అన్వేషించండి

Rain Affect: మూగ జీవాల మృత్యువాత.. అల్లాడిపోతున్న అన్నదాతలు!

Rain Affect: వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా మంది అనేక రకాలుగా నష్టపోయారు. కొందరు ఇళ్లను, పంటను కోల్పోగా, మరికొందరేమో తమ జీవనానికి ఆధారమైన ఆవులను కోల్పోయి.. కన్నీరుమున్నీరవుతున్నారు.  

Rain Affect: గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువలు, కాలువలు, వాగులు, వంకలన్నీ పొంగు పొర్లుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. భారీగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక మంది రైతుల జీవితాలు ఆగం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునగ్గా, వందలాది పశువులు చనిపోయారు. అలాగే పదుల సంఖ్యల్లో గూళ్లను కోల్పోయారు పలువురు. 

110 గల్లంతు కాగా.. 35 మృతి

జిల్లాలోని వీర్నపల్లి మండలం మద్దిమల్ల వద్ద గల అటవీ ప్రాంతంలోకి... గత రెండు రోజుల క్రితం ఆవులు మేతకు వెళ్లాయి. సుమారు ఆరుగురుకి చెందిన ఈ 110 ఆవులు గల్లంతయ్యాయి. అయితే వర్షం ఎక్కువగా ఉండడంతో.. అన్నదాతలు ఇంట్లోని ఉండి ఆవుల గురించి కుమిలిపోయారు. నిన్న సాయంత్రం నుంచి కాస్త వర్షం తగ్గుముఖం పట్టడంతో పశువులను వెతికేందుకు వెళ్లారు. అంతా కలిసి వెతుకుతుండగా... ఒకే చోటు 35కు పైగా ఆవులు మృతి చెంది ఉండటం చూసి బావురుమన్నారు. ఇన్నాళ్లూ వాటి మీద ఆధారపడి బతికిన మా బతుకులు నాశనం అయిపోయాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 

ఆవులెలా చనిపోయాయో తెలియక..

అయితే కొన్ని ఆవులు కొన ప్రాణాలతో దొరకగా.. మరికొన్ని మిగతా వాటి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే కొన ప్రాణాలతో ఉన్న ఆవుల్లో చాలా వరకు చనిపోయేలాగా కనిపిస్తున్నాయని యజమానులు చెబుతున్నారు. చలి, వర్షం దెబ్బలకు తట్టుకోలేకే అవి ప్రాణాలు కోల్పోయాయా లేక కలుషిత నీరు తాగి చనిపోయాయో తెలియడం లేదు. కానీ కన్న బిడ్డల్లా సాకిన తమ పశువులు జీవచ్ఛవాళ్లా పడి ఉండడం చూసిన యజమానులు మాత్రం దుఃఖాన్ని దిగమింగుకోలేక పోతున్నారు. వర్షం కారణంగా జీవనోపాధి కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

నీటమునిగిన వేలాది ఎకరాల పంట 

ఇక మరోవైపు జిల్లా వ్యాప్తంగా వేలాది రైతులకు భారీ వర్షం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. కౌలుకు తీసుకొని ముందస్తు నాటిన రైతులు ఈ సారి మొదట్లోనే లక్షలు నష్టపోయారు. తొలకరి జల్లు సంబరాలు జరుపుకోవాలని అనుకున్న రైతులకు వరుణదేవుడు పట్టు పట్టినట్టుగా వారం రోజుల పాటు వర్షాలు కురవడంతో  పొలాలన్నీ  నామ రూపాలు లేకుండా ధ్వంసం అయ్యాయి. నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు  వేల ఎకరాల్లో పంట  వర్షానికి నీట మునిగింది. 

జగిత్యాల సిరిసిల్ల లో ఈ బెడద ఎక్కువగా ఉంది పెద్దపల్లి జిల్లా లోని 126 గ్రామాల పరిధిలో పొలాలు నీటితో తడిసిపోయాయి. 659 ఎకరాల్లో ఇటీవలే నాట్లు వేయడంతో అవి కొట్టుకుపోయాయి. 4704 ఎకరాల్లో వేసిన పత్తి పంట పూర్తిగా నాశనమైంది .  కేవలం కొత్త కరీంనగర్ జిల్లాలో ఆరు వేల ఎకరాల వరకు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు అధికారులు. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది . జగిత్యాల జిల్లాలోని 22972 ఎకరాల్లో నష్టం ఉండొచ్చని అధికారులు అంచనా...ఇప్పటికే ముందస్తు తొలకరి ఆశలతో సంతోషపడి వ్యవసాయం మొదలుపెట్టిన రైతులకు ఈసారి కన్నీరే మిగిలింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Embed widget