అన్వేషించండి

Asaduddin Owaisi: ఒవైసీకి Z కేటగిరీ భద్రత.. కేంద్రం నిర్ణయం, పాతబస్తీలో అలర్ట్.. పటిష్ఠ బందోబస్తు

ఓవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓవైసీకి జెడ్​కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.

ఏఐఎంఐఎం నేత, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీకి జెడ్ ​కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన కారుపై గురువారం రోజు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్‌ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. హపూర్‌- ఘజియాబాద్‌ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కేసులో నిన్ననే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు యూపీ ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. 

నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఓ మతానికి వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, అందుకే ఓవైసీపై కాల్పులు జరిపినట్లు చెప్పారని పోలీసులు అన్నారు. నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. నిందితుల్లో ఒకరైన సచిన్‌ పండిట్‌ బీజేపీలో క్రియాశీలక కార్యకర్త అని.. పార్టీ సభ్యత్వానికి సంబంధిన రిసిప్ట్‌ను సచిన్‌ సోషల్‌ మీడియాలో ఉంచారని అన్నారు. అందులో దేశ్‌ భక్త్‌ సచిన్‌ హిందూ అని తన పేరును పేర్కొన్నాడు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, ఎంపీ మహేశ్‌ శర్మలతో నిందితుడు గతంలో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

హైదరాబాద్ పాత బస్తీలోనూ భద్రత పెంపు
యూపీలో హైదరాబాద్​ఎంపీ అసదుద్దీన్​ఓవైసీ కారుపై దుండగులు కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు బందోబస్తు పెంచారు. పాతబస్తీలోని చార్మినార్​ మదీనా, పత్తర్​గట్టి, గుల్జార్​హౌజ్, షహ్రాన్​మార్కెట్, లాడ్ బజార్, మక్కా మసీద్, కిల్వట్, లాల్ దర్వాజ, ఛత్రినాక, చంద్రాయణ గుట్ట, హుస్సేనీ అలం, శాలిబండ, ఫలక్ నుమ, యాకుత్ పుర, రెయిన్ బజార్, శాస్త్రి నగర్ తదితర ప్రాంతాలలో పోలీస్ బందోబస్తు ఏర్పాుట చేశారు. పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాత బస్తీ దక్షిణ మండలం ఇంఛార్జి డీసీపీ గజరవూ భూపాల్ ఆధ్వర్యంలో భారీ పోలీస్​బందోబస్తు నిర్వహించారు. అయా ప్రాంతాల్లో దుకాణాలను కొందరు వ్యాపారులు స్వచ్ఛందంగా మూసి వేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు

వీడియోలు

Allu Arjun 42 New Rules Viral Video | బన్నీతో మాట్లాడాలంటే 42 రూల్స్ ఉన్నాయా.? వైరల్ వీడియోలో నిజమెంత.? | ABP Desam
Attack on PM Modi at Parliament | ప్రధాని మోదీపై మహిళా ఎంపీల ప్రీ ప్లాన్డ్ ఎటాక్.? | ABP Desam
India vs Pakistan T20 World Cup | ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
BCCI Central Contract | కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
ICC Shocking Decision against PCB | ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలని ఐసీసీని కోరిన పాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
AP Assembly Sessions: అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
Telangana Municipal Elections: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్
మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
Kanpur Bank employee: నేను ఠాకూర్‌ను.. బ్యాంకులో రెచ్చిపోయిన ఉద్యోగిని - సోషల్ మీడియా కడిగేసింది!
నేను ఠాకూర్‌ను.. బ్యాంకులో రెచ్చిపోయిన ఉద్యోగిని - సోషల్ మీడియా కడిగేసింది!
Medchal Earthquake: మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
మేడ్చల్ జిల్లాలో భూకంపం.. కుత్బుల్లాపూర్, గాజులరామారంలో భూమి కంపించడంతో స్కూళ్లకు సెలవులు
Embed widget