అన్వేషించండి

TRS Leaders On Modi: తెలంగాణ నేలపై కమలం వికసించే ఛాన్స్ లేదు- మోదీ కామెంట్స్‌కు టీఆర్‌ఎస్ కౌంటర్

ప్రధానమంత్రి మోదీ పగటి కలలు కంటున్నారని విమర్శించారు టీఆర్‌ఎస్ లీడర్లు. తెలంగాణ నేల, నీటిపై కమలం వికసించే ఛాన్స్ లేదంటున్నారు.

కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానమంత్రి మోదీ చేసిన కామెంట్స్‌పై ఘాటుగా స్పందించారు టీఆర్‌ఎస్‌ లీడర్లు. తల్లిని చంపి పిల్లను బతికించారని గతంలో కామెంట్ చేసిన మోదీకి.. తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. మాటలు తప్ప మోదీ ప్రభుత్వంలో చేతలు కరువయ్యాయని విమర్శించారు. స్వచ్చభారత్, భేటీ బచావో - భేటీ పడావో, జన్ ధన్, నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా ఇలా అన్ని పథకాలు, నినాదాలు, విధానాలు విఫలమైనవేనన్నారు. 

ఆగస్టు కల్లా మరో 8 లక్షల కోట్లు అప్పు

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదన్న నిరంజన్‌ రెడ్డి.. నరేంద్రమోదీది అత్యాశ అవుతుందన్నారు. మోదీ, షా దేశాన్ని అమ్ముతుంటే ఆదానీ, అంబానీలు కొనుక్కుంటున్నారన్నారు. కరోనా విపత్తులో దేశం అల్లాడుతుంటే చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అని దేశ ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని కామెంట్స్ చేశారు. ఎనిమిదేళ్ల పాలనలో 100 లక్షల కోట్ల అప్పు చేసిన మోదీ రేపు ఆగస్టు వరకు మరో 8 లక్షల కోట్ల ప్రతిపాదనలు తయారుచేసి పెట్టారన్నారు. 

కార్పొరేట్ల రుణాలు మోదీ మాఫీ 

నాలుగు వేల కోట్లు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే మొహం చాటేసిన మోదీ రూ.11 లక్షల కోట్ల కార్పోరేట్ అప్పులను మాఫీ చేశారని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. మోదీ హయాంలో దేశంలో ఎక్కడైనా పది లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే  ప్రాజెక్టు కట్టారా అని ప్రశ్నించారు. దేశ రైతుల ఉసురు పోసుకుని క్షమాపణలు చెప్పిన విఫల ప్రధాని మోదీ అంటూ విరుచుకుపడ్డారాయన. 

గుజరాత్‌లో కరెంటు సంగతేంటి?

మూడుసార్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు దేశ ప్రధానిగా ఉండి గుజరాత్‌లో కనీసం 24 గంటల కరంటు ఇవ్వలేకపోయిన ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు ఏం చేస్తారని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. కేంద్రంలో 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నింపడం చేతగాని మోదీ యువకుల గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నిరంకుశత్వం, కుటుంబపాలన అనే మాటలు మోదీ నోటి నుంచి వింటే నవ్వొస్తుందన్నారు. 

మేకిన్ ఇండియా కాదు సేల్‌ ఇండియా

ఎదగాల్సిన భారత ఆర్థిక వ్యవస్థను కుంటుపడేలా చేసింది మోదీ ఎనిమిదేళ్ల పాలన అని విమర్శలు చేశారు నిరంజన్ రెడ్డి. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మి దేశాన్ని అధోగతి పాలు చేశారని ధ్వజమెత్తారు. మేకిన్ ఇండియాను నినాదానికి పరిమితం చేసి సేల్ ఇండియాను పరిచయం చేశారన్నారు. భారతదేశ చరిత్రలో అత్యంత విఫల ప్రధాని మోదీ ప్రపంచదేశాల ముందు భారత్‌ను నవ్వులపాలు చేశారని విమర్శించారు. 

వాట్సాప్‌ యూనివర్శిటీ కట్టుకథలు

అంధవిశ్వాసాలను నమ్మనంటున్న మోదీ అంధ భక్తులను తయారుచేసి పబ్బం గడుపుకుంటున్నారన్నారు నిరంజన్ రెడ్డి. వాట్సప్ యూనివర్శిటీలో కట్టుకథలు తయారు చేసి ప్రచారం చేస్తూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో హింసను రెచ్చగొడుతున్నారని విమర్శలు చేశారు. కర్ణాటకలో హిజాబ్, హలాల్, మహారాష్ట్రలో హనుమాన్ ఛాలీసా, యూపీలో జ్ఞానవాపి, మసీదుల శివలింగాలు అంటూ బీజేపీ నేతలు చిల్లర పంచాయతీలు లేపుతున్నారన్నారు. భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణమిస్తారు, భాషల మీద రాజకీయం చేయవద్దు అని మోదీ అంటుంటే.. తెలంగాణ బీజేపీ నేతలు ఉర్దూ పేరుతో రాజ్యాంగ విరుద్ద వ్యాఖ్యలు చేశారని... ముస్లింల మీద విషం చిమ్ముతారన్నారు. 

స్థాయి మరచి విమర్శలు 

నరేంద్ర మోదీ తాను అత్యున్నత స్థాయి పదవిలో ఉన్నానన్న మాట మర్చి మాట్లాడారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశం వచ్చినప్పుడల్లా, అది పార్లమెంటు లోపల, బయట విషం చిమ్ముతున్నారన్నారు. కాకినాడలో 1997లో బిజెపి జాతీయ నాయకత్వం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానించి మాట తప్పినందునే తెలంగాణ యువత ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారని కొప్పుల ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహోద్యమాన్ని నడిపించి, రాజకీయ పార్టీలన్నింటి మద్దతు కూడా గట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం...అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేస్తుండడం ప్రపంచమంతా చూస్తున్నదన్నదన్నారు. దేశకాల పరిస్థితుల పట్ల కేసీఆర్ కు ఉన్న సంపూర్ణ అవగాహన, లోతైన ఆలోచనలు, వ్యూహరచన, దార్శనికత తెలిసి..వివిధ పార్టీల అధ్యక్షులు, దేశ ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనలు చూసి మోదీ వణికిపోతున్నారని కొప్పుల పేర్కొన్నారు. 

కమలం ఇక్కడ వికసించే ఛాన్స్ లేదు

మోదీ పట్టపగలే కలలు కన్నారని, అవి ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా నిజం కాబోవన్నారు కొప్పుల. తెలంగాణలోనే కాదు వచ్చే లోకసభ ఎన్నికలలో బిజెపికి ఘోర పరాజయం తప్పదని ఈశ్వర్ సుస్పష్టం చేశారు. బిజెపి గత ఎన్నికలలో 107 అసెంబ్లీ స్థానాలలో డిపాజిట్లు కోల్పోయిన విషయం బహుశా మోదీ తెలిసి ఉండకపోవచ్చని చెప్పారు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికలలో ఇప్పుడున్న 4 లోకసభ, 3అసెంబ్లీ సీట్లు కూడా రావని, ఈ నేలపై, ఈ నీళ్లలో ఆ పువ్వు వికసించే అవకాశం ఏ మాత్రం లేదని కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

పార్లమెంట్ భవనం ఎందుకు కడుతున్నారు?

ప్రధాని మోడీ తెలంగాణపై విషంకక్కారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని హోదాలో ఉండి అబద్దాలు చెప్పారన్నారు. తెలంగాణకు ఒక్క సంస్థను ఇవ్వకుండా అన్యాయం చేశారని... మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఐటీఐఆర్‌ను రద్దు చేసిన చరిత్ర మోదీదన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపి ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ను తెలంగాణ సాకుతోంది. పార్లమెంట్ భవనం మూడ నమ్మకంతోనే కూల కొడుతున్నారో లేదో మోదీ సమాధానం చెప్పాలన్నారు. 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ తీరును త‌ప్పుబ‌ట్టారు గంగుల కమలాకర్. ఆయ‌న మ‌సీదుల‌పై చేసిన వ్యాఖ్యల‌ను ఖండించారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో మతకలహాలు లేకుండా... లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని తెలిపారు. బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నార‌ని ఆరోపించారు. మతకలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదు... ఇందుకు గుజరాత్ నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్న మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌.. ప్రధాని స్వరాష్ట్రం అయిన‌ప్పటికీ అందుకే అక్కడికి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం లేదని తెలిపారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TS SSC Results 2026 District wise Results: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు
తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు
Husky Dogs: ఖరీదైన హస్కీ కుక్కల్ని పెంచి రోడ్డున వదిలేశారు - కాపాడిన స్వచ్చంద సంస్థలు - ఎవరి పని?
ఖరీదైన హస్కీ కుక్కల్ని పెంచి రోడ్డున వదిలేశారు - కాపాడిన స్వచ్చంద సంస్థలు - ఎవరి పని?
Telangana SSC Results 2026: తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల.. 95.15 శాతం విద్యార్థులు పాస్.. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్
తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల.. 95.15 శాతం విద్యార్థులు పాస్.. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్
Telangana DGP CV Anand: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం-క్రికెట్ మైదానం నుంచి పోలీస్‌ బాస్ వరకు ప్రస్థానం ఇదే!
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకం-క్రికెట్ మైదానం నుంచి పోలీస్‌ బాస్ వరకు ప్రస్థానం ఇదే!

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
Dhurandhar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Hormuz: హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
TS SSC Supplementary Exams Date: తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
Embed widget