అన్వేషించండి

Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే

Telangana News | తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై వివాదం నెలకొంది. అయితే మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు అని రాష్ట్ర ప్రజలు చెక్ చేస్తున్నారు. అప్పటినుంచి జరిగిన మార్పులివే

Telangana Mother Statue at Secretariat | హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయాలు హీటెక్కాయి. నేటి సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కొన్నేళ్ల కిందట ఇదేరోజు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేయడం తెలిసిందే. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాడి పూర్తి కావడం, మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు సైతం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తోంది.

తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని కొందరికే తెలుసు. ఉద్యమం కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ తల్లి విగ్రహానికి ఓ రూపు తీసుకొచ్చి ఆవిష్కరించారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ విజయశాంతి తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తల్లి తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు హోదాలో యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటలో 2007 జనవరి 25న విజయశాంతి మొట్ట మొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన తొలి నేత తానేనని ఆమె సైతం స్పష్టం చేశారు. విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌, కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.


Telangana Talli Statue: మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించింది ఎవరు, అప్పటినుంచి జరిగిన మార్పులివే

18 సంవత్సరాల క్రితం 2007లో తెలంగాణ పోరాటాల ఉద్యమకారులం, సమైక్య పాలనలో గుండె నిండా జై తెలంగాణ అని నినదిస్తూ మొదటి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించానని విజయశాంతి పోస్ట్ చేశారు. ఉద్యమ రోజుల్లో ఎన్నో నిర్బంధాలను దాటుకుంటూ, మన తల్లి తెలంగాణకు ఏర్పాటు చేసుకున్న రూపం ఇదేనని విజయశాంతి పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరిస్తున్న విగ్రహం ఇలా ఉన్నాయని ఆమె రాసుకొచ్చారు. తెలంగాణ తల్లి రూపం ఏదైనా తెలంగాణ బిడ్డల బలిదానాలతో సాధించుకున్న ప్రతి తెలంగాణ తల్లి స్వరూపం, మనకు ఎల్లప్పుడూ స్మరణీయం అన్నారు. అమ్మోరు తల్లి లెక్క, నూరు రూపాలైనా, ఏ రూపంలోఉన్నా.. ప్రతి రూపం తెలంగాణ తల్లి ప్రతిరూపమే.... జై తెలంగాణ అని విజయశాంతి మరోసారి నినదించారు.

రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్ పార్టీ) ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి మరో రూపునిచ్చింది. రెండు దఫాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ ఉండేలా విగ్రహం రూపొందించారు. తెలంగాణ తల్లి ఓ చేతిలో వ్యవసాయానికి సంబంధించి చూపిస్తుండగా, మరో చేతిలో బతుకమ్మను ఏర్పాటు చేసింది టీఆర్ఎస్. మెడలో బంగారు నగలు, తలపై కిరీటంతో నిండుతనం కనిపించేలా చేశామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ భవన్ లోనూ తెలంగాణ తల్లి విగ్రహం ఇదే తీరుగా ఉంటుంది. రాష్ట్రంలోని పలుచోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలు ఇలాగే మనకు దర్శనమిస్తాయి. 

తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించిన కాంగ్రెస్
మాజీ సీఎం కేసీఆర్ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహంపై నోటిఫికేషన్ ఇవ్వడమో, లేక సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేయడమో చేయనందున అధికార కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాష్ చేసుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో మార్పులు చేర్పులు చేసింది. తెలంగాణ తల్లి విగ్రహం మూడో రూపం ఇది. నేడు (డిసెంబర్ 9, 2024న) రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహంలో బతుకమ్మను తొలగించారు.

రాష్ట్ర ప్రజలకు అభయహస్తం ఇస్తున్నట్లుగా తల్లి ఓ చేతి చూపిస్తారు. తల్లి మరో చేతిలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడానికి సూచికగా పంట ఉత్పత్తులను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ రూపొందించిన విగ్రహం రూపంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. అది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి అని విమర్శించారు. తమకు క్రెడిట్ లేకుండా చేసేందుకు బతుకమ్మను సైతం తొలగించారని, అమ్మ తలపై కిరీటం సైతం తీసేసి కాంగ్రెస్ తప్పిదం చేసిందని.. తెలంగాణ తల్లి నిండు రూపంలా లేదని ఆరోపిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget