Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్ను ప్రభుత్వానికి అప్పగించాలని కవిత డిమాండ్ చేశారు. బీజేపీ .. పవన్ కల్యాణ్ను అడ్డం పెట్టుకుని కొన్ని ఓట్లు సాధించాలని అనుకుంటోందన్నారు.

Telangana Rakshana Sena Kavitha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని జన్వాడ ప్రాంతంలో ఉన్న కోడి చెరువు కబ్జా ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆమె పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జూబ్లీహిల్స్లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. పవన్ గతంలో చేసిన సవాల్ను గుర్తు చేస్తూ భూముల్ని తిరిగి ఇవ్వాలన్నారు.
పవన్ కల్యాణ్ తాను చెరువును ఆక్రమించలేదని, ఒకవేళ అది గనుక రుజువైతే వెంటనే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తానని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారిక రికార్డులను పరిశీలిస్తే అది స్పష్టంగా చెరువు శిఖం భూమి అని తేలిపోయింది అని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ కల్యాణ్ వెంటనే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, అక్కడ అక్రమంగా వేసిన కంటైనర్లు, మట్టిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా నడుస్తోంది. హైదరాబాద్లోని జన్వాడ సమీపంలో ఉన్న కోడి చెరువు స్థలాన్ని ఆక్రమించి పవన్ కల్యాణ్ ఫామ్హౌస్ నిర్మించారంటూ విపక్షాలు, పలు సామాజిక సంఘాలు గ్రౌండ్ రిపోర్టులతో సహా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టిగా ఖండించారు. తాను ఎలాంటి చెరువు స్థలాన్ని కబ్జా చేయలేదని స్పష్టం చేసిన ఆయన, నిబంధనల ప్రకారమే తన భూమి ఉందని తన ఇంటి వద్ద పెట్టిన ప్రెస్మీట్లో వివరణ ఇచ్చారు.అదికబ్జా అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తాన్నారు.
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) June 6, 2026
🔹రూ.లక్ష కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం బడాబాబులకు కట్టబెడుతోంది
🔹సీఎం సోదరులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బందిపోట్ల మాదిరిగా… pic.twitter.com/pRyu9gMJGb
తెలంగాణ ఎవరిదో ఒకరి తాతల, ముత్తాతల జాగీరు కాదు. ఇది బరాబర్ తెలంగాణ ప్రజల జాగీరు. 1,200 మంది అమరవీరుల త్యాగాలు, కోట్ల మంది కడుపు కట్టుకుని చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సిద్ధించిన గడ్డ ఇది అని కవిత స్పష్టం చేశారు. స్థానిక వనరులను, అస్థిత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొన్ని శక్తులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేయవచ్చు కానీ, దానికి కనీస నైతికత ఉండాలని, గతంలో తెలంగాణ వనరులను దోచుకున్న వారే ఇప్పుడు మళ్లీ ఇక్కడి సెంటిమెంట్ను వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో గత మరియు ప్రస్తుత పాలనను పోలుస్తూ ‘కేటీఆర్’ అనే మూడక్షరాలపై కవిత ఆసక్తికరమైన పొలిటికల్ పంచ్ వేశారు. "నాడు, నేడు.. ఎప్పుడైనా కేటీఆర్ పాలనే నడుస్తోంది" అని వ్యాఖ్యానించారు. అయితే దీనికి ఆమె ఇచ్చిన వివరణ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నాడు 'కేటీఆర్' అంటే.. కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు అని, నేడు 'కేటీఆర్' అంటే.. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని ఆమె చెప్పుకొచ్చారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ ముగ్గురు నేతలు రాత్రింబగళ్లు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేశారని కవిత గుర్తుచేశారు. కానీ నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, పాలనను పూర్తిగా కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టి నడిపిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్, బీజేపీలు కలిసి లోపాయికారీగా వ్యవహరిస్తున్నాయని ఆమె ఆరోపించారు.
బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయిలో సొంతంగా బలమైన నాయకత్వం లేదని, కేవలం కొన్ని ఓట్ల కోసం పరాయి శక్తులపై ఆధారపడుతోందని కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజం మరియు ఇక్కడి కళలను కేవలం తమ వ్యాపారాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారే తప్ప, ఈ ప్రాంతంపై ఎవరికీ నిజమైన ప్రేమ లేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ మరింత ఉధృతంగా పోరాడుతుందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తామని కవిత స్పష్టం చేశారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















