అన్వేషించండి

Kaleshwaram Project: ఆరోపణల సుడిగుండంలో కాళేశ్వరం ప్రాజెక్టు- కేసీఆర్, హరీశ్, ఈటల పాత్రపై విచారణ

Telangana News | మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, పంపుహౌస్‌లు మునిగిపోవడం వంటి సంఘటనలు ప్రాజెక్టు డిజైన్‌లో, నిర్మాణంలో తీవ్రమైన లోపాలను ఎత్తిచూపుతోంది.

KCR To attend Kaleshwaram Enquiry Commission | తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనమని చాలామంది భావిస్తారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అవినీతి, నాణ్యతా లోపాలకు నిలయంగా ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి అని గులాబీ నేతలు (BRS) అంటుంటే, ఇది మొత్తం అవినీతిమయం అని హస్తం నేతలు (Congress) విమర్శిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) కుంగిపోవడంతో, ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలున్నాయని, డిజైన్‌లో తప్పులున్నాయని, అంచనాలు పెంచేశారని, భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం మార్చి 2024లో ఒక జుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిషన్‌గా ఏర్పాటు చేయబడిన దీనికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ అధిపతిగా వ్యవహరిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాన ఆరోపణలు

  • మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, పంపుహౌస్‌లు మునిగిపోవడం వంటి సంఘటనలు ప్రాజెక్టు డిజైన్‌లో, నిర్మాణంలో తీవ్రమైన లోపాలను ఎత్తిచూపుతున్నాయి.
  • ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రారంభంలో వేల కోట్ల రూపాయలు ఉండగా, అది లక్ష కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఇందులో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి.
  • నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలుఉన్నాయని, తక్కువ నాణ్యత కలిగిన సామగ్రిని ఉపయోగించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
  • ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఇందులో ముఖ్య నేతలకు లబ్ధి చేకూరిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ పాత్రపై విచారణ

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఆయనే స్వయంగా ఈ ప్రాజెక్టును ఒక ఇంజినీర్‌గా రూపొందించారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం సహా అన్ని విషయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించారన్నది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావన. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అంచనాల పెంపు, నిధుల్లో అవినీతి వంటి వాటిపై విచారణ జరిపేందుకు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.

జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని మొదట నోటీసుల్లో పేర్కొంది. అయితే, కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కమిషన్ విచారణ తేదీని జూన్ 11కు మార్చింది. ప్రాజెక్టు రూపకల్పన దశ నుండి ప్రాజెక్టు ప్రారంభం వరకు జరిగిన అన్ని అంశాలపై కేసీఆర్‌ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్ణయాలు, పర్యవేక్షణ వంటి అంశాల్లో ఆయన పాత్రపై ఆరా తీయనుంది.

మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు

తెలంగాణ ఏర్పడిన తొలి ప్రభుత్వంలో హరీశ్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ పనుల పర్యవేక్షణ, అంచనాల పెంపు, పర్యవేక్షణ లోపాలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వెనుక గల కారణాలు, నిధుల్లో అవకతవకల ఆరోపణలు వంటి అంశాలపై కాళేశ్వరం కమిషన్ విచారణ జరపనుంది. జూన్ 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు అమలులో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర, ఆయన నిర్ణయాలు, బాధ్యతలపై కమిషన్ దృష్టి సారించనుంది.

నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాత్రపై విచారణ

కేసీఆర్ తొలి కేబినెట్‌లో ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, వ్యయ అంచనాలు, ఆర్థిక శాఖ అనుమతుల జారీ, నిధుల పంపిణీ, బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక అవకతవకలపై ఆరోపణలు వంటి అంశాలపై విచారణకు ఈటల రాజేందర్‌ను కమిషన్ ప్రశ్నించనుంది. జూన్ 6వ తేదీన విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ విచారణ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరు కావాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
Diwali In UNESCO Intangible Cultural Heritage List : దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
MNREGA Job Cards: MNREGA జాబితా నుంచి 16 లక్షల పేర్లు తొలగింపు! మీ పేరు ఉందో లేదో చూసుకోండి!
MNREGA జాబితా నుంచి 16 లక్షల పేర్లు తొలగింపు! మీ పేరు ఉందో లేదో చూసుకోండి!

వీడియోలు

India vs South Africa T20 Records | మొదటి టీ20లో ఐదు పెద్ద రికార్డులు బ్రేక్‌!
Hardik Record Sixes Against South Africa | హార్దిక్ పాండ్యా సిక్సర్‌ల రికార్డు
Sanju Samson Snubbed For Jitesh Sharma | ఓపెనింగ్ పెయిర్ విషయంలో గంభీర్‌పై విమర్శలు
Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్
Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
Diwali In UNESCO Intangible Cultural Heritage List : దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
MNREGA Job Cards: MNREGA జాబితా నుంచి 16 లక్షల పేర్లు తొలగింపు! మీ పేరు ఉందో లేదో చూసుకోండి!
MNREGA జాబితా నుంచి 16 లక్షల పేర్లు తొలగింపు! మీ పేరు ఉందో లేదో చూసుకోండి!
Pilot Recruitment India: దేశీయ విమానయాన సంస్థల్లో ఎంతమంది పైలట్లు ఉన్నారు? ఇప్పుడు విదేశీ పైలట్లు భారతదేశంలో ఉద్యోగం ఎలా పొందవచ్చు?
దేశీయ విమానయాన సంస్థల్లో ఎంతమంది పైలట్లు ఉన్నారు? ఇప్పుడు విదేశీ పైలట్లు భారతదేశంలో ఉద్యోగం ఎలా పొందవచ్చు?
Amazon: ఇండియాలో అమెజాన్ ఉద్యోగాల విప్లవం -ఐదేళ్లలో పది లక్షల మందికి జాబ్స్ !
ఇండియాలో అమెజాన్ ఉద్యోగాల విప్లవం -ఐదేళ్లలో పది లక్షల మందికి జాబ్స్ !
Delhi Customs: నోట్ బుక్ తీసుకెళ్తున్నాడని ఎయిర్ పోర్టులో అరెస్ట్ - దానికే అరెస్టు చేస్తారా?.. అక్కడే అసలు ట్విస్ట్
నోట్ బుక్ తీసుకెళ్తున్నాడని ఎయిర్ పోర్టులో అరెస్ట్ - దానికే అరెస్టు చేస్తారా?.. అక్కడే అసలు ట్విస్ట్
Harish Rao On Telangana Rising Global Summit: రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
Embed widget