అన్వేషించండి

Rain Affect: మూగ జీవాల మృత్యువాత.. అల్లాడిపోతున్న అన్నదాతలు!

Rain Affect: వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా మంది అనేక రకాలుగా నష్టపోయారు. కొందరు ఇళ్లను, పంటను కోల్పోగా, మరికొందరేమో తమ జీవనానికి ఆధారమైన ఆవులను కోల్పోయి.. కన్నీరుమున్నీరవుతున్నారు.  

Rain Affect: గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువలు, కాలువలు, వాగులు, వంకలన్నీ పొంగు పొర్లుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. భారీగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక మంది రైతుల జీవితాలు ఆగం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునగ్గా, వందలాది పశువులు చనిపోయారు. అలాగే పదుల సంఖ్యల్లో గూళ్లను కోల్పోయారు పలువురు. 

110 గల్లంతు కాగా.. 35 మృతి

జిల్లాలోని వీర్నపల్లి మండలం మద్దిమల్ల వద్ద గల అటవీ ప్రాంతంలోకి... గత రెండు రోజుల క్రితం ఆవులు మేతకు వెళ్లాయి. సుమారు ఆరుగురుకి చెందిన ఈ 110 ఆవులు గల్లంతయ్యాయి. అయితే వర్షం ఎక్కువగా ఉండడంతో.. అన్నదాతలు ఇంట్లోని ఉండి ఆవుల గురించి కుమిలిపోయారు. నిన్న సాయంత్రం నుంచి కాస్త వర్షం తగ్గుముఖం పట్టడంతో పశువులను వెతికేందుకు వెళ్లారు. అంతా కలిసి వెతుకుతుండగా... ఒకే చోటు 35కు పైగా ఆవులు మృతి చెంది ఉండటం చూసి బావురుమన్నారు. ఇన్నాళ్లూ వాటి మీద ఆధారపడి బతికిన మా బతుకులు నాశనం అయిపోయాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 

ఆవులెలా చనిపోయాయో తెలియక..

అయితే కొన్ని ఆవులు కొన ప్రాణాలతో దొరకగా.. మరికొన్ని మిగతా వాటి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే కొన ప్రాణాలతో ఉన్న ఆవుల్లో చాలా వరకు చనిపోయేలాగా కనిపిస్తున్నాయని యజమానులు చెబుతున్నారు. చలి, వర్షం దెబ్బలకు తట్టుకోలేకే అవి ప్రాణాలు కోల్పోయాయా లేక కలుషిత నీరు తాగి చనిపోయాయో తెలియడం లేదు. కానీ కన్న బిడ్డల్లా సాకిన తమ పశువులు జీవచ్ఛవాళ్లా పడి ఉండడం చూసిన యజమానులు మాత్రం దుఃఖాన్ని దిగమింగుకోలేక పోతున్నారు. వర్షం కారణంగా జీవనోపాధి కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

నీటమునిగిన వేలాది ఎకరాల పంట 

ఇక మరోవైపు జిల్లా వ్యాప్తంగా వేలాది రైతులకు భారీ వర్షం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. కౌలుకు తీసుకొని ముందస్తు నాటిన రైతులు ఈ సారి మొదట్లోనే లక్షలు నష్టపోయారు. తొలకరి జల్లు సంబరాలు జరుపుకోవాలని అనుకున్న రైతులకు వరుణదేవుడు పట్టు పట్టినట్టుగా వారం రోజుల పాటు వర్షాలు కురవడంతో  పొలాలన్నీ  నామ రూపాలు లేకుండా ధ్వంసం అయ్యాయి. నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు  వేల ఎకరాల్లో పంట  వర్షానికి నీట మునిగింది. 

జగిత్యాల సిరిసిల్ల లో ఈ బెడద ఎక్కువగా ఉంది పెద్దపల్లి జిల్లా లోని 126 గ్రామాల పరిధిలో పొలాలు నీటితో తడిసిపోయాయి. 659 ఎకరాల్లో ఇటీవలే నాట్లు వేయడంతో అవి కొట్టుకుపోయాయి. 4704 ఎకరాల్లో వేసిన పత్తి పంట పూర్తిగా నాశనమైంది .  కేవలం కొత్త కరీంనగర్ జిల్లాలో ఆరు వేల ఎకరాల వరకు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు అధికారులు. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది . జగిత్యాల జిల్లాలోని 22972 ఎకరాల్లో నష్టం ఉండొచ్చని అధికారులు అంచనా...ఇప్పటికే ముందస్తు తొలకరి ఆశలతో సంతోషపడి వ్యవసాయం మొదలుపెట్టిన రైతులకు ఈసారి కన్నీరే మిగిలింది.

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget