అన్వేషించండి

Sabarimala Special Trains: శబరిమలకు వెళ్తున్నారా? అయ్యప్ప భక్తుల కోసం స్పెషల్ రైళ్లు ఇవే

Ayyappa Devotees: అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపనుంది. సికింద్రాబాద్ నుండి కొల్లాం, కొట్టాయానికి ఈ రైళ్లు నడవనున్నాయి. 

Ayyappa Devotees: అయ్యప్ప సీజన్ మొదలు అయింది. కార్తీక పౌర్ణమికి చాలా మంది అయ్యప్ప మాలలు వేసుకున్నారు. మండల కాలంపాటు అంటే 41 రోజులు దీక్ష తీసుకుంటారు. ఈ 41 రోజుల పాటు అత్యంత నియమ నిష్ఠలు పాటించి అయ్యప్పను పూజిస్తారు. 41 రోజుల అయ్యాక స్వాములు శబరి యాత్రకు వెళ్తారు. అలా శబరి వెళ్లే అయ్యప్ప దీక్షాపరులు, అయ్యప్ప స్వామి భక్తుల కోసం రైల్వే శాఖ గొప్ప సౌకర్యాన్ని కల్పించనుంది. ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుండి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా కొల్లాం, కొట్టాయానికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లు తిరిగి కొల్లాం, కొట్టాయం నుండి సికింద్రాబాద్ కు నడుస్తాయని అధికారులు తెలిపారు. 

సికింద్రాబాద్ - కొల్లాం (07117) ఈ నెల 20, డిసెంబర్ 4, 18, జనవరి 8 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్ (07118) ఈ నెల 22, డిసెంబర్ 6, 20, జనవరి 10 తేదీల్లో నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్ - కొల్లాం(07121) ఈనెల 27వ తేదీ, డిసెంబర్ 11, 25, జనవరి 1, 15 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్ (07122) ఈ నెల 29, డిసెంబర్ 13, 27, జనవరి 3, 17 తేదీల్లో నడవనున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే సికింద్రాబాద్ - కొల్లాం(07123) ఈ నెల 21, 28 తేదీల్లో, కొల్లాం - సికింద్రాబాద్(07124) ఈ నెల 23, 30 తేదీల్లో, సికింద్రాబాద్ - కొట్టాయం (07125) ఈ నెల 20, 27 తేదీల్లో నడవనున్నాయి. కొట్టాయం - సికింద్రాబాద్ (07126) ఈ నెల 21, 28 తేదీల్లో నడుస్తాయని అధికారులు వెల్లడించారు. 

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో శబరిమల అయ్యప్ప ఆలయం ఒకటి. శబరిమలకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. అయితే ఎక్కువగా దక్షిణ భారతదేశానికి చెందిన వారు వెళ్తుంటారు. కార్తీక పౌర్ణమి నాడు చాలా మంది భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. వారు 41 రోజులు అయ్యాక సంక్రాంతి రోజున శబరిమలకు చేరుకుని అక్కడ జ్యోతి దర్శనం చేసుకుంటారు. తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్షను విరమిస్తారు. 

దాదాపు అందరూ దేవుళ్లకు భక్తులు దీక్ష తీసుకుంటారు. అయితే అయ్యప్ప దీక్ష చాలా కఠినంగా ఉంటుంది. చలికాలంలో తెల్లవారుజామునే లేచి చలినీళ్లతో స్నానం చేయడం దగ్గరి నుండి చాలా నియమ నిష్ఠలు పాటించాల్సి ఉంటుంది. అయ్యప్ప దీక్షాపరులు ఉదయం సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం చలినీళ్లతో స్నానం చేయాలి. తర్వాత దీపారాధన చేసి పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్నం బిక్ష, రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. అయ్యప్ప దీక్షాపరులు నలుపు వస్త్రాలు ధరించాలి. పాదరక్షలు ధరించకూడదు. దీక్షలో ఉన్న సమయంలో క్షవరం చేయుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం చేయకూడదని నియమం. 

41 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్నానం చేసి గుడికి వెళ్లాలి. స్వామియే శరణం అయ్యప్ప అనే మంత్రాన్ని ఎల్లవేళలా పఠిస్తూ ఉండాలి. ఎదుటి వారిని స్వామి లేదా అయ్యప్ప అని సంభోదించాలి. ఇలా 41 రోజుల పాటు కఠిన నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎలక్ట్రిక్ స్కూటిలో మంటలు! నొయిడాలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం! ఇద్దరు మృతి!
ఎలక్ట్రిక్ స్కూటిలో మంటలు! నొయిడాలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం! ఇద్దరు మృతి!
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Embed widget