అన్వేషించండి

ఉఫ్ అంటే పోయే బూడిద వల్ల ఆ  గ్రామాలన్నీ ఆగమైతున్నాయ్!

ఫ్యాక్టరీ నుంచి వచ్చే బూడిద వల్ల ఆ గ్రామాలన్నీ కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయాయి. బూడిద కాలుష్యంతో తాము జీవించలేని మరోచోట పునరావాసం కల్పించాలని రెండున్నర దశాబ్దాలుగా గ్రామస్తులు ఉద్యమాలు చేపడుతున్నారు.

Air Pollution in Ramagundam: ఎప్పుడైనా మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక నిమిషంపాటు ఎక్కడైనా కాలుష్యపు పొగ గాని ఏదైనా ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుమ్ము ధూళి గాని కొద్దిసేపు వస్తేనే ఊపిరాడక విలవిల్లాడిపోతాం. కానీ 39 సంవత్సరాలుగా ఆ ఊర్లకు పక్కనే ఉన్న పరిశ్రమ వదిలే కాలుష్యాన్ని పీలుస్తూ ఆయుష్షును కోల్పోతున్నారు. ఇక గ్రామంలో నివసించలేమని మరోచోట పునరావాసం కల్పించాలని, అక్కడ నివసిస్తున్న ప్రజలు 100 రోజులపాటు పెద్ద ఎత్తున దీక్షలు ఆందోళనలు చేపట్టిన ఎవరు కనికరించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని కలిసి వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. రామగుండం ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం బూడిద చెరువుల కాలుష్యం నుంచి తమను కాపాడాలని అంతర్గామ్ మండలం భూ నిర్వాసితులు వేడుకుంటున్నారు. 

కరకట్టల ఎత్తు పెంచడంతో బూడిద నిల్వ పెరిగింది..

అటవీ ప్రాంతానికి ఆనుకొని రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో పచ్చని చెట్లు గుట్టల మధ్య రాజాపూర్, కుందనపల్లి గ్రామం ఉండేది. పవర్ ప్రాజెక్ట్ కోసం వేలాది ఎకరాల సాగు భూములను కోల్పోయారు. రాజాపూర్ గ్రామాన్ని వదిలేశారు. సేకరించిన భూముల్లో నాలుగు బూడిద చెరువులు ఏర్పాటు చేశారు. ఈ చెరువులు వారికి శాపంగా మారాయి.

భారీ ఎత్తున బూడిదను నిల్వ చేయడంతో నాలుగు దశాబ్దాల కాలంలో ఇక్కడి నేల, నీరు,గాలి విషతుల్యంగా మారాయి. చుట్టూ పది కిలోమీటర్ల దూరం వరకు పర్యావరణ కాలుష్యంగా మారింది. బూడిద చెరువుల్లో నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కొన్ని దశల్లో కరకట్టల ఎత్తు పెంచారు. దీంతో బూడిద నిల్వ పెరిగింది. గాలులకు బూడిద పైకి లేచి నివాస గృహాలను నింపేసేది. నిర్వాసితుల ఆందోళనతో చెరువులో ఏర్పాటు చేసి చర్యలు తీసుకున్నా, అవి తాత్కాలికంగానే మిగిలింది. శాశ్వత చర్యలు చేపట్టలేదు. 

1930 మంది వరకూ మృత్యువాత..

బూడిద కాలుష్యంతో తాము జీవించలేని మరోచోట పునరావాసం కల్పించాలని రెండున్నర దశాబ్దాలుగా గ్రామస్తులు ఉద్యమాలు చేపడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి స్థానిక, రాష్ట్ర కేంద్ర మంత్రుల కార్యాలయాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పరిశీలనలు, నివేదిక సమర్పణల వరకే పరిమితమయ్యారు. ఇక్కడి గ్రామ ప్రజలు 30 నుంచి 65 ఏళ్లలోపు వారే ఎక్కువగా మరణిస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు బూడిద కాలుష్యం బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్న వయసులోనే ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం రికార్డుల ప్రకారం 1930 మంది మరణించగా.. అందులో అనారోగ్యంతో మరణించిన వారు 160 మంది ఉండగా, అందులో 65ఏళ్లలోపు వారు 130 మంది ఉన్నారు. 

అయితే వారు ఉద్యమం తీవ్రతరం చేసినప్పుడు శాంతింప చేయడానికి వస్తున్న అధికారులు, నాయకులు తిరిగి మళ్లీ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, నాయకులు ఎవరికి తమ బాధను చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని గ్రామస్థులు వాపోతున్నారు. కనీసం పునరావాసం కోసం కంపెనీ యజమాన్యం దృష్టి సారించి సహాయం చేసినట్లయితే తమ బ్రతుకులు బాగుపడతాయని వారు కోరుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget