గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిందని, ప్రాజెక్టులను కమీషన్ల కోసమే నిర్మించారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Kaleshwaram Project: కమీషన్ల కోసమే బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నీరు నిల్వ చేస్తే భద్రాచలం మునిగిపోతుందని ఇంజినీర్లు హెచ్చరించారని తెలిపారు.

- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి: బీఆర్ఎస్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి చేసింది.
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తీవ్ర లోపాలతో పనికిరావు.
- నీటి నిల్వ ప్రమాదకరం, భద్రాచలం పరిసర గ్రామాలు మునిగిపోతాయని హెచ్చరిక.
- ప్రాజెక్టులు అధిక కమీషన్ల కోసం మార్చి లక్షల కోట్లు వృధా.
Uttam On Kaleshwaram Project | హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిందని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను రైతుల ప్రయోజనాల కోసం కాకుండా కేవలం కమీషన్ల కోసమే నిర్మించిందని ఆరోపించారు. బ్యారేజీలలో నీళ్లు నిల్వ చేస్తే మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోయి భద్రాచలం సహా చుట్టుపక్కల పలు గ్రామాలు మునిగిపోతాయని ఇంజనీర్లు చెప్పారని గుర్తుచేశారు. కేవలం మీదనే కాదు, మన పిల్లలపై సైతం అధిక వడ్డీల బారం మోపిన పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.
ప్రాజెక్టులపై బీఆర్ఎస్ 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా లాభం లేదు
సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో కలిసి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల పేరిట రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసింది, కట్టింది, అది కూలింది కూడా బీఆర్ఎస్ హయాంలోనేనని.. లక్ష కోట్ల ప్రజాధనాన్ని నాశనం చేసి ఇప్పుడు ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ కక్కుర్తి, ప్రాజెక్టు నిర్మాణంలో చారిత్రక తప్పిదాల వల్లే నేడు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు పూర్తిగా పనికిరాకుండా పోయాయని ఆరోపించారు.
BRS Borrowed ₹1.81 Lakh Crore but Left Telangana with a Collapsed Kaleshwaram Project
— Congress for Telangana (@Congress4TS) July 5, 2026
బీఆర్ఎస్ ఏది ముట్టుకుంటే అది నాశనం
పదేళ్లపాటు ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వ నాశనం చేసింది
అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, ప్రజల ప్రయోజనాల కోసం కాదు.. దోచుకోవడానికే ప్రాజెక్టులు… pic.twitter.com/85Ka3hRBGb
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికల ప్రకారం ఈ 3 బ్యారేజీల్లో నీటిని అస్సలు నిల్వ చేయవద్దని నిపుణులు స్పష్టం చేశారని మంత్రి తెలిపారు. బ్యారేజీల ఫౌండేషన్లో తీవ్రమైన సాంకేతిక లోపాలు ఉన్నాయని, ఒకవేళ మొండిగా నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోవడమే కాకుండా, భద్రాచలం పట్టణంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని ఇంజినీర్లు హెచ్చరించినట్లు వెల్లడించారు. ఎక్కువ ఖర్చు చూపిస్తే ఎక్కువ కమీషన్లు వస్తాయనే దురాశతోనే ఆనాడు ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని ఆరోపించారు.

సరిగ్గా నిర్మించింటే కాళేశ్వరం వాడుకునేవాళ్లం..
ఆనాడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై రూ.11వేల కోట్లు ఖర్చు చేశాక రీడిజైనింగ్ పేరిట మార్చారని, అలా రీడిజైన్ చేసిన కొత్త ప్రాజెక్టుకు రూ.1.20 లక్షల కోట్లు అవసరమని కాగ్ (CAG) ఆనాడే హెచ్చరించిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. గత BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును గనుక సరిగ్గా నిర్మించి ఉంటే, దానిని వినియోగించుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు కిందకు దించే పరిస్థితి లేదని.. గేట్లు కిందకు దింపి నీరు నిల్వ చేయకుండా మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం సైతం అసాధ్యమని వివరించారు.
Frequently Asked Questions
బీఆర్ఎస్ ప్రభుత్వంపై సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రధాన విమర్శ ఏమిటి?
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఈ మూడు బ్యారేజీలు పూర్తిగా పనికిరాకుండా పోయాయి. వాటిలో నీటిని నిల్వ చేయవద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు స్పష్టం చేశారు.
మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిల్వ చేస్తే ఎదురయ్యే ప్రమాదం ఏమిటి?
బ్యారేజీ ఫౌండేషన్లో లోపాలు ఉండటంతో, నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ కొట్టుకుపోయి భద్రాచలం సహా పలు గ్రామాలు మునిగిపోతాయని ఇంజినీర్లు హెచ్చరించారు.
ట్రెండింగ్ వార్తలు























