అన్వేషించండి

TSRTC News: 27 బస్సులు, 166 మంది స్టాఫ్‌తో మొదలైన టీఎస్ఆర్టీసీ చరిత్ర తెలుసా?

TSRTC News: 9 దశాబ్దాల చరిత్ర కల్గిన టీఎస్ ఆర్టీసీలో తెలంగాణ సర్కారు సరికొత్త జోష్ నింపింది. నిజాం కాలంలో ప్రారంభమైన ఈ ప్రస్థానం అనేక అద్భుతమైన రికార్డులు సాధిస్తూ దూసుకెళ్తోంది.

TSRTC News: తొమ్మిది దశాబ్దాల చరిత్ర కల్గిన తెలంగాణ ఆర్టీసీ మరింత ప్రగతి చక్రంపై దూసుకెళ్తోంది. నిజాం కాలంలో అంటే 1932వ సంవత్సరంలో ప్రారంభం అయిన ఆర్టీసీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక అద్భుతమైన రికార్డులతో దూసుకెళ్తున్న ఆర్టీసీని అప్పట్లో నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ అని పిలిచేవారు. 27 బస్సులు, 166 మంది సిబ్బంది ఉండేవారు. స్వాతంత్ర్యం తర్వాత 1951 నవంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం అయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1958 జనవరి 11వ తేదీన ఏపీఎస్ ఆర్టీసీగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో 22 వేల 628 బస్సులతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థగా చరిత్ర సృష్టించింది. 1999లో గిన్నిస్ రికార్డు కూడా సాధించింది.  

2014వ సంవత్సరంలో రాష్ట్ర విభజన అనంతరం 2015 జూన్ 3వ తేదీన తెలగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రూపాంతరం చెందింది. అప్పటికీ సంస్థకు 98 డిపోలు ఉన్నాయి. టీఎస్ ఆర్టీసీకి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 7వ తేదీన ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్ గఢ్ కు సర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 90 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 9 వేల 384 బస్సులు ఉన్నాయి. ఇందులో 68 శాతం అంటే సుమారు 6 వేల 300 బస్సులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 364 బస్ స్టేషన్లు ఉన్నాయి. 

అయితే గత కొన్నేళ్ల క్రితం ఆర్టీసీ చాలా గొప్పగా ఉండేది. పల్లెల్లోని చాలా మంది ప్రజలు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులనే వాడేవాళ్లు. అలాగే ఆఫీసులకు వెళ్లాలన్నా ఎక్కువ మంది దీన్నే నమ్ముకునే వారు. కానీ కాలానుగుణంగా ప్రజలు అందరూ వ్యక్తిగత వాహనాలు, ప్రైవేటు వాహనాలు, క్యాబ్ లు, ఆటోలు ఇలా అన్నింటి వల్ల ఆర్టీసీ చాలా నష్టాలను చివచూసింది. నాటి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అప్పుల్లో కూరుకుపోయింది. జీతాలకు కూడా అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా సంస్థకున్న వేల కోట్ల ఆస్తులను తనఖా పెట్టాల్సి దుస్థితికి చేరుకుంది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ తొలి నుంచి ఆర్టీసీకి అండగా నిలుస్తున్నారు. ప్రజా జీవితంలో భాగమైన ఆర్టీసీకి ఏటా బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయిస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారు చేసిన సేవలకు గుర్తింపుగా మొదట 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు. నిర్వహణకు డబ్బుల కోసం ప్రభుత్వం గ్యారంటీగా ఉంటూ అనేక రుణాలు ఇప్పంచింది. అయినా నష్టాలు, కష్టాల బాటలోనే ప్రయాణించడంతో తమను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కు కార్మికులు విజ్ఞప్తి చేశారు. తాజాగా ప్రభుత్వం వారికి శుభవార్త చెబుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. 

అయితే దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం అని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. సంస్థలోని దాదాపు 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం ఇదంటూ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పని చేస్తున్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు చెప్పారు. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ నిర్ణయంతో సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. ప్రజా రవాణా వ్యవస్థను తెలంగాణలో మరింతగా ప్రజలకు చేరువ చేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget