అన్వేషించండి

Digvijay Singh: దండం పెడతా, అంతా కలిసి ఉండండి - ఆ ప్రస్తావనే వద్దు: దిగ్విజయ్

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సీనియర్లు అందరితో భేటీ అయి ఆయన వేర్వేరుగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి 8 వరకూ ఆయన గాంధీ భవన్‌లోనే ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దడానికి హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ పర్యటన నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా ఆయన తాజాగా గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్న (డిసెంబరు 22) గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సీనియర్లు అందరితో భేటీ అయి ఆయన వేర్వేరుగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి 8 వరకూ ఆయన గాంధీ భవన్‌లోనే ఉన్నారు. పార్టీలో అందరితో మాట్లాడానని పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

కాంగ్రెస్ నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర నేతలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారని, అందరూ కలిసి పని చేయాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. కలిసికట్టుగా ఉంటేనే ప్రత్యర్థుల్ని ఓడించగలమని అన్నారు. పార్టీ నేతలందరికీ చేతుల జోడించి చెబుతున్నానని, సమస్యలేమైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని హితవు పలికారు. పార్టీలో విబేధాలపై నేతలెవరూ బహిరంగంగా మాట్లాడొద్దని నిర్దేశించారు. బీఆర్ఎస్‌పై పోరాటానికి కాంగ్రెస్ నేతలంతా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పార్టీ పనితీరు వల్లే పార్టీ ముందుకు వెళ్తుందని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన 34 ఏళ్లకు, తాను 38 ఏళ్లకు పీసీసీ చీఫ్‌లుగా పనిచేశామని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతి సీఎంతో కలిసి పనిచేసి విజయం సాధించామని చెప్పారు. సీనియర్లు, జూనియర్లు అనే ప్రస్తావన వద్దని అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుందని అన్నారు.

జోడో యాత్రను ఆపాలని కేంద్రం కుట్ర - దిగ్విజయ్

‘‘భారత్ జోడో యాత్రను సక్సెస్ చేసినందుకు టీ కాంగ్రెస్ నేతలకు ధన్యవాదాలు. భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణను చూసి యాత్రను బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కరోనా సాకుతో యాత్రను అడ్డుకునే కుట్ర చేస్తుంది. బీజేపీ కార్యక్రమాలకు మాత్రం కరోనా అడ్డుకాదు. ఇదెక్కడి న్యాయం? కశ్మీర్ వరకు యాత్ర జరిగి తీరుతుంది. కేంద్రం మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించలేదు.. కానీ జోడో యాత్రను మాత్రం ఆపమంటుంది. కరోనా ఎక్కువ ఉన్న దేశాల నుండి వస్తున్న విమానాలను ఎందుకు ఆపడం లేదు?

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, మరిచారు. కేసీఆర్ కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేస్తున్నారు. దేశంలో బీజేపీ కూడా ఇదే చేస్తుంది. పార్లమెంట్ లో బీఆర్ఎస్, బీజేపీని సమర్థిస్తుంది. బీఆర్ఎస్ - బీజేపీకి లోపాయికారి సంబంధం ఉంది. ఎంఐఎం బీజేపీని గెలిపించేందుకు పనిచేస్తుంది. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ లు ఇచ్చింది కాంగ్రెస్. ఓవైసీ గుర్తించుకోవాలి. కేసీఆర్ కు ఎందుకు ఎంఐఎం మద్దతు ఇస్తుందో చెప్పాలి. 

‘‘పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలని నేతలకు చెబుతున్నా. అందరి అభిప్రాయాలు విన్నాను. బీజేపీ, బీఆర్ఎస్ లపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పార్టీలో అందరు ఐక్యంగా పనిచేయాలి. అప్పుడే గెలుస్తాం. పార్టీ నాయకులు మీడియా ముందు కాదు. ప్రజల పక్షాన రోడ్డెక్కి పోరాడండి. 99 శాతం హిందువులు ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించాం. దేశంలో ఎవరిది మునిగే పడవనో అర్థం చేసుకోవాలి. పార్టీలో సీనియర్ జూనియర్ అన్నది బేదం ఉండకూడదు’’ అని దిగ్విజయ్ సింగ్ హితవు పలికారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
Tamil Nadu Vijay: తమిళనాట బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితికి విజయ్- సీబీఐ నోటీసుల తర్వాత ఏం జరగనుంది?
తమిళనాట బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితికి విజయ్- సీబీఐ నోటీసుల తర్వాత ఏం జరగనుంది?
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
AP Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మరో రెండు రోజుల్లో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మరో రెండు రోజుల్లో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Embed widget