అన్వేషించండి

Venkaiah Naidu: సర్దార్ పటేల్ ని అంతా ఆదర్శంగా తీసుకోవాలి - వెంకయ్య నాయుడు

Venkaiah Naidu: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. గన్ పార్కులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం నివాళులర్పించారు.

Venkaiah Naidu: నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. కేవలం టీఆర్ఎస్ యే కాకుండా మిగతా పార్టీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రాహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. పూల మాల వేసి మరీ దండం పెట్టుకున్నారు. హైదరాబాద్ సంస్థాణం స్వాతంత్రంగా ఉండాలని ఉక్కు మనిషి సర్దార్ పటేల్ నిర్ణయం తీసుకొని ముందుకెళ్లారని గుర్తు చేశారు. ఈరోజు చారిత్రాత్మకమైన రోజు అని వ్యాఖ్యానించారు. తెలంగాణా ప్రాంతంలో రజాకారుల చర్యలకు సర్దార్ పటేల్ అడ్డుకట్ట వేశారని చెప్పుకొచ్చారు. భారత దేశంలో సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ సంస్థానం విలీనం అయిందన్నారు. దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ కి స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. 

అందరూ సర్దార్ పటేల్ ను ఆదర్శంగా తీస్కోవాలి..

నిజాం హైదరాబాద్ ను పాకిస్తాన్ లో కలపాలని చూశారని.. కానీ సర్దార్ పటేల్ దానికి ఏమాత్రం ఒప్పుకోకుండా నిరసనకు దిగారని వెంకయ్య నాయుడు వివరించారు. సర్ధార్ అఖండ దేశ భక్తుడని, దేశ సమైఖ్యతకు బలమైన నిర్ణయాలు తీసుకొన్నారని ప్రశంసించారు. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదని సూచించారు. కుల మతాలకు వ్యతిరేకంగా దేశ సమైఖ్యతను ముందుకు తీసుకెళ్లాలన్నారు. సర్ధార్ పటేల్ ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వివరించారు.

ఏడాది పాటు విమోచన దినోత్సవ వేడుకల నిర్వహణ..

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ జవాన్లు కవాతు నిర్వహిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో భాగంగానే అమరవీరుల స్ఱూపం వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పిస్తారని తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ వరకు విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విముక్తి దివాస్ పేరుతో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో వేడుకలు జరుగుతాయని వివరించారు. విమోచన దినోత్సవ వేడుకల కోసం 25 సంవత్సరాలు బీజేపీ పోరాడిందని తెలిపారు. కానీ అప్పటి ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలంగాణ విమోచన వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. అది తమ అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామగ్రామాన జాతీయ జెండా ఎగురవేయాలి..!

తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఉన్న బురుజుల పైన జెండా ఎగుర వేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని గ్రామాల సర్పంచ్ లకు లేఖలు రాశామని తెలిపారు. రేపు సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు వస్తారని సమాచారం. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపించామని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం పంపించామని స్పష్టం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Congress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Embed widget