అన్వేషించండి

Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే

Telangana News | తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై వివాదం నెలకొంది. అయితే మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు అని రాష్ట్ర ప్రజలు చెక్ చేస్తున్నారు. అప్పటినుంచి జరిగిన మార్పులివే

Telangana Mother Statue at Secretariat | హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయాలు హీటెక్కాయి. నేటి సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కొన్నేళ్ల కిందట ఇదేరోజు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేయడం తెలిసిందే. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాడి పూర్తి కావడం, మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు సైతం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తోంది.

తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని కొందరికే తెలుసు. ఉద్యమం కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ తల్లి విగ్రహానికి ఓ రూపు తీసుకొచ్చి ఆవిష్కరించారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ విజయశాంతి తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తల్లి తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు హోదాలో యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటలో 2007 జనవరి 25న విజయశాంతి మొట్ట మొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన తొలి నేత తానేనని ఆమె సైతం స్పష్టం చేశారు. విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌, కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.


Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే

18 సంవత్సరాల క్రితం 2007లో తెలంగాణ పోరాటాల ఉద్యమకారులం, సమైక్య పాలనలో గుండె నిండా జై తెలంగాణ అని నినదిస్తూ మొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించానని విజయశాంతి పోస్ట్ చేశారు. ఉద్యమ రోజుల్లో ఎన్నో నిర్బంధాలను దాటుకుంటూ, మన తల్లి తెలంగాణకు ఏర్పాటు చేసుకున్న రూపం ఇదేనని విజయశాంతి పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరిస్తున్న విగ్రహం ఇలా ఉన్నాయని ఆమె రాసుకొచ్చారు. తెలంగాణ తల్లి రూపం ఏదైనా తెలంగాణ బిడ్డల బలిదానాలతో సాధించుకున్న ప్రతి తెలంగాణ తల్లి స్వరూపం, మనకు ఎల్లప్పుడూ స్మరణీయం అన్నారు. అమ్మోరు తల్లి లెక్క, నూరు రూపాలైనా, ఏ రూపంలోఉన్నా.. ప్రతి రూపం తెలంగాణ తల్లి ప్రతిరూపమే.... జై తెలంగాణ అని విజయశాంతి మరోసారి నినదించారు.

రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్ పార్టీ) ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి మరో రూపునిచ్చింది. రెండు దఫాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ ఉండేలా విగ్రహం రూపొందించారు. తెలంగాణ తల్లి ఓ చేతిలో వ్యవసాయానికి సంబంధించి చూపిస్తుండగా, మరో చేతిలో బతుకమ్మను ఏర్పాటు చేసింది టీఆర్ఎస్. మెడలో బంగారు నగలు, తలపై కిరీటంతో నిండుతనం కనిపించేలా చేశామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ భవన్ లోనూ తెలంగాణ తల్లి విగ్రహం ఇదే తీరుగా ఉంటుంది. రాష్ట్రంలోని పలుచోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలు ఇలాగే మనకు దర్శనమిస్తాయి. 

తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించిన కాంగ్రెస్
మాజీ సీఎం కేసీఆర్ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహంపై నోటిఫికేషన్ ఇవ్వడమో, లేక సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేయడమో చేయనందున అధికార కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాష్ చేసుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో మార్పులు చేర్పులు చేసింది. తెలంగాణ తల్లి విగ్రహం మూడో రూపం ఇది. నేడు (డిసెంబర్ 9, 2024న) రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహంలో బతుకమ్మను తొలగించారు.

రాష్ట్ర ప్రజలకు అభయహస్తం ఇస్తున్నట్లుగా తల్లి ఓ చేతి చూపిస్తారు. తల్లి మరో చేతిలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడానికి సూచికగా పంట ఉత్పత్తులను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ రూపొందించిన విగ్రహం రూపంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. అది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి అని విమర్శించారు. తమకు క్రెడిట్ లేకుండా చేసేందుకు బతుకమ్మను సైతం తొలగించారని, అమ్మ తలపై కిరీటం సైతం తీసేసి కాంగ్రెస్ తప్పిదం చేసిందని.. తెలంగాణ తల్లి నిండు రూపంలా లేదని ఆరోపిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversions: ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget