అన్వేషించండి

Venkaiah Naidu: సర్దార్ పటేల్ ని అంతా ఆదర్శంగా తీసుకోవాలి - వెంకయ్య నాయుడు

Venkaiah Naidu: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. గన్ పార్కులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం నివాళులర్పించారు.

Venkaiah Naidu: నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. కేవలం టీఆర్ఎస్ యే కాకుండా మిగతా పార్టీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రాహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. పూల మాల వేసి మరీ దండం పెట్టుకున్నారు. హైదరాబాద్ సంస్థాణం స్వాతంత్రంగా ఉండాలని ఉక్కు మనిషి సర్దార్ పటేల్ నిర్ణయం తీసుకొని ముందుకెళ్లారని గుర్తు చేశారు. ఈరోజు చారిత్రాత్మకమైన రోజు అని వ్యాఖ్యానించారు. తెలంగాణా ప్రాంతంలో రజాకారుల చర్యలకు సర్దార్ పటేల్ అడ్డుకట్ట వేశారని చెప్పుకొచ్చారు. భారత దేశంలో సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ సంస్థానం విలీనం అయిందన్నారు. దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ కి స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. 

అందరూ సర్దార్ పటేల్ ను ఆదర్శంగా తీస్కోవాలి..

నిజాం హైదరాబాద్ ను పాకిస్తాన్ లో కలపాలని చూశారని.. కానీ సర్దార్ పటేల్ దానికి ఏమాత్రం ఒప్పుకోకుండా నిరసనకు దిగారని వెంకయ్య నాయుడు వివరించారు. సర్ధార్ అఖండ దేశ భక్తుడని, దేశ సమైఖ్యతకు బలమైన నిర్ణయాలు తీసుకొన్నారని ప్రశంసించారు. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదని సూచించారు. కుల మతాలకు వ్యతిరేకంగా దేశ సమైఖ్యతను ముందుకు తీసుకెళ్లాలన్నారు. సర్ధార్ పటేల్ ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వివరించారు.

ఏడాది పాటు విమోచన దినోత్సవ వేడుకల నిర్వహణ..

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ జవాన్లు కవాతు నిర్వహిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో భాగంగానే అమరవీరుల స్ఱూపం వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పిస్తారని తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ వరకు విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విముక్తి దివాస్ పేరుతో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో వేడుకలు జరుగుతాయని వివరించారు. విమోచన దినోత్సవ వేడుకల కోసం 25 సంవత్సరాలు బీజేపీ పోరాడిందని తెలిపారు. కానీ అప్పటి ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలంగాణ విమోచన వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. అది తమ అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామగ్రామాన జాతీయ జెండా ఎగురవేయాలి..!

తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఉన్న బురుజుల పైన జెండా ఎగుర వేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని గ్రామాల సర్పంచ్ లకు లేఖలు రాశామని తెలిపారు. రేపు సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు వస్తారని సమాచారం. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపించామని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం పంపించామని స్పష్టం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget