అన్వేషించండి

BJP in Telangana : తెలంగాణలో ఇక బీజేపీనే ప్రతిపక్షమా ? బీఆర్ఎస్ నేతల్ని కాపాడుకోగలదా ?

Telangana Politics : ఇక తెలంగాణలో ప్రతిపక్షం బీజేపీనేనా ? పార్టీ నేతలు, క్యాడర్ ను బీఆర్ఎస్ కాపాడుకోగలదా ? . కాంగ్రెస్ ప్రజా విశ్వాాసాన్ని కోల్పోయిందని కిషన్ రెడ్డి అనడం వెనుక వ్యూహం ఉందా ?

Is BJP the opposition in Telangana :  పార్లమెంట్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు బీజేపీ మంచి విజయాలు నమోదు చేసింది.  కాంగ్రెస్ తో పోటీగా ఎనిమిది సీట్లలో విజయం సాధించింది.  బీజేపీ అనుకున్న ఫలితాలను సాధించింది. అధికార కాంగ్రెస్ కూడా ఎనిమిది స్థానాలను సాధించింది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఎంపీ స్థానాల్లో ఉనికిని కోల్పోయింది. ఒక్కరంటే ఒక్కరూ విజయం సాధించలేదు. వచ్చే కొద్ది నెలల్లోనే బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా మారే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. 

 

 

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే చాన్స్ 

ప్రస్తుతం ఉన్న పాజిటివిటీని కాపాడుకుంటే.. బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయవర్గాలంటున్నాయి.  బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు ఆరేడు నెలల ముందు కూడా అత్యంత బలంగా ఉంది. కాంగ్రెస్ బలహీనంగా ఉంది. పోటీ  బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే జరుగుతుందన్న అభిప్రాయం కూడా వినిపించింది. అయితే  బీజేపీ పెద్దలు తీసుకున్న కొన్ని అనూహ్య నిర్ణయాల వల్ల బీజేపీ వెనుకబడిపోయింది. కాంగ్రెస్ ఒక్క సారిగా ముందుకు వచ్చింది., బండి సంజయ్ ను మార్చేయడం.. కవితను ఎన్నికలకు ముందు అరెస్టు చేయకపోవడం వంటివి దెబ్బతీశాయని  బీజేపీ  నేతలు భావిస్తూ ఉంటారు. 

అసెంబ్లీ కంటే పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకున్న  బీజేపీ 

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. ఎనిమిది స్థానాల్లో గెలిచింది.  పదహారు శాతానికిపైగా ఓటు బ్యాంక్ సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో  అధికార కాంగ్రెస్ తో పోటీ పడి ఓటు బ్యాంక్ తెచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీకి  నలభై శాతం ఓట్లను సాధిస్తే బీజేపీ 36 శాతం ఓట్లను సాధించింది. అందుకే ప్రజాతీర్పును గౌరవించి అసలైన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా మారాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది.  ప్రస్తుతం జరిగింది లోక్ సభ ఎన్నికలు కాబట్టి..జాతీయ స్థాయి అంశాలు, మోడీ హవా కీలకంగా మారాయని.. అదే అసెంబ్లీ స్థానాలకు వచ్చే సరికి సీన్ మారిపోతుందని ...  చెబుతున్నారు.  అందుకే..అసెంబ్లీకి కూడా బీజేపీ కేపబుల్ అనిపించేలా పార్టీని తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు.

చేరికల్ని ప్రోత్సహిస్తారా ? 

భారతీయ జనతాపార్టీ క్రమంగా బలపడుతోంది. రాష్ట్ర విభజన తరవాత జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఐదు చోట్ల గెలిచింది.తర్వాత టీడీపీ పూర్తిగా బలహీనపడింది. బీజేపీ మాత్రం బలపడుతూ వస్తోంది. ఇప్పుడుటీడీపీ అసలు లేదు. బీజేపీ మేజర్ ప్లేయర్ గా ఎదిగింది. బండి సంజయ్ చీఫ్ గా ఉన్నప్పుడు పార్టీకి జవసత్వాలు వచ్చాయి. ఇప్పుడు మరింతగా  మెరుగైన ఫలితాలు సాధించారు. ముందు ముందు తెలంగాణలో బీజేపీ జోరును అడ్డుకోవడం ఇతర పార్టీలకు అంత తేలిక కాదు. ఈ వివిషయంపై అవగాహన ఉండబట్టే రాజకీయ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించేం అవకాశం ఉంది. ముందు మందు చేరికల్ని ప్రోత్సహిస్తే మరింత బలపడే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR On Delhi Liquor Scam: కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
Kavitha Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Telangana Rajya Sabha Elections: రాజ్యసభ బరిలో గులాబీ వ్యూహం - మైనార్టీ అస్త్రంతో చెక్ - కాంగ్రెస్ సమాధానమేంటి?
రాజ్యసభ బరిలో గులాబీ వ్యూహం - మైనార్టీ అస్త్రంతో చెక్ - కాంగ్రెస్ సమాధానమేంటి?

వీడియోలు

Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
Sanju Samson India vs Zimbabwe T20 World Cup | సంజూ శాంసన్ అదిరిపోయే కంబ్యాక్
South Africa vs West Indies T20 World Cup | వెస్టిండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On Delhi Liquor Scam: కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
OPS Joins DMK: తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన ఓపీఎస్, అరుదైన నేతగా పన్నీర్ సెల్వం
తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన ఓపీఎస్, అరుదైన నేతగా పన్నీర్ సెల్వం
Kavitha Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
ETV Win Jathara 2026 : 'ఈటీవీ విన్' ఎంటర్టైన్మెంట్ జాతర - 14 బిగ్ ప్రాజెక్ట్స్‌తో బిగ్ అనౌన్స్‌మెంట్
'ఈటీవీ విన్' ఎంటర్టైన్మెంట్ జాతర - 14 బిగ్ ప్రాజెక్ట్స్‌తో బిగ్ అనౌన్స్‌మెంట్
కేవలం రూ.7.5 లక్షల నుంచే ఎలక్ట్రిక్‌ కార్లు - మీ ఊర్లో దర్జాగా తిరగడానికి చవకైన EVలు!
తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్‌ కారు కావాలా? తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకే దొరుకుతున్న 5 బెస్ట్ కార్లు
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట.. క్లీన్ చిట్ రాగానే మాజీ సీఎం కన్నీళ్లు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట.. క్లీన్ చిట్ రాగానే మాజీ సీఎం కన్నీళ్లు!
Kolkata Earthquake: కోల్‌కతాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5 గా నమోదు.. బంగ్లాదేశ్‌లోనూ ప్రకంపనలు
కోల్‌కతాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5 గా నమోదు.. బంగ్లాదేశ్‌లోనూ ప్రకంపనలు
Embed widget