అన్వేషించండి

SC Classification: హైదరాబాద్ లో మాదిగల ఆత్మగౌరవ భవనం, సదాలక్ష్మి విగ్రహం ఏర్పాటు: హరీష్ రావు హామీ

Harish Rao About SC Classification: రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

Telangana Assembly Elections 2023:

హైదరాబాద్‌: నవంబర్ 7, 11 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. అయితే రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్రానికి ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో సాధ్యమైనంత త్వరగా బిల్లు పాస్‌ చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు రానున్న మోదీని బీఆర్ఎస్ నేతలు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి వస్తున్నారంటే.. వారు తెలంగాణకు ఏం చేశారు, తాము అడిగినట్లు ఏ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చారు అని ప్రశ్నించడం పరిపాటిగా మారింది.

మంత్రి హరీష్ రావు ఆదివారం ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన మాదిగల యుద్ధభేరి సభ (ఎమ్మార్పీఎస్ సభ)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటయ్యాక అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రానికి పంపించామని చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తున్న మోదీ ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారుకు ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి లేదని, ఈ విషయంపై తాత్సారం చేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రానికి లేని ఇబ్బంది కేంద్రానికి ఏంటని ప్రశ్నించారు. మాదిగల ఆత్మగౌరవం పెరగాలి. హైదరాబాద్ లో సదాలక్ష్మి విగ్రహం ఏర్పాటు చేయాలని వారు కోరగా హరీష్ రావు అందుకు అంగీకరించారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి మాదిగల ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

దళితులలో అర్హులకు రూ.10 లక్షలు అందించి వారిని అభివృద్ధి చేయాలని దళితబంధును సీఎం కేసీఆర్ ప్రకటించారని చెప్పారు. కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డ తరువాత రాష్ట్రంలో 33 దళిత స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశామన్నారు. అయితే రాష్ట్రంలో భూమి కొరత కారణంగా ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇవ్వలేకపోయామని చెప్పారు. అందువల్లే వారి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో మోదీ పర్యటన షెడ్యూల్.. 
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. నవంబర్ 7న తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోడీ  హాజరుకానున్నారు. ఈ 11వ తేదీన పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు కూడా ముఖ్య అతిథిగా మోదీ రాబోతున్నారు. నాలుగు  రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రధాని రాష్ట్రానికి రానుండటం ఆసక్తి కలిగిస్తోంది. కానీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనతో మరోసారి రాజకీయం హీటెక్కనుంది. గత నెలలో నిజామాబాద్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌పై ప్రధాని సంచలన ఆరోపణలు  చేశారు. తన కుమారుడు కేటీఆర్‌ను సీఎంను చేయాలని.. కేసీఆర్‌ తనను అడిగగా, తాను ఒప్పుకోలేదని మోదీ సంచలన విషయాలు చెప్పారు. ఎన్డీయేలో చేరేందుకు కూడా కేసీఆర్‌ సిద్ధం కాగా, అందుకు తాను ఒప్పుకోలేదంటూ మరో సంచలనానికి తెరలేపారు.

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget