అన్వేషించండి

Priyanka Gandhi Telangana Visit: తెలంగాణకు మరోసారి ప్రియాంక గాంధీ, జులై మొదటి వారంలో మెదక్‌లో సభ!

Priyanka Gandhi Telangana Visit: తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రాబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Priyanka Gandhi Telangana Visit: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీ నాయకుల్లో ఫుల్ జోష్ తీసుకువచ్చింది. ఓటమి తర్వాత ఓటమి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ శ్రేణులకు ఈ విజయం ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల జోరు పెంచుతోంది. రాష్ట్రంలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఏఐసీసీ అగ్రనాయకులు హాజరయ్యేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో మరోసారి సభ నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది.

జూన్ చివరి వారంలో లేదంటే జులై మొదటి వారంలో ప్రియాంక సభ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ప్రియాంక గాంధీ పాల్గొన్న సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి నిర్వహించబోయే సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సభను మెదక్ జిల్లాలో నిర్వహించేందుకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. అలాగే వరుస కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.

గ్రామగ్రామానా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై సోమవారం గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. అలాగే రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి ఏఐసీసీ ముఖ్య నేత ఒకరిని పిలవాలని అనుకుంటున్నారు. రేపు జరగబోయే సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. బీసీ, మహిళా,  ఎస్సీ, ఎస్టీ తదితర డిక్లరేషన్లపైనా, భవిష్యత్ కార్యక్రమాలపైనా రాష్ట్ర నాయకులు చర్చిస్తారు. 

జీవో 111 రద్దును పునఃపరిశీలించాలి

తెలంగాణలో జీవో 111 రద్దు నిర్ణయంపై ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కోసమే జీవో 111 రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. జీవో 111పై వేసిన కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముందుగానే రైతుల నుండి భూములు కొని ఆ తర్వాతే జీవో 111 రద్దు చేశారని, ఒక్కో నేత వద్ద వందల ఎకరాల భూమి ఉందని జీవన్ రెడ్డి ఆరోపించారు. జీవో 111 పరిధిలో భూముల క్రయ విక్రయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. 

'రాష్ట్రాన్ని అమ్ముకుపోవడమే లక్ష్యం'

ఆరు నెలల్లో తెలంగాణను అమ్ముకుని పోవాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో భాగంగానే జీవో 111ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని భూములు అన్నీ రైతుల చేతుల్లో నుండి బడా బడా వ్యాపార వేత్తలు, బీఆర్ఎస్ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, వారి కోసమే జీవో 111ను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు. చెరువులన్నీ కబ్జా చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. హైదరాబాద్ జంట జలాశయాలను ఎలా కాపాడతారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Embed widget