అన్వేషించండి

Telangana CM Revanth Reddy: రైతుల ఖాతాల్లో 18వేల కోట్లు వేశాం- ప్రధాని మోదీకి ఘాటు లేఖ రాసిన సీఎం రేవంత్

Telangana : సరైన సమాచారం లేకుండా ప్రధానమంత్రి మోదీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. వాస్తవాలు తెలుసుకోండని లేఖ రాశారు. నిజాలు తెలుసుకొని మరింత సాయం చేయాలని కోరారు.

Telangana CM Revanth Reddy: 9 నెలలుగా తెలంగాణలో అమలు చేసిన పథకాలు, ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం లెటర్ రాశారు. గత కొన్ని రోజులుగా తెలంగాణతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేసుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతున్నారు. అధికారంలోకి రావడానికి అనేక ఉచిత హామీలు ప్రకటిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతుందని విమర్శలు చేస్తున్నారు. జమ్ముకశ్మీర్, హర్యానా ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేస్తూ వచ్చారు. నిన్నటి నిన్న మహారాష్ట్రలో కూడా ఇదే విధమైన విమర్శలు చేశారు. 

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండటంతో ప్రధానమంత్రి చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన పనులను వివరిస్తూ లేఖ రాశారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలు అంటే గోల్డెన్ గ్యారెంటీలుగా ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రధానికి వివరించారు. ఆ వివరాలను ఎక్స్‌ సోషల్ మీడియా అకౌంట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పోస్టు చేశారు. 

రైతులను కాంగ్రెస్ పార్టీ హామీల పేరుతో నిలువునా మోసం చేసిందన్న ప్రధానమంత్రి విమర్శలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఇచ్చిన మాట ప్రకారం 22,22,067 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్టు వివరించారు. రైతుల ఖాతాల్లో 17,869.22 కోట్లు రూపాయలు వేసినట్టు గుర్తు చేశారు. 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ రుణం ఉన్న వారిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. వారి త్వరలోనే రుణమాఫీ చేయబోతున్నట్టు తెలిపారు. 
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో హామీ అమలు చేస్తూ వస్తున్నామని వివరించారు రేవంత్ రెడ్డి.

రుణమాఫీ విషయంలో కూడా కట్టుబడి మొదటి విడత రుణమాఫీని జులై 18న చేసినట్టు పేర్కొన్నారు. మొదటి విడతలో 11,34,412 మంది రైతుల ఖాతాల్లో 6034.97కోట్ల రూపాయలను వేశామని తెలిపారు. రెండో విడత కింద 6190.01 కోట్లు జమ చేశామని వివరించారు. ఆగస్టు 15న మూడో విడత 5644.24 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. అంకిత భావంతో వాళ్లకు ఇచ్చిన ప్రతి మాట అమలు చేస్తున్నామని తెలిపారు. వారిపై అప్పుల ఒత్తిడి లేకుండా చేయడమే ధ్యేయంగా పాలసీలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. 

తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మీ సహాయ సహకారాలు కావాలని ప్రధానమంత్రికి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇద్దరం కలిసి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొదించే ప్రయత్నాలు చేద్దామని పిలుపునిచ్చారు. తాము రైతులకు ఏం చేశామో అన్నీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు రేవంత్ రెడ్డి. అవే తమ చిత్తశుద్ధిని తెలియజేస్తాయని పేర్కొన్నారు. 

Also Read: 'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana TDP: కాసేపట్లో చంద్రబాబుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భేటీ- తెలంగాణ టీడీపీ దశ మారుతోందా?
కాసేపట్లో చంద్రబాబుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భేటీ- తెలంగాణ టీడీపీ దశ మారుతోందా?
Telangana CM Revanth Reddy: రైతుల ఖాతాల్లో 18వేల కోట్లు వేశాం- ప్రధాని మోదీకి ఘాటు లేఖ రాసిన సీఎం రేవంత్
రైతుల ఖాతాల్లో 18వేల కోట్లు వేశాం- ప్రధాని మోదీకి ఘాటు లేఖ రాసిన సీఎం రేవంత్
Swag First Weekend Collections : 'శ్వాగ్ ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - దారుణంగా దెబ్బేసిన వారాంతం -  ఇట్టాగైతే బ్రేక్ ఈవెన్ కష్టమే 
'శ్వాగ్ ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - దారుణంగా దెబ్బేసిన వారాంతం -  ఇట్టాగైతే బ్రేక్ ఈవెన్ కష్టమే 
Chennai Merina Beach: చెన్నై మెరీనా బీచ్‌ ఎయిర్ షోలో  తీవ్ర విషాదం - తొక్కిసలాటలో ఐదుగురు మృతి, 100మందికి పైగా ఆస్పత్రిపాలు
చెన్నై మెరీనా బీచ్‌ ఎయిర్ షోలో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో ఐదుగురు మృతి, 100మందికి పైగా ఆస్పత్రిపాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మెగా కంపౌండ్‌కి ప్రకాశ్ రాజ్ దూరమైనట్టేనా, పవన్‌తో ఎందుకీ గొడవ?మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana TDP: కాసేపట్లో చంద్రబాబుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భేటీ- తెలంగాణ టీడీపీ దశ మారుతోందా?
కాసేపట్లో చంద్రబాబుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భేటీ- తెలంగాణ టీడీపీ దశ మారుతోందా?
Telangana CM Revanth Reddy: రైతుల ఖాతాల్లో 18వేల కోట్లు వేశాం- ప్రధాని మోదీకి ఘాటు లేఖ రాసిన సీఎం రేవంత్
రైతుల ఖాతాల్లో 18వేల కోట్లు వేశాం- ప్రధాని మోదీకి ఘాటు లేఖ రాసిన సీఎం రేవంత్
Swag First Weekend Collections : 'శ్వాగ్ ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - దారుణంగా దెబ్బేసిన వారాంతం -  ఇట్టాగైతే బ్రేక్ ఈవెన్ కష్టమే 
'శ్వాగ్ ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - దారుణంగా దెబ్బేసిన వారాంతం -  ఇట్టాగైతే బ్రేక్ ఈవెన్ కష్టమే 
Chennai Merina Beach: చెన్నై మెరీనా బీచ్‌ ఎయిర్ షోలో  తీవ్ర విషాదం - తొక్కిసలాటలో ఐదుగురు మృతి, 100మందికి పైగా ఆస్పత్రిపాలు
చెన్నై మెరీనా బీచ్‌ ఎయిర్ షోలో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో ఐదుగురు మృతి, 100మందికి పైగా ఆస్పత్రిపాలు
Devaki Nandana Vasudeva : సూర్య, వరుణ్ తేజ్‌లతో మహేష్ మేనల్లుడు క్లాష్ - 'దేవకి నందన వాసుదేవ' రిలీజ్ డేట్!
సూర్య, వరుణ్ తేజ్‌లతో మహేష్ మేనల్లుడు క్లాష్ - 'దేవకి నందన వాసుదేవ' రిలీజ్ డేట్!
Drone Show: ఈ నెల 22, 23 తేదీల్లో అమ‌రావ‌తిలో డ్రోన్ సమ్మిట్‌- పోటీల్లో విజేతలకు భారీ ప్రైజ్ మనీ!
ఈ నెల 22, 23 తేదీల్లో అమ‌రావ‌తిలో డ్రోన్ సమ్మిట్‌- పోటీల్లో విజేతలకు భారీ ప్రైజ్ మనీ!
Kavya Kalyanram : స్టన్నింగ్​ లుక్​లో బలగం బ్యూటీ.. వెట్​ లుక్​లో హీట్​ ఎక్కిస్తున్న కావ్య కళ్యాణ్ ​రామ్
స్టన్నింగ్​ లుక్​లో బలగం బ్యూటీ.. వెట్​ లుక్​లో హీట్​ ఎక్కిస్తున్న కావ్య కళ్యాణ్​ రామ్
Travel Insurance: సెలవుల్లో టూర్ వెళుతున్నారా, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా, అది ఎందుకు ముఖ్యమో తెలుసా?
సెలవుల్లో టూర్ వెళుతున్నారా, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా, అది ఎందుకు ముఖ్యమో తెలుసా?
Embed widget