటే ఇంత సన్నిహితంగా ఫోన్ సంభాషణలు, చాటింగ్ కొనసాగేవా అంటూ ప్రశ్నించారు.
Also Read:భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో అనుమానాలు ఉన్నప్పుడు నిందితులకు గతంలో అనేక కోర్టులు బెయిల్ మంజూరు చేసినట్లు తీర్పులున్నాయంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు నిరంజన్ రెడ్డి. నిందితుడి తరపు న్యాయవాది వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు, కేసు తీవ్రత, ఆరోపణల స్వభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు బండి భగీరథ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. కోర్టు తీర్పుతో పోక్సో కేసులో తదుపరి విచారణ కొనసాగనుంది. ఏ సమయంలోనైనా బండి భగీరథ్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.
Also Read:బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
Frequently Asked Questions
బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందా?
బండి భగీరథ్పై నమోదైన కేసు ఏంటి?
బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి?
బాధితురాలిని ఫామ్హౌస్లో ఉంచి బలవంతంగా మద్యం తాగించారని ఫిర్యాదులో ఆరోపణలు చేశారు. అయితే, బాధితురాలు తనంతట తానుగా మద్యం తీసుకున్నట్లు ఆధారాలున్నాయని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు.
బాధితురాలు ఫిర్యాదు ఆలస్యంగా చేయడంపై ఏమైనా అనుమానాలున్నాయా?
నిందితుడి తరపు న్యాయవాది, సంఘటన జరిగిన నాలుగున్నర నెలల తర్వాత ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిజంగా వేధింపులు జరిగితే అంత సన్నిహితంగా ఫోన్ సంభాషణలు, చాటింగ్ ఉండవని వాదించారు.
ట్రెండింగ్ వార్తలు






















