అన్వేషించండి

Hyderabad News: గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన, అశోక్ నగర్‌లో భారీగా మోహరించిన పోలీసులు

Telangana Group 1 Candidates protest against GO 29 in Groups Exam

హైదరాబాద్: గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 29 ను రద్దుచేసి తమకు న్యాయం జరిగేలా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అశోక్ నగర్ చౌరస్తాకు పెద్ద ఎత్తున గ్రూప్స్ అభ్యర్థులు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. ఇంకా ఒక్కరోజే ఉందని, ఈరోజైనా తెలంగాణ ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోవాలని రిక్వెస్ట్ చేస్తన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను తొలగించాలనేది జీవో 29 రద్దుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

పదేళ్లు పూర్తయినా గ్రూప్ 1 జాబ్స్ భర్తీ చేయలేదు..

తెలంగాణ వచ్చి పదేళ్లు పూర్తయినా ఒక్కసారి కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. దాంతో గ్రూప్స్ ఉద్యోగాల కోసం చదువుతున్న అభ్యర్థుల తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదివరకే రెండ పర్యాయాలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు చేశారు. మూడోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రిలిమ్స్ నిర్వహించి, మెయిన్స్ కు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 21 నుంచి వారం రోజులపాటు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అయితే జీవో నెంబర్ 29 వల్ల రిజర్వేషన్లు కోల్పోతున్నామని కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు రావని అభ్యర్థులు చెబుతున్నారు. అందువల్ల సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 29 రద్దు చేసి గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించినా తమకు ఏ సమస్య లేదని చెబుతున్నారు.

మా మాటలు వింటే సీఎం మాతో ఏకీభవిస్తారు..

అభ్యర్థులు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టుకు వెళితే తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్నారు. అయితే రెండు, మూడుసార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాయడానికి మానసికంగా తాము సిద్ధంగా లేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి కోచింగ్ తీసుకుని చదవడానికి, హాస్టల్లో, రూముల్లో ఉండేందుకు అంత ఆర్థిక స్థోమత లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కొందరు మిస్ గైడ్ చేస్తున్నారని.. మీ నుంచి మాకు పిలుపు వస్తుందని ఇప్పటివరకూ ఎదురూచూశామని చెప్పారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడే అవకాశం ఇస్తే, తమ సమస్యలు చెప్పుకుంటామన్నారు. మేం చెప్పేది వింటే మా మాటలతో, నిర్ణయంతోనే సీఎం రేవంత్ కూడా ఏకీభవిస్తారని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రం గా వ్యతిరేకిస్తున్నారు. మొన్నటివరకూ హరీష్ రావు, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించారు. రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు అని.. కానీ నేడు నిరుద్యోగుల పక్షాన నిలవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ జీవో 29 తీసుకొచ్చిందని వ్యతిరేకించారు. 

Also Read: TSPSC Group 1 Admit Cards 2024 : తెలంగాణ గ్రూప్‌ వన్‌ హాల్ టికెట్లు వచ్చేశాయ్‌- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

విద్యార్థుల నిరసనకు బండి సంజయ్ మద్దతు

కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం నిరుద్యోగుల సమస్యపై గళం విప్పారు. శనివారం నాడు నేరుగా అశోక్ నగర్ కు వెళ్లి మరీ విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. వారితో పాటు రోడ్డుపై బైఠాయించి గ్రూప్ 1 మెయిన్ వాయిదా వేయాలని, లేకపోతే జీవో 29 రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆపై ఛలో సెక్రటేరియట్ ర్యాలీకి పిలుపునిచ్చారు. సెక్రటేరియట్ కు గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి ర్యాలీగా వెళ్తొంటే పోలీసులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయినా ఆయన వాహనం దిగి మరోసారి రోడ్డుపై నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
DAY NRLM Scheme: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!
డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Embed widget