అన్వేషించండి

Rythu Bharosa Scheme: రైతు పెట్టుబడి సాయం వానాకాలంలో ఇవ్వలేం - మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Telangana News | సబ్ కమిటీ రిపోర్టు వచ్చే వరకు రైతు భరోసా కింద ఎకరానికి 7500 ఇవ్వలేమని రేవంత్ సర్కార్ తెల్చి చెప్పింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరావు మీడియాతో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు

Rythu Bharosa Scheme In Telangana | హైదరాబాద్:  ఈ వానాకాలం సీజన్ లో రైతులకు రైతు భరోసా ఇవ్వడం లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరారావు (Thummala Nageswara Rao) స్పష్టం చేశారు. రైతుకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు భరోసా పథకాన్ని వచ్చే వ్యయవసాయ సీజన్ నుంచి ఇస్తామన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక దానికి అనుగుణంగా  రైతు భరోసా ఇస్తామని మీడియాతో మాట్లాడుతూ ఇవాళ స్పష్టం చేశారు.  వచ్చే రబీ సీజన్ నుండే  రైతులకు  ఎకరానికి రూ. 7500 చెల్లించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెట్టుబడి  సాయం అదించడమే ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా మంత్రి వర్గ ఉప సంఘం  నివేదిక  తయారు చేస్తుందని మీడియా అడిగిన ప్రశ్నలకు  ఆయన సమాధానమిచ్చారు. 

త్వరలోనే రుణమాఫీ... 
సాంకేతిక కారణాలతో కొద్ది మందికి నిలిచిపోయిన  2 లక్షల  రైతు రుణ మాఫీ త్వరలోనే అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నెల 31 తర్వాత ఈ  రుణ మాఫీ ప్రక్రియ  అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది.

 రైతు భరోసా ఎగ్గొట్టేందుకే ఈ ప్రకటనలు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ 

ప్రభుత్వం రైతు భరోసా  ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెండ్ కేటీఆర్  ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కమిటీల  పేరు చెప్పి కాలయాపన చేస్తూ రైతులను మోసం చేయడం ప్రభుత్వ విధానంలో భాగం అని కేటీఆర్ అన్నారు. వర్షాకాలానికి రైతు భరోసా ఇవ్వమని మంత్రి తుమ్మల ప్రకటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతుల ఖాతాలో రైతు భరోసా మొత్తాన్ని జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు కు రాం రాం చెబుతారని కేసీఆర్ చెప్పిన మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందని విమర్శించారు. రైతు భరోసాకు డబ్బులు లేకపోవడం వల్లే  సబ్ కమిటీ అని ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు.   పేదల కడుపు కొట్టి లక్షా 50 వేలతో మూసీ సుందరీకరణ కు డబ్బులు ఉంటాయి గాని రైతులకు ఎకరాకు 7500 ఇచ్చేందుకు డబ్బులు లేవా అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు బంధు ఇవ్వకపోతే  ఎక్కడికక్కడ  కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తామని హెచ్చరించారు. రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్ వదిలేది లేదన్నారు.

 రేపు రాష్ట్ర వ్యాప్తంగా  నిరసనలు - బీఆర్ఎస్

రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా (Raithu Bharosa Scheme ) ఎగగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భారత రాష్ట్ర సమతి పిలుపునిచ్చింది. 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులకు మోసం చేసిన కాంగ్రెస్ తీరుని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు  కేటీఆర్ సూచించారు.

Also Read: Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget