By: ABP Desam | Updated at : 07 Feb 2023 10:17 PM (IST)
మిసెస్ ఇండియా రన్నరప్ గా తెలంగాణ మహిళ కిరణ్మయి
Mrs Kiranmayee Alivelu is Mrs India 2022 First Runner Up: అందాల పోటీల్లో తెలంగాణ మహిళ మరోసారి మెరిసింది. మిసెస్ ఇండియా 2022-23 పోటీల్లో పాల్గొన్న తెలంగాణకు చెందిన కిరణ్మయి అలివేలు సత్తా చాటారు. రాజస్థాన్ వేదికగా జరిగిన పోటీల్లో ఆమె మొదటి రన్నరప్ గా నిలిచారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఎంతో మంది పోటీలో పాల్గొనగా.. చివరికి 50 మంది ఫైనల్ చేరుకున్నారు. వీరికి జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 2 వరకు రాజస్థాన్ వేదికగా నిర్వహించిన మిసెస్ ఇండియా తుది పోటీల్లో తెలంగాణ ఆడపడుచు, హైదరాబాద్ కు చెందిన కిరణ్మయి చక్కని ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచారు. మిసెస్ ఇండియా విజేతల వివరాలను మంగళవారం ప్రకటించారు.
మమతా త్రివేదీకి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్
మిసెస్ ఇండియా తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మిసెస్ మమతా త్రివేదీ కిరణ్మయికి మెంటర్ గా వ్యవహరించారు. వీణా పుజారి కిరణ్మయికి దుస్తులు డిజైన్ చేయగా, 10 కేటగిరీల్లో 30 మందితో పోటీపడ్డారు. టాలెంట్ రౌండ్ , డాన్స్ రౌండ్ , సఫారీ రౌండ్ తో పాటు ఫ్యాషన్ రౌండ్స్ లో గట్టిపోటీ నడిచినప్పటకీ... జడ్జీలు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానమిచ్చిన ఆకట్టుకున్నారు. ఇదే పోటీల్లో డైరెక్టర్ కేటగిరీకి సంబంధించి బెస్ట్ డైరెక్టర్ అవార్డును మమతా త్రివేదీ గెలుచుకున్నారు.
కిరణ్మయి గతంలో 2019 మిసెస్ ఇండియా తెలంగాణ ఎట్రాక్టివ్ టైటిల్ అందుకున్నారు. వివాహం తర్వాత కూడా మహిళలు కుటుంబానికే పరిమితం కాకుండా ఏదైనా సాధించొచ్చు అని రుజువు చేసే ఉధ్ధేశంతో మిసెస్ ఇండియా పోటీలకు ఆమె సిద్ధమయ్యారు. దాదాపు 8 నెలల పాటు ప్రిపేర్ అయ్యి జాతీయ పోటీలకు అర్హత సాధించారు. జాతీయ పోటీల్లో గట్టిపోటీ ఎదుర్కొన్నప్పటకీ తన అందంతో పాటు మాట్లాడే తీరు, టాలెంట్, క్రియేటివిటీ వంటి అంశాల్లో ప్రతిభ కనబరిచి రన్నరప్ గా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా ఒక తెలంగాణ మహిళ నిలవడం ఇది రెండోసారి. కాగా ఈ విజయంపై కిరణ్మయి ఆనందం వ్యక్తం చేశారు. అందాల పోటీల్లో వివాహం తర్వాత కూడా మహిళలు రాణించొచ్చు అనుకునే వారికి తాను రోల్ మోడల్ గా నిలవాలనే లక్ష్యంతోనే జాతీయ పోటీల్లో పాల్గొన్నానని కిరణ్మయి చెప్పారు. ప్రపంచాన్ని మరింత అందంగా, ఆరోగ్యంగా చూసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. తెలంగాణ నుంచి మిసెస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచిన కిరణ్మయిని పలువురు అభినందించారు.
రెండేళ్ల కిందట ఖమ్మం మహిళ..
ఖమ్మం కేంద్రంలోని పాండురంగాపురం కాలనీకి చెందిన మహమ్మద్ ఫర్హా మిసెస్ ఇండియా పోటీల్లో రెండేళ్ల కిందట తళుక్కున మెరిశారు. అహ్మదాబాద్ లో జరిగిన వీపీఆర్ మిసెస్ ఇండియా 2021 పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు. ఆ ఏడాది మొత్తం 900కు పైగా వివాహితలు అందాల పోటీలకు రిజస్టర్ చేసుకుని పోటీ పడగా ఫైనల్ కు 41 మంది చేరుకున్నారు. తెలంగాణ నుంచి ఫైనల్ చేరుకున్న ఒక్క మహిళ మహమ్మద్ ఫర్హా కాగా, ఫైనల్లో మెరుగైన ప్రదర్శనతో ఫస్ట్ రన్నరప్ తో సరిపెట్టుకున్నారు.
Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు
Revanth Reddy : సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, గ్రూప్ 1 టాప్ స్కోరర్స్ జాబితాతో విచారణకు రేవంత్ రెడ్డి!
TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్పీఎస్సీ గుడ్బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్లైన్లోనే!
వివేక హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్- విచారణ 29కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
House Arrests: కాసేపట్లో సిట్ ముందుకు రేవంత్, ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల హౌజ్ అరెస్టులు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు
TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !
High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్
Kushi Release Date : సెప్టెంబర్లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?