By: ABP Desam | Updated at : 13 Feb 2023 12:45 PM (IST)
మీడియాతో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున (ఫిబ్రవరి 12) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీపైన చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దేశ ఆర్థిక స్థితిగతులు, ప్రధాని మోదీ పని తీరు తదితర అంశాలపై వివిధ లెక్కలతో సహా ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో వివరించారు. ఆ వివరాలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరిన సంగతి తెలిసిందే. దానిపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ చర్చను ప్రెస్ క్లబ్ లో పెడతావా, అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరు స్తూపం వద్ద పెట్టుకుందామా? ప్రగతి భవన్ లేదా ఫాంహౌజ్ లో పెడతావా అంటూ సవాలు విసిరారు. వచ్చేటప్పుడు రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని తీసుకురావాలని అన్నారు. అయినా, ఎన్నికల తర్వాత ఎలాగూ రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నారు.
2014లో తెలంగాణ అప్పు రూ.60 వేల కోట్లుగా ఉందని, ఇప్పుడు ఏకంగా రూ.5 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. అసెంబ్లీలో అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణలు చేసిన సీఎం కేసీఆర్.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి మాత్రం మాట్లాడలేదని అన్నారు.
Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి
MCH Hospital Erramanzil: ఎర్రమంజిల్ లో ఎంసీహెచ్ ఆస్పత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన
YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత
హైదరాబాద్ మెట్రో విస్తరణ లాభసాటి కాదన్న కేంద్రం యూపీలోని 10 నగరాల్లో నిర్మిస్తోంది: కేటీఆర్
Playground Under flyover: ఫ్లైఓవర్ల కింద ఆట స్థలాలు - ఆలోచన అదిరిపోయిందంటూ మంత్రి కేటీఆర్ ట్వట్
PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్ 30 వరకు ఛాన్స్
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్