అన్వేషించండి

Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే

Telangana News | తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై వివాదం నెలకొంది. అయితే మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు అని రాష్ట్ర ప్రజలు చెక్ చేస్తున్నారు. అప్పటినుంచి జరిగిన మార్పులివే

Telangana Mother Statue at Secretariat | హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయాలు హీటెక్కాయి. నేటి సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కొన్నేళ్ల కిందట ఇదేరోజు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేయడం తెలిసిందే. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాడి పూర్తి కావడం, మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు సైతం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తోంది.

తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని కొందరికే తెలుసు. ఉద్యమం కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ తల్లి విగ్రహానికి ఓ రూపు తీసుకొచ్చి ఆవిష్కరించారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ విజయశాంతి తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తల్లి తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు హోదాలో యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటలో 2007 జనవరి 25న విజయశాంతి మొట్ట మొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన తొలి నేత తానేనని ఆమె సైతం స్పష్టం చేశారు. విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌, కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.


Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే

18 సంవత్సరాల క్రితం 2007లో తెలంగాణ పోరాటాల ఉద్యమకారులం, సమైక్య పాలనలో గుండె నిండా జై తెలంగాణ అని నినదిస్తూ మొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించానని విజయశాంతి పోస్ట్ చేశారు. ఉద్యమ రోజుల్లో ఎన్నో నిర్బంధాలను దాటుకుంటూ, మన తల్లి తెలంగాణకు ఏర్పాటు చేసుకున్న రూపం ఇదేనని విజయశాంతి పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరిస్తున్న విగ్రహం ఇలా ఉన్నాయని ఆమె రాసుకొచ్చారు. తెలంగాణ తల్లి రూపం ఏదైనా తెలంగాణ బిడ్డల బలిదానాలతో సాధించుకున్న ప్రతి తెలంగాణ తల్లి స్వరూపం, మనకు ఎల్లప్పుడూ స్మరణీయం అన్నారు. అమ్మోరు తల్లి లెక్క, నూరు రూపాలైనా, ఏ రూపంలోఉన్నా.. ప్రతి రూపం తెలంగాణ తల్లి ప్రతిరూపమే.... జై తెలంగాణ అని విజయశాంతి మరోసారి నినదించారు.

రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్ పార్టీ) ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి మరో రూపునిచ్చింది. రెండు దఫాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ ఉండేలా విగ్రహం రూపొందించారు. తెలంగాణ తల్లి ఓ చేతిలో వ్యవసాయానికి సంబంధించి చూపిస్తుండగా, మరో చేతిలో బతుకమ్మను ఏర్పాటు చేసింది టీఆర్ఎస్. మెడలో బంగారు నగలు, తలపై కిరీటంతో నిండుతనం కనిపించేలా చేశామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ భవన్ లోనూ తెలంగాణ తల్లి విగ్రహం ఇదే తీరుగా ఉంటుంది. రాష్ట్రంలోని పలుచోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలు ఇలాగే మనకు దర్శనమిస్తాయి. 

తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించిన కాంగ్రెస్
మాజీ సీఎం కేసీఆర్ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహంపై నోటిఫికేషన్ ఇవ్వడమో, లేక సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేయడమో చేయనందున అధికార కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాష్ చేసుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో మార్పులు చేర్పులు చేసింది. తెలంగాణ తల్లి విగ్రహం మూడో రూపం ఇది. నేడు (డిసెంబర్ 9, 2024న) రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహంలో బతుకమ్మను తొలగించారు.

రాష్ట్ర ప్రజలకు అభయహస్తం ఇస్తున్నట్లుగా తల్లి ఓ చేతి చూపిస్తారు. తల్లి మరో చేతిలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడానికి సూచికగా పంట ఉత్పత్తులను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ రూపొందించిన విగ్రహం రూపంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. అది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి అని విమర్శించారు. తమకు క్రెడిట్ లేకుండా చేసేందుకు బతుకమ్మను సైతం తొలగించారని, అమ్మ తలపై కిరీటం సైతం తీసేసి కాంగ్రెస్ తప్పిదం చేసిందని.. తెలంగాణ తల్లి నిండు రూపంలా లేదని ఆరోపిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టాటాగ్రూప్‌లో కీలక పరిణామం- ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా 
టాటాగ్రూప్‌లో కీలక పరిణామం- ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget