అన్వేషించండి

TRS Leaders On Modi: తెలంగాణ నేలపై కమలం వికసించే ఛాన్స్ లేదు- మోదీ కామెంట్స్‌కు టీఆర్‌ఎస్ కౌంటర్

ప్రధానమంత్రి మోదీ పగటి కలలు కంటున్నారని విమర్శించారు టీఆర్‌ఎస్ లీడర్లు. తెలంగాణ నేల, నీటిపై కమలం వికసించే ఛాన్స్ లేదంటున్నారు.

కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానమంత్రి మోదీ చేసిన కామెంట్స్‌పై ఘాటుగా స్పందించారు టీఆర్‌ఎస్‌ లీడర్లు. తల్లిని చంపి పిల్లను బతికించారని గతంలో కామెంట్ చేసిన మోదీకి.. తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. మాటలు తప్ప మోదీ ప్రభుత్వంలో చేతలు కరువయ్యాయని విమర్శించారు. స్వచ్చభారత్, భేటీ బచావో - భేటీ పడావో, జన్ ధన్, నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా ఇలా అన్ని పథకాలు, నినాదాలు, విధానాలు విఫలమైనవేనన్నారు. 

ఆగస్టు కల్లా మరో 8 లక్షల కోట్లు అప్పు

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదన్న నిరంజన్‌ రెడ్డి.. నరేంద్రమోదీది అత్యాశ అవుతుందన్నారు. మోదీ, షా దేశాన్ని అమ్ముతుంటే ఆదానీ, అంబానీలు కొనుక్కుంటున్నారన్నారు. కరోనా విపత్తులో దేశం అల్లాడుతుంటే చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అని దేశ ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని కామెంట్స్ చేశారు. ఎనిమిదేళ్ల పాలనలో 100 లక్షల కోట్ల అప్పు చేసిన మోదీ రేపు ఆగస్టు వరకు మరో 8 లక్షల కోట్ల ప్రతిపాదనలు తయారుచేసి పెట్టారన్నారు. 

కార్పొరేట్ల రుణాలు మోదీ మాఫీ 

నాలుగు వేల కోట్లు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే మొహం చాటేసిన మోదీ రూ.11 లక్షల కోట్ల కార్పోరేట్ అప్పులను మాఫీ చేశారని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. మోదీ హయాంలో దేశంలో ఎక్కడైనా పది లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే  ప్రాజెక్టు కట్టారా అని ప్రశ్నించారు. దేశ రైతుల ఉసురు పోసుకుని క్షమాపణలు చెప్పిన విఫల ప్రధాని మోదీ అంటూ విరుచుకుపడ్డారాయన. 

గుజరాత్‌లో కరెంటు సంగతేంటి?

మూడుసార్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు దేశ ప్రధానిగా ఉండి గుజరాత్‌లో కనీసం 24 గంటల కరంటు ఇవ్వలేకపోయిన ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు ఏం చేస్తారని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. కేంద్రంలో 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నింపడం చేతగాని మోదీ యువకుల గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నిరంకుశత్వం, కుటుంబపాలన అనే మాటలు మోదీ నోటి నుంచి వింటే నవ్వొస్తుందన్నారు. 

మేకిన్ ఇండియా కాదు సేల్‌ ఇండియా

ఎదగాల్సిన భారత ఆర్థిక వ్యవస్థను కుంటుపడేలా చేసింది మోదీ ఎనిమిదేళ్ల పాలన అని విమర్శలు చేశారు నిరంజన్ రెడ్డి. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మి దేశాన్ని అధోగతి పాలు చేశారని ధ్వజమెత్తారు. మేకిన్ ఇండియాను నినాదానికి పరిమితం చేసి సేల్ ఇండియాను పరిచయం చేశారన్నారు. భారతదేశ చరిత్రలో అత్యంత విఫల ప్రధాని మోదీ ప్రపంచదేశాల ముందు భారత్‌ను నవ్వులపాలు చేశారని విమర్శించారు. 

వాట్సాప్‌ యూనివర్శిటీ కట్టుకథలు

అంధవిశ్వాసాలను నమ్మనంటున్న మోదీ అంధ భక్తులను తయారుచేసి పబ్బం గడుపుకుంటున్నారన్నారు నిరంజన్ రెడ్డి. వాట్సప్ యూనివర్శిటీలో కట్టుకథలు తయారు చేసి ప్రచారం చేస్తూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో హింసను రెచ్చగొడుతున్నారని విమర్శలు చేశారు. కర్ణాటకలో హిజాబ్, హలాల్, మహారాష్ట్రలో హనుమాన్ ఛాలీసా, యూపీలో జ్ఞానవాపి, మసీదుల శివలింగాలు అంటూ బీజేపీ నేతలు చిల్లర పంచాయతీలు లేపుతున్నారన్నారు. భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణమిస్తారు, భాషల మీద రాజకీయం చేయవద్దు అని మోదీ అంటుంటే.. తెలంగాణ బీజేపీ నేతలు ఉర్దూ పేరుతో రాజ్యాంగ విరుద్ద వ్యాఖ్యలు చేశారని... ముస్లింల మీద విషం చిమ్ముతారన్నారు. 

స్థాయి మరచి విమర్శలు 

నరేంద్ర మోదీ తాను అత్యున్నత స్థాయి పదవిలో ఉన్నానన్న మాట మర్చి మాట్లాడారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశం వచ్చినప్పుడల్లా, అది పార్లమెంటు లోపల, బయట విషం చిమ్ముతున్నారన్నారు. కాకినాడలో 1997లో బిజెపి జాతీయ నాయకత్వం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానించి మాట తప్పినందునే తెలంగాణ యువత ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారని కొప్పుల ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహోద్యమాన్ని నడిపించి, రాజకీయ పార్టీలన్నింటి మద్దతు కూడా గట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం...అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేస్తుండడం ప్రపంచమంతా చూస్తున్నదన్నదన్నారు. దేశకాల పరిస్థితుల పట్ల కేసీఆర్ కు ఉన్న సంపూర్ణ అవగాహన, లోతైన ఆలోచనలు, వ్యూహరచన, దార్శనికత తెలిసి..వివిధ పార్టీల అధ్యక్షులు, దేశ ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనలు చూసి మోదీ వణికిపోతున్నారని కొప్పుల పేర్కొన్నారు. 

కమలం ఇక్కడ వికసించే ఛాన్స్ లేదు

మోదీ పట్టపగలే కలలు కన్నారని, అవి ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా నిజం కాబోవన్నారు కొప్పుల. తెలంగాణలోనే కాదు వచ్చే లోకసభ ఎన్నికలలో బిజెపికి ఘోర పరాజయం తప్పదని ఈశ్వర్ సుస్పష్టం చేశారు. బిజెపి గత ఎన్నికలలో 107 అసెంబ్లీ స్థానాలలో డిపాజిట్లు కోల్పోయిన విషయం బహుశా మోదీ తెలిసి ఉండకపోవచ్చని చెప్పారు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికలలో ఇప్పుడున్న 4 లోకసభ, 3అసెంబ్లీ సీట్లు కూడా రావని, ఈ నేలపై, ఈ నీళ్లలో ఆ పువ్వు వికసించే అవకాశం ఏ మాత్రం లేదని కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

పార్లమెంట్ భవనం ఎందుకు కడుతున్నారు?

ప్రధాని మోడీ తెలంగాణపై విషంకక్కారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని హోదాలో ఉండి అబద్దాలు చెప్పారన్నారు. తెలంగాణకు ఒక్క సంస్థను ఇవ్వకుండా అన్యాయం చేశారని... మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఐటీఐఆర్‌ను రద్దు చేసిన చరిత్ర మోదీదన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపి ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ను తెలంగాణ సాకుతోంది. పార్లమెంట్ భవనం మూడ నమ్మకంతోనే కూల కొడుతున్నారో లేదో మోదీ సమాధానం చెప్పాలన్నారు. 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ తీరును త‌ప్పుబ‌ట్టారు గంగుల కమలాకర్. ఆయ‌న మ‌సీదుల‌పై చేసిన వ్యాఖ్యల‌ను ఖండించారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో మతకలహాలు లేకుండా... లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని తెలిపారు. బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నార‌ని ఆరోపించారు. మతకలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదు... ఇందుకు గుజరాత్ నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్న మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌.. ప్రధాని స్వరాష్ట్రం అయిన‌ప్పటికీ అందుకే అక్కడికి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం లేదని తెలిపారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Ippa Flower: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget