అన్వేషించండి

Bhatti Vikramarka: తాకట్టు బంగారాన్ని విడిపించి, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని పరుగులు పెట్టించారు పీవీ: డిప్యూటీ సీఎం భట్టి

పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని, ఆయన ఆర్థిక సంస్కరణలతో దేశం మళ్లీ ట్రాక్ లోకి వచ్చిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

PV Narasimha Rao Jayanthi | హైదరాబాద్: ప్రధాని ఇందిరాగాంధీ తీసుకువచ్చిన భూ సంస్కరణలను ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అమలు చేసిన సంఘసంస్కర్త పివి నరసింహారావు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ వద్ద శనివారం ఆయన నివాళులు అర్పించిన అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ప్రధాని, భారతరత్న, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణం అన్నారు.

రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకువచ్చిన అనేక సంస్కరణలు సమాజానికి గొప్ప మేలు చేశాయి అన్నారు. అందరికీ ఒకే రకమైన విద్యాబోధన ఉండాలని ఈ దేశ మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ప్రజాస్వామ్య భావనకు పునాదులు వేశారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. పివి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశం ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉందని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆయన ఈ దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను గాడిలో పెట్టారని తెలిపారు.

భారత్‌ను బలమైన దేశంగా నిలిపారు..

తాకట్టులో ఉన్న దేశ బంగారాన్ని విడిపించి ఆర్థిక సంస్కరణలతో ప్రపంచంలో భారతదేశం ఒక బలమైన దేశంగా నిలబెట్టారని తెలిపారు. కాంగ్రెస్ పాలన కాలంలో 24 లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో పేదలకు పంపిణీ చేసిన  భూములను గత 10 సంవత్సరాలు పరిపాలించిన వారు ధరణి పేరుతో రకరకాల ఇబ్బందులకు గురిచేసి పేదల భూములను అన్యాక్రాంతం చేశారని విమర్శించారు. నాడు పంచిన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదల అస్తిత్వాన్ని, హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని వివరించారు.  పీవీ నరసింహారావు మార్గాన్ని ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా అమలు చేస్తుందని, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.


Bhatti Vikramarka: తాకట్టు బంగారాన్ని విడిపించి, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని పరుగులు పెట్టించారు పీవీ: డిప్యూటీ సీఎం భట్టి

పీవీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

మాజీ ప్రధాన మంత్రి , భారతరత్న పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. బహుభాషాకోవిదుడి గా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా తెలుగు వ్యక్తి అయిన పీవీ దేశానికి ఎనలేని సేవలను అందించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేనిదని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేంద్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సత్తుపల్లి మట్టా రాగమయి ,టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Advertisement

వీడియోలు

Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Embed widget