అన్వేషించండి

Vande Bharat Express: హైదరాబాద్ కు రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుంచి ఎటు వెళ్తుందో మరి !

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు హైదరాబాద్ కు రావడం దాదాపుగా ఖరారైంది. ఈ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ఏ మార్గంలో నడిపించాలనే విషయంపై కసరత్తు చేస్తోంది. 

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వందే భారత్ (ట్రైన్ - 18) ఎక్స్ ప్రెస్ తెలంగాణకు రావడం దాదాపుగా ఖరారైంది. దక్షిణ మధ్య రైల్వేకు తొలి రైలును రైల్వే బోర్డు కేటాయించినట్లు ఇక్కడి అధికారులకు సమాచారం వచ్చింది. ఈ ఎక్స్ ప్రెస్ ను సికింద్రాబాద్ నుంచి ఏ మార్గంలో డిపించాలనే విషయంపై రైల్వే బోర్డు కసరత్తు చేస్తోంది. అత్యంత ఆధునిక, వేగవంతమైన రైలు అయినప్పటికీ ప్రస్తుతానికి ఇందులో బెర్తులు లేవు. శతాబ్ది ఎక్స్ ప్రెస్ మాదిరిగా కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ దూరం, రాత్రంతా ప్రయాణం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గరిష్ఠంగా 10 గంటల్లోనే చేరే గమ్యస్థానాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఉదయమే బయలు దేరి సాయంత్రానికి లేదా రాత్రి 9, 10 గంటల్లోపు గమ్య స్థానం చేరేలా కసరత్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖపపట్నం, బెంగళూరు, ముంబయి వంటి మార్గాల్ని పరిశీలిస్తున్నారు. 

విశాఖ, బెంగళూరు, తిరుపతికే ఎక్కువ డిమాండ్..

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రైలు రిజర్వేషన్ కు ఎక్కవ డిమాండ్ ఉంటుంది. విశాఖ వైపు నిత్యం దాదాపు డజను రైళ్లున్నా అంత సులభంగా రిజర్వేషన్ దొరకదు. తిరుపతి వెళ్లే వారయితే నెల రోజుల ముందే రిజర్వేషన్ చేయించుకుంటారు. బెంగళూరుకు రైలు కంటే బస్సుల్లోనే రెండు గంటల ముందే చేరుకుంటుండటంతో బస్సు ప్రయాణానికి ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారయ్యే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లకు గరిష్ఠంగా 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఇవి ఇప్పటి వరకు నాలుగు పట్టాలు ఎక్కాయి. అయిదోది మైసూర్ - బెంగళూరు - చెన్నై రైలు ఈ నెల 10వ పట్టాలు ఎక్కనుంది. దక్షిణ భారతానికి ఇదే తొలి రైలు. 

వందేభారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులోకి రాబోతుందని సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ ఎక్స్ ప్రెస్ నిర్వహణకు అయిదారు గంటల సమయం పడుతుందని, ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందో ఇంకా స్పష్టత రాలేదన్నారు. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తమకు సమాచారం వచ్చిందన్నారు. త్వరలోనే రూట్ వివరాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. 

సికింద్రాబాద్ నుంచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ మొదలవుతుందని ఓ అధికారి తెలిపారు. రైల్వే బోర్డు అధికారులు సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశ పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రం నుంచి బయలు దేరేలా వందే భఆరత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ ను కలిసి కోరారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి లేదంటే విశాఖపట్నానికి నడపాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయా రూట్లలో డిమాండ్, సాంకేతికత వంటి అంశాల గురించి ఆరా తీస్తోంది. మరోవైపు మహిళా ప్రయాణికుల కోసం సుదూరం ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఆరు వరకు బెర్తులు రిజర్వ్ చేయాలని రైల్వే శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget