అన్వేషించండి

CM Revanth Reddy: 'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana News: రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీని ఏళ్ల పాటు సాగదీశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో నియామక పత్రాలు అందించారు.

CM Revanth Reddy Comments In Koluvula Festival: రాష్ట్రంలో కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఏళ్లపాటు సాగదీసిందని.. నోటిఫికేషన్ దశలోనే కొన్నేళ్ల పాటు ఉంచారని విమర్శించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన 'కొలువుల పండుగ' (Koluvula Festival) కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖలో ఉద్యోగాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 659 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 145 మంది వ్యవసాయ అధికారులు, 64 మంది లైబ్రేరియన్ల సహా 605 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించారు. తెలంగాణ పునఃనిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 'మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలన్న ఆలోచనతో ఆనాడు నేను చేపట్టిన 'విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్'కు మీరంతా మద్దతిచ్చారు. కేసీఆర్, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పాను. చెప్పినట్లే జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు లేక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువత నిరాశ చెందారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏళ్ల కొద్దీ వాయిదా పడుతోన్న ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు పరిష్కారం చూపింది.' అని రేవంత్ పేర్కొన్నారు.

'90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు'

రాష్ట్రంలో 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చి యువత తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసే విధంగా చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో 11,063 మందికి టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. ఓ వైపు వందేళ్ల అనుభవం ఉంటే.. మరోవైపు పదేళ్ల దుర్మార్గం ఉందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం అనే ముసుగు వల్ల కేసీఆర్ ఎన్నో ఏళ్లు గౌరవం పొందారని.. అది ఉద్యమ ఘనతే తప్ప ఆయనది కాదని విమర్శించారు. నమ్మకంతో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుందామని అన్నారు.

'మూసీని ప్రక్షాళన చేస్తాం'

ఇంజినీర్ల కృషి, గొప్పతనం ఈ సమాజానికి చాలా అవసరమని.. 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్ నిర్మాణం కాబోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. 55 కిలో మీటర్ల మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబెడతామని చెప్పారు. ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ నిర్మాణం కాబోతున్నట్లు పేర్కొన్నారు. 'మూసీ అంటేనే మురికి కూపమనే పేరు స్థిరపడింది. ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా.?. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్లు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల ఎవరి భూములు పోలేదా.?. మల్లన్న సాగర్ పేరుతో రైతులను బలవంతంగా ఖాళీ చేయించారు. మూసీ నిర్వాసితులకు మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తాం. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలి.' అని సీఎం పేర్కొన్నారు.

Also Read: Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Embed widget