అన్వేషించండి

KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?

Telangana Tallis statue | తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్న కార్యక్రమానికి హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.

Telangana Govt invites KCR for unveiling of Telangana Tallis statue | సిద్దిపేట: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR)ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.

ఎర్రవెల్లి ఫాం హౌస్‌కు వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఇదే అంశంపై మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించడానికి మంత్రి, నేతల బృందం శనివారం నాడు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లింది. మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు వంశీధర్ రావు తదితరులు సాదర స్వాగతం పలికారు. తన నివాసానికి (Erravelli Farmhouse) వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి లంచ్ ఆతిథ్యమిచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గౌరవించారు.


KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?

ఉద్యమం జరిగిన రోజులు గుర్తుచేసుకున్న నేతలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను అప్పటి ఎంపీలు పొన్నం ప్రభాకర్, కేసీఆర్ నెమరు వేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా, కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారని తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులు ఉన్నారు.

Also Read: Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ! 

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీలక గుర్తింపు

రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలో వరుసగా రెండు పర్యాయాలు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చింది. మూడో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ రెండు పార్టీలకు తెలంగాణలో ఓ విశిష్టత, ప్రాముఖ్యత ఉన్నాయి. తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు సైతం గౌరవం దక్కింది. ఏపీలో తమకు నష్టం జరుగుతుందని తెలిసినా, ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణలో పరిస్థితులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాలు ఏకమై ఉద్యమించడంతో అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 

మూడు రోజులపాటు ఘనంగా ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 7, 8, 9 తేదీలతో ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్న ప్రకటన వచ్చిన డిసెంబర్ 9న ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా ముగించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ క్రమంలో డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది. తెలంగాణ తల్లి రూపం మార్చడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP DesamTirupati Special Herbal Soup | తిరుపతిలో ప్రాచుర్యం పొందుతున్న హెర్బల్ సూప్ కార్నర్ | ABP DesamIdeas of India 2025 | ఎలన్ మస్క్ గురించి గోయెంకాల వారసుడు ఏం చెప్పారంటే | ABP DesamIdeas of India 2025 : ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ Atideb Sarkar ప్రారంభోపన్యాసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Andhra Pradesh Group 2 Exam: 23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల  
23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల  
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..
'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..
Sourav Ganguly Biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..
సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..
Embed widget