అన్వేషించండి

KTR vs Ponguleti: కేటీఆర్ ను మంత్రి పొంగులేటి ఎందుకు టార్గెట్ చేశారు? కారణాలు ఇవేనా!

ఓనాడు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు కేటీఆర్ అరెస్టు ఖాయమం అంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు.

Telangana News | ఓనాడు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్టు ఖాయమంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు.  ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.  ఇది కేవలం రాజీకీయ శతృత్వమా లేక వ్యక్తిగతంగా పొంగులేటి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో అటం బాంబులు పేలనున్నాయని, కేటీఆర్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పదే పదే వ్యాఖ్యనిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఏ సమావేశంలో పొంగులేటి పాల్గొన్నా, మీడియా సమావేశంలో పాల్గొన్నా కేటీఆర్ అరెస్ట్ ప్రస్తావన తెస్తూనే ఉన్నారు.  

 నాడు సన్నిహితులు, నేడు రాజకీయ శత్రువులు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత  2013లో వైకాపాలో చేరి 2014 ఎన్నికల్లో ఖమ్మం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.  తెలంగాణ ఉద్యమంలో ను పాల్గొన్నారు. వైకాపా తెలంగాణ వ్యతిరేక స్టాండ్ తీసుకోవడంతో పొంగులేటి టీఆర్ఎస్ చేరారు. అప్పటి నుండి టీఆర్ఎస్ లో  కేటీఆర్  తో అత్యంత సన్నిహితంగా  ఉన్నారు. అయితే 2018 ఎన్నికల్లో   ఎమ్మెల్యే టికెట్, 2019 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ టికెట్ ను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పొంగులేటికి ఇవ్వలేదు. దీంతో  క్రమ క్రమంగా పొంగులేటికి, గులాబీ పార్టీకి మధ్య దూరం పెరిగింది. పదేళ్ల కాలంలో   ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తారన్న  ఆశతో పొంగులేటి  ఉన్నారని పదే పదే ఈ విషయంలో కేటీఆర్ తో చర్చలు జరిగాయని  అయితే కేసీఆర్  ఇందుకు సముఖత వ్యక్తం చేయలేదని ఇటు గులాబీ నేతలు, అటు పొంగులేటి వర్గీయులు చెబుతారు. అలా కేసీఆర్ కు పొంగులేటికి మధ్య దూరం పెరిగిపోయంది.

చాలా ఇంటర్వ్యూల్లో సైతం తనకు రాజకీయంగా కేటీఆర్ మాట ఇచ్చారని, కేసీఆర్ తో  ఏం లేదని బహిరంగంగానే  చెప్పడం విశేషం. కాంగ్రెస్ లో చేరే ముందు కూడా పొంగులేటి కేసీఆర్  నే టార్గెట్ చేసి విమర్శలు చేశారు.  కేటీఆర్ తనకు సన్నిహితుడని చెప్పుకొచ్చారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ పొంగులేటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి  గెలిచిన పొంగులేటి మంత్రి అయ్యారు. ఈ క్రమంలో ఒకప్పడు సన్నిహితంగా మెగిలిన కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ పొంగులేటి మాట్లాడటం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది.

 రాజకీయ శత్రుత్వమా... వ్యక్తిగత వైరమా...

2018 ఎన్నికల్లో  పాలేరు నుంచి  తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ అభ్యర్థిగా నెలబెట్టింది. ఆ ఎన్నికల్లో తుమ్మల కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.  ఈ ఓటమికి కారణం పొంగులేటి అన్న ప్రచారం విరివిగా సాగింది. దీనిపై  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సైతం పొంగులేటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 లో  సిట్టింగ్ ఎంపీగా ఉన్న  పొంగులేటిని కాదని పార్టీలో చేరిన నామానాగేశ్వరరావుకు  కేసీఆర్ టికెట్ ఇచ్చారు.  అప్పటి నుండి 2023 వరకు పొంగులేటికి కేసీఆర్ ఏ పదవి ఇవ్వలేదు. అయితే పదే పదే తాను కేటీఆర్ తో మంతనాలు జరిపిన తర్వాతే  బీఆర్ఎస్ లో చేరారని, తనకు కేటీఆర్ న్యాయం చేస్తారని పొంగులేటి నాడు తన సన్నిహితుల వద్ద కొన్ని సార్లు మీడియా ముఖంగానే వ్యాఖ్యలు చేశారు.  మరోవైపు  ఖమ్మంలో  పువ్వాడ అజయ్ కి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించడం, తనను  పట్టించుకోకపోవడం కూడా పొంగులేటికి ఆగ్రహం తెప్పించినట్లు ఆయన వర్గీయులు చెబుతారు. అదే క్రమంలో కేటీఆర్  తన పరపతి ఉపయోగించి తనకు ఏం చేయలేకపోయారని, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తో మాట్లాడి  రాజకీయంగా న్యాయం చేయడంలో కేటీఆర్ విఫలం అయ్యారన్న  అసంతృప్తి పొంగులేటి ఉన్నట్లు చెబుతారు.  

ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరి మంత్రి అయిన పొంగులేటి ఇప్పుడు  కేటీఆర్ కు చుక్కలు చూపెడుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.  తనను పార్టీలో నిర్లక్ష్యం చేసినందుకు  తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న రీతిలో  కేటీఆర్ టార్గెట్ గా  పొంగులేటి  కామెంట్స్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.  రాజకీయ వైరం అయితే  క్యాబినెట్ లో అందరు మంత్రులు ఫార్ములా ఈ రేస్ వ్యవహారం లో మాట్లాడాల్సి ఉండగా, కేవలం పదే పదే పొంగులేటి మాట్లాడటం  ఇందులో భాగమేనా అన్న  ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

 పొంగులేటికి కేటీఆర్ రిటర్న్ పంచులు..

తన అరెస్టు మీద మాట్లాడుతున్న  పొంగులేటిపైన కేటీఆర్  తన దైన శైలిలో రిటర్న్ పంచులు ఇస్తున్నారు.  మంత్రి పొంగులేటి  డీజీపీనా, హోం మంత్రినా... బీఆర్ఎస్ నేతల  అరెస్టులు కోసం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఆ తర్వాత జైలుకు వెళ్లడానికి తాను రడిగానే ఉన్నానని చెప్పారు.  ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో  అక్రమాలు జరిగాయని, అందుకు కేటీఆర్ బాధ్యుడని మంత్రి పొంగులేటి తెలిపారు. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతిని ఏసీబీ కోరిందని, గవర్నర్ నుండి అనుమతి రాగానే  అరెస్టు చేయడం ఖాయమని మరో దఫా పొంగులేటి చెప్పడం విశేషం.  ఈ విషయం తెలిసే  ఢిల్లీ పెద్దలను కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని  చెప్పారు.

ఎమ్మెల్సీ కవితకు బైయిల్ ఎలా వచ్చిందో తమ వద్ద ఆధారాలున్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్ తాను ఇప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టానని దీనిపై అప్పుడే రూమర్లు సృష్టిస్తున్నారని  కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.  ఇదంతా చూస్తుంటే క్యాబినెట్ మంత్రుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రమే పదే పదే కేటీఆర్ టార్గెట్ గా మాట్లాడటం ఇప్పుడు అందరిలో ఆసక్తి కలుగజేస్తోంది. దీంతో పాటు ఈడీ కేసుల్లో పొంగులేటి జైలుకు వెళ్లడం ఖాయమని  కేటీఆర్ సైతం ధీటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు గులాబీ పార్టీలో సన్నిహితులుగా ఉన్న కేటీఆర్, పొంగులేటి మధ్య  ఈ రాజకీయ వైరం ఎక్కడి దాకా పోనుందో వేచి చూడాల్సిందే. 

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget