అన్వేషించండి

CM Revanth reddy: రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచండి- 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను పెంచాలని 16వ ఆర్థిక సంఘం కోరారు సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

16th Finance commission Meeting in TS: తెలంగాణ ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని 16వ  ఆర్థిక సంఘాన్ని కోరారు ముఖ్యమంత్రి. తెలంగాణ కొత్త రాష్ట్రమని, వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని అన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ కోసం సహకరించాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు రేవంత్‌రెడ్డి.

దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy). తెలంగాణకు బలైమన పునాదులు ఉన్నా... ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు. భారీ రుణ భారం తెలంగాణపై ఉందని... అది తెలంగాణకు ఒక పెద్ద సవాల్‌గా మారిందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ (Telangana) అప్పు 6లక్షల 85వేల కోట్లకు చేరిందన్నారు.రాష్ట్ర ఆదాయంలో సగభాగం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకే సరిపోతుందని అన్నారు రేవంత్‌రెడ్డి. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు తమ రాష్ట్రానికి కేంద్రం మద్దతు అవసరమని అన్నారు. రుణాల రీస్ట్రక్చర్‌కు అవకాశం ఇవ్వాలన్నారు రేవంత్‌రెడ్డి.  ఫిస్కల్‌ ఫెడరలిజాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం నుంచి సహకారం కోరుతున్నామన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులు ఆ దిశగా ఉండాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచండి...
కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని(16th Finance commission) కోరారు సీఎం రేవంత్‌రెడ్డి. గత పదేళ్లలో ప్రాజెక్టుల కోసం భారీగా అప్పులు చేశామరని... ఆదాయంలో అధికంగా రుణాల చెల్లింపులకే సరిపోతుందని చెప్పారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించాల్సి ఉందని... లేదంటే.. రాష్ట్ర పురోగతిపై పెను ప్రభావం పడుతుందన్నారు. రుణ సమస్యను పరిష్కరించుకునేందుకు తగిన సాయం, మద్దతు ఇవ్వాలని కోరారు.  కేంద్ర పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలన్న తమ డిమాండ్‌ నెరవేరిస్తే... దేశాన్ని ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని మోడీ లక్ష్యానికి తాము సహకరిస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణను ఒక ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు. దీని కోసం.. తెలంగాణ రాష్ట్రానికి తగిన ఆర్థిక సాయం చేయాలని కోరారు. 

కేంద్రం పథకాలపై ఏమన్నారంటే...
కేంద్రం ఇచ్చే పథకాలను వినియోగించుకోవాలంటే.. కఠినమైన నిబంధనలు విధిస్తున్నారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Batti Vikramarka). దీని వల్ల కేంద్ర పథకాలను వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. రాష్ట్రలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకునేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు. అంతేకాదు... రాష్ట్రానికి భారంగా మారిన రుణాల రీ-స్ట్రక్చరింగ్‌ చేయాలని కోరారు. రుణాల రీస్ట్రక్చరింగ్‌ చేసుకునే అవకాశం కల్పించలేకపోతే... అదనపు ఆర్థిక సాయమైనా చేయాలని కోరారు. 

16వ ఆర్థిక సంఘం సమావేశం గురించి....
తెలంగాణలో స్థానిక సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం ప్రజాభవన్‌లో సమావేశం అయ్యింది. డాక్టర్‌ అరవింద్‌ పనగారియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget