అన్వేషించండి

Cyber ​​Security: 350 కోట్లు రికవరీ చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ! ప్రజలకు కీలక జాగ్రత్తలు

బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ప్రకారం, 58 వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో నేరాలు తగ్గాయి.

Telangana Cyber ​​Security Bureau | హైదరాబాద్‌లో సైబర్ నేరాల కేసులో తెలంగాణ సైబర్ పోలీసులు అతిపెద్ద విజయం సాధించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ మోసాలకు గురైన బాధితులకు వారి డబ్బును తిరిగి ఇచ్చింది. దాదాపు రూ.350 కోట్లకు పైగా నిందితుల వద్ద నుంచి పైగా రికవరీ చేశారు.

సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మంగళవారం మాట్లాడుతూ.. ఈ బ్యూరో ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు 2.44 లక్షల జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు 58,244 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. అలాగే, సైబర్ మోసాలకు గురైన బాధితులకు రికవరీ చేసిన రూ. 350 కోట్లు తిరిగి అప్పగించినట్లు తెలిపారు. 

గత కొన్ని సంవత్సరాలలో పెరిగిన సైబర్ నేరాలు
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలలో 29% వృద్ధి నమోదైందని శిఖా గోయల్ తెలిపారు. అయితే, తెలంగాణలో సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టాయి. అలాగే ఆర్థిక నష్టాలు కూడా తగ్గాయన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 6% సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఈ విజయానికి అనేక సరైన చర్యలు దోహదపడ్డాయని పేర్కొన్నారు. వీటిలో 1930 హెల్ప్‌లైన్‌ను అప్‌గ్రేడ్ చేయడం, పుట్ ఆన్ హోల్డ్‌ను బలోపేతం చేయడంతో పాటు హైకోర్టు సహాయంతో మోడల్ రీఫండ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం వంటి చర్యలు ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ప్రచారం
బ్యూరో ప్రారంభించిన ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అనే ప్రచారం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా శిఖా గోయల్ ఈ సమాచారాన్ని తెలిపారు. పౌరులలో డిజిటల్ భద్రతను పెంపొందించడం, సైబర్ మోసాల నుండి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యమని అన్నారు. పౌరులు తమ రోజువారీ జీవితంలో సైబర్ భద్రతను అలవాటు చేసుకోవాలని, అప్పుడే మోసాల బారిన పడకుండా ఉంటారని ప్రజలకు సూచించారు. 

తెలంగాణ డీజీపీ ఏమన్నారు..
తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డి సైబర్ సెక్యూరిటీపై మాట్లాడారు. సైబర్ నేరాలను ప్రతి యూనిట్ ప్రధాన పోలీసు ప్రాధాన్యతగా పరిగణించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను ప్రస్తావిస్తూ, అన్ని జిల్లాల్లో బ్యూరోతో బలమైన సమన్వయం ఏర్పరచుకోవాలని, పోలీస్ స్టేషన్లు, ఎస్‌డిపిఓలు, జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, వేషధారణ మోసాలు, ఓటిపి మోసాలు, లోన్ యాప్ వేధింపులు మరియు సోషల్ మీడియా బ్లాక్‌మెయిలింగ్ వంటి ప్రధాన సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరమని ఆయన అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
Janasena Clarity:  దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
దిష్టి వివాదంపై స్పందించిన జనసేన - పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించవద్దని విజ్ఞప్తి
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
సుడిగాలి సుధీర్ డబ్బింగ్ లేకుండా టీజర్ రిలీజ్... నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
Embed widget